HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Ka Paul Went To Turkey During The India Pakistan Tensions What Did He Do

KA Paul In Turkey: టర్కీలో కేఏ పాల్.. మిస్సైళ్లు, డ్రోన్లపై సంచలన కామెంట్స్

యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

  • Author : Pasha Date : 14-05-2025 - 10:29 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ka Paul In Turkey India Pakistan Tensions Andhra Pradesh  

KA Paul In Turkey:  భారత్ – పాకిస్తాన్ సైనిక ఘర్షణలపై ఇటీవలే సంచలన కామెంట్స్ చేసిన ప్ర‌జాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ టర్కీలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ మ‌హ‌దీ అనే వ్య‌క్తితో క‌లిసి ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ‘‘పాకిస్తాన్‌కు ట‌ర్కీ మిస్సైల్స్, డ్రోన్లు అమ్మిన  మాట నిజమేనని నాకు ఇక్కడి వాళ్లు చెప్పారు. పాకిస్తాన్‌కు మిస్సైల్స్, డ్రోన్లు వెళ్లకుండా ఆపేందుకే నేను టర్కీకి వచ్చాను. అయితే ఇప్పటివరకు పాకిస్తాన్‌కు అమెరికా మిస్సైల్స్, డ్రోన్లు అమ్మ‌లేదా ?’’ అని ఆయన ప్ర‌శ్నించారు. ‘‘ట్రంప్ ఇప్పుడు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లారు. ఆ దేశానికి ట్రిలియన్ డాలర్లు విలువైన ఆయుధాలను అమ్మడమే ట్రంప్ టార్గెట్. ఆయుధాలను అమ్మడం, యుద్ధాలను క్రియేట్ చేయడం సరికాదు. ప్రపంచంలో శాంతి రావాలంటే యుద్ధాలు ఆగాలి. ఆయుధాలు విక్రయాలు తగ్గాలి’’ అని  కేఏ పాల్ వ్యాఖ్యానించారు.

Dr. K.A Paul , Chairman Mahdi from Turkey and Prez Trump selling Military warfare equipment to Saudi Arabia. Millions are already dead in the Middle East and Trillions of dollars are wasted. STOP NOW stupid wars. Watch and share to all peace makers . pic.twitter.com/PhSaurL6VZ

— Dr KA Paul (@KAPaulOfficial) May 13, 2025

ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడిని పెంచాలి

‘‘పశ్చిమాసియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో ఇప్పటివరకు లక్షలాది మంది అమాయ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాల్లోనూ ఎంతోమంది చనిపోయారు. ప్రజలు, సైనికుల ప్రాణాలు చాలా విలువైనవి. వాళ్ల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడకూడదు. ప్రజలు కూడా ఈ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచాలి’’ అని ఆయన హితబోధ చేశారు. ‘‘భవిష్యత్తులో ప్రపంచంలో న్యూక్లియ‌ర్ వార్ జరిగితే.. ల‌క్షలు కోట్ల మంది చ‌నిపోతారు. ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం టైంలోనూ నేను అక్కడికి వెళ్లాను. యుద్ధం ఆపాలని కోరాను. ఈ ప్రపంచానికి యుద్దాల‌ను మొద‌లుపెట్టే నాయకత్వం అక్కర్లేదు. యుద్ధాలను ఆపే నాయకత్వం కావాలి’’ అని కేఏ పాల్(KA Paul In Turkey) తెలిపారు.

Also Read :Jaishankars Security: జైశంకర్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ కారు.. 25 మంది నేతలకు భద్రత పెంపు

మే 11న ముంబైలో కేఏ పాల్..  ఏమైందంటే.. 

మే 11న ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్‌‌ టీమ్‌ను విమానం ఎక్కకుండా ముంబై ఎయిర్‌పోర్టులో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆరోజు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సీఈఓ, సంబంధిత సిబ్బందిపై ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాంతి చర్చల కోసం తాను టర్కీకి వెళ్తుంటే విమానం ఎక్కనివ్వలేదని ధ్వజమెత్తారు. ‘‘నేను 37 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలు చేస్తున్నానున. తాజాగా భారత్- పాక్ ఉద్రిక్తతల గురించి ట్రంప్, అమెరికా సెనేటర్లతో కూడా ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు టర్కీకి వెళ్తుంటే అడ్డుకున్నారు’’ అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read :Earthquakes : 8 దేశాల్లో భూకంపం.. గ్రీస్‌ నుంచి జోర్డాన్‌ దాకా భూప్రకంపనలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • india
  • India Pakistan Tensions
  • ka paul
  • KA Paul In Turkey
  • pakistan
  • Turkey

Related News

South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ జాంటీ రోడ్స్‌తో భేటీ అయ్యారు. క్రీడల్లో తన అభిరుచి, క్రమశిక్షణ, నైపుణ్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో తరాల క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన జాంటీ రోడ్స్‌ను కలవడం ఆనందంగా ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ భేటీలో క్రీడలు, యువత అభివృద్ధ

  • Another key project for AP from the Central Government: An NCC Special Directorate.

    Andhra Pradesh: ఏపీకి కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టు.. ఎన్‌సీసీ ప్రత్యేక డైరెక్టరేట్‌

  • MSME Parks Offer Massive Job Opportunities for Youth: Minister Bharat

    TG Bharath: యువతకు ఉపాధి కల్పనలో ఎంఎస్‌ఎంఈ పార్కులు భారీ ఉద్యోగ అవకాశాలు: మంత్రి భరత్

  • Union Minister Rajnath Singh

    Rajnath Singh: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్‌

  • Village development in AP: Centre allocates Rs 16,627 crore.

    ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd