HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Jagans Delhi Files 26 On Hastina Bata

Delhi Files: జగన్ ఢిల్లీ ఫైల్స్, 26న హస్తిన బాట

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ (Delhi) వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 27న జరిగే అధికారిక జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటారు అనేది సీఎంఓ అధికారికంగా చెప్పే షెడ్యూల్

  • Author : CS Rao Date : 16-05-2023 - 5:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Delhi Tour for favour
Jagan's Delhi Files, 26 On Hastina Bata

Jagan’s Delhi Files : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ (Delhi) వెళ్ళడానికి ముహూర్తం పెట్టుకున్నారు. ఈ నెల 27న జరిగే అధికారిక జరిగే నీతి ఆయోగ్ మీటింగ్ లో పాల్గొంటారు అనేది సీఎంఓ అధికారికంగా చెప్పే షెడ్యూల్. కానీ, అనధికారిక భేటీలు చాలా ఉన్నాయని తెలుస్తుంది. కర్ణాటక ఎన్నికల తరువాత సౌత్ పాలిటిక్స్ మీద బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పోకడను మార్చడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో ముందస్తు అంశం కూడా ఈ సారి ఢిల్లీ (Delhi) పర్యటనతో తేలనుంది.

ఎలాంటి ఇగోలు లేకుండా బీజేపీ స్వయంగా దిగి వచ్చి చేతులు కలుపుతుందని తెలుగుదేశం జనసేన అంచనా. ఇలాంటి పరిణామం మధ్య జగన్ ఢిల్లీ టూర్ ప్రతి సారిలా కాకుండా కొంత ఉత్కంఠ రేపుతోంది.

ఈ నెల 27న ఢిల్లీలోని కేంద్ర విజ్ఞాన్ భవన్ లో నీతి అయోగ్ మీటింగ్ జరుగుతోంది. ఈ మీటింగ్ కి దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలు వస్తారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఈ మీటింగ్ కోసం జగన్ ఢిల్లీ (Delhi) వెళ్తున్నారు. అయితే ఒక రోజు ముందే అంటే మే 26న ఆయన ఢిల్లీకి వెళ్లడమే కీ పాయింట్. ఆ రోజు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారని తెలుస్తుంది.

అమిత్ షా తో భేటీ అంటేనే రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ఇక ఆ మరుసటి రోజు 27న నీతి అయోగ్ మీటింగ్ తరువాత ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ ప్రత్యేకంగా భేటీ అవుతారు. ఈ భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకు వస్తాయని అంటున్నారు. పోలవరం ప్రత్యేక హోదా సహా విభజన సమస్యల మీద మోడీ షాలతో జగన్ మాట్లాడుతారు. రాజకీయ అంశాలు కూడా చర్చకు వస్తాయని వైసీపీలో ని టాక్.
వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసీలు ఇచ్చిన తరువాత ఇటీవల జగన్ అమిత్ షాను కలిశారు. కానీ ప్రధానిని కలిసింది లేదు. ఈ సారి మోడీతో జగన్ ఏమి మాట్లాడుతారు ఇద్దరు మధ్య ఎలాంటి చర్చలు సాగుతాయన్నది ఇపుడు ఏపీ రాజకీయ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న అంశం.

కన్నడ ఫలితాలతో బీజేపీ సౌత్ లో ఏ రకంగా ముందుకు కదలబోతోంది బీజేపీ మనసులో ఉద్దేశ్యాలు ఏంటి అన్నది అమిత్ షా మోడీలతో భేటీ సందర్భంగా జగన్ కు సంకేతాలు వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఏపీలో జనసేన టీడీపీ కూటమిగా ఉండే చాన్స్ ఉంది. దాంతో ఆ కూటమిలో బీజేపీ కూడా చేరవచ్చు అని వార్తలు ప్రచారంలో ఉన్న నేపధ్యంలో అలాంటి అవకాశాలు ఎంతమేరకు ఉన్నాయి? అసలు బీజేపీకి ఆ ఆలోచన ఉందా?ఉంటే ఏ విధంగా చేస్తుంది? అనేది కూడా జగన్ ఈ భేటీ ద్వారా ఎంతో కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.

ప్రాంతీయ పార్టీలతో పొత్తులకు బీజేపీ రెడీ అవుతోంది.ఒంటరిగా వెళ్తే దెబ్బ తింటామన్న సందేశాన్ని కర్నాటక ఫలితం అందించింది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఏపీలో పొత్తును టీడీపీ ఆహ్వానిస్తోంది. వైసీపీ బీజేపీతో తెర వెనక దోస్తీకే ప్రాధాన్యత ఇస్తోంది.

తెర వెనుక వైసీపీకి మద్దతు ఇస్తూ ఎంత వరకూ ఏపీలో రాజకీయంగా ఉనికిని చాటుకోగలమన్న సందేహాలు కమలం పార్టీలో లేకపోలేదు. వైసీపీతో కూడా పొత్తు విషయం చర్చించవచ్చు. అయితే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీ ఓటు బ్యాంక్ మునుగుతుంది. కాబట్టి వైసీపీ పొత్తులకు నో చెబుతుంది. అయితే 2024 లోక్ సభ ఎన్నికల తరువాత బీజేపీకి సీట్లు కేంద్రంలో తగ్గితే వైసీపీ సాయం చేయవచ్చు. కేంద్రంలో మద్దతు చూసుకుని వైసీపీకి బీజేపీ అండగా ఉంటుందా? లేక తెలంగాణా ఏపీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీతో పొత్తుకు ఓకే చెబుతుందా? అనేది ఆసక్తికరం. ఢిల్లీ (Delhi) జగన్ పర్యటన చాలా ప్రశ్నలకు సమాధానం ఇస్తుందని రాజకీయ సర్కిల్స్ లోని అభిప్రాయం. ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:  CSK Ben Stokes: స్వదేశానికి చెన్నై స్టార్ ఆల్ రౌండర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Bata
  • delhi
  • Hastina
  • india
  • jagan
  • jagan mohan reddy
  • politics

Related News

Andhra Pradesh

ఏపీకి మరో భారీ పరిశ్రమ

ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి. ఇటవలి కాలంలో రాష్ట్రానికి భారీ పరిశ్రమలు వచ్చాయి. తాజాగా రాయలసీమకు మరో భారీ పరిశ్రమ రాబోతోంది. రూ.10,239 కోట్ల పెట్టుబడితో ఆర్‌ఆర్‌పీ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ సెమీ కండక్టర్ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శ్రీసత్యసాయి జిల్లాలో 30 ఎకరాలను కేటాయించారు. ఈ పరిశ్రమకు సంబంధించి తొలిదశలో రూ.3,267.69 కోట్లు, రెండో దశలో రూ.6,972.09 కోట్లు పెట్టుబడి

  • Chandrababu Naidu

    TDP కార్యకర్త ఎప్పుడూ మీసం మెలేసి నిలబడతాడు – CBN

Latest News

  • Toing : వైజాగ్‌లో ‘టోయింగ్’ యాప్ సేవలు ప్రారంభం

  • Toll Plaza : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగే పనేలేదు !!

  • West Bengal Election : ఆ రెండు నియోజకవర్గాల్లో రీపోలింగ్!

  • Peddi : ఎట్టకేలకు పెద్ది రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

  • US Prepping Iran Attack Again : ఇరాన్ పై మరోసారి దాడికి సిద్దమైన అమెరికా ?

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd