HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Minister Jogi Ramesh Comments On Ysr Rythu Barosa

AP : వ్యవసాయాన్ని పండుగ చేసి రైతన్నలకు అండగా నిలబడింది జ‌గ‌నే – మంత్రి జోగి ర‌మేష్‌

వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతన్నలకు అన్ని రకాలుగా అండగా ఉన్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని

  • By Prasad Published Date - 09:07 PM, Tue - 7 November 23
  • daily-hunt
Jogi Ramesh

వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతన్నలకు అన్ని రకాలుగా అండగా ఉన్న మనసున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ అని మంత్రి జోగి రమేష్ అన్నారు. వ్యవసాయం దండగ అని హేళన చేసిన గత తెలుగుదేశం పాలకులకు చెంపపెట్టుగా వ్య‌వ‌సాయ‌న్ని పండుగ చేశారన్నారు. వరుసగా ఐదో ఏడాది రెండో విడత దేశంలో ఎక్కడా లేనివిధంగా సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతన్నలతో పాటు ఎస్సీ/ ఎస్టీ /బీసీ/ మైనార్టీ/ కౌలు రైతులు/ అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు కూడా వైయస్సార్ రైతు భరోసా కింద ఏటా 13,500 రూపాయిలు రైతు భరోసా పథకం ద్వారా అందిస్తున్నామ‌న్నారు.
అపర భగీరధుడు, రైతు బాంధవుడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతాంగం సంక్షేమానికి ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వస్తే, నేడు వారి తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రివి మించిన తనయుడుగా, తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే, నేడు సీఎం జగన్ పది అడుగులు ముందుకు వేస్తూ రైతులకు మేలు చేసే విధంగా ఎన్నో చారిత్రాత్మక పథకాలు పెట్టిన ఘనత పొందారని మంత్రి ప్రశంసించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక పూర్తిగా వ్యవసాయ రంగం మీద ఆధారపడిన పెడన నియోజకవర్గం లోని రైతులకు వరుసగా ఐదో ఏడాది, రెండో విడత 13,500 రూపాయిలు రైతు భరోసా పథకం కింద ఈరోజు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ మండలాలు వారీగా లబ్ధిదారుల సంఖ్య మరియు వారు పొందిన లబ్ధి వివరాలు  వెల్లడించారు. బంటుమిల్లి మండలంలోని 5,326 మంది రైతులకు 2 కోట్ల 22 లక్షల 54 వేల 500 రూపాయిలు, గూడూరు మండలంలోని 8,739 మంది రైతులకు 3 కోట్ల 69 లక్షల 6 వేల రూపాయలు, కృత్తివెన్ను మండలంలోని 3,246 మంది రైతులకు ఒక కోటి 37 లక్షల 96 వేల 500 రూపాయిలు మరియు పెడన మండలంలోని 9,886 మంది రైతులకు 4 కోట్ల 11 లక్షల 55 వేల రూపాయిలు వెరసి మొత్తం 27,197 మంది రైతులకు ఈరోజు 11 కోట్ల 41 లక్షల 12 వేల రూపాయిల నగదు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని మంత్రి జోగి రమేష్ వివరించారు.

Also Read:  Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్పీఎఫ్ జవాన్ కు తీవ్ర గాయాలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP Minister Jogi ramesh
  • cm jagan
  • YSR Rythu Bharosa
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

Latest News

  • Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd