HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Instead Of Six Type Of Schools In Andhra Pradesh Four Type Of Schools From The Next Academic Year

Four Type Schools : ఏపీలో ఇక నాలుగు రకాల ప్రభుత్వ స్కూల్స్.. జరగబోయే మార్పులివీ

ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.

  • Author : Pasha Date : 14-12-2024 - 9:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Four Type Schools Andhra Pradesh Govt Schools

Four Type Schools : గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో  6 రకాల ప్రభుత్వ స్కూల్స్ ఉండేవి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నుంచి 4 రకాల ప్రభుత్వ స్కూల్స్ అందుబాటులో ఉంటాయి. ఈమేరకు రాష్ట్రంలోని పాఠశాల విద్యా వ్యవస్థను టీడీపీ ప్రభుత్వం మార్చనుంది. ప్రాథమికోన్నత, హైస్కూల్‌ ప్లస్‌ విధానాలను రద్దు చేసేందుకు చంద్రబాబు సర్కారు రెడీ అవుతోంది.

Also Read :One Nation One Election : 16న లోక్‌సభ ఎదుటకు ‘జమిలి’ బిల్లులు.. ఎన్నికలపై కీలక సవరణలివీ

వైఎస్సార్ సీపీ హయాంలో జరిగిన నష్టమిదీ..

వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడానికి ముందు  ఏపీలో 3,4,5 తరగతులు ప్రాథమిక పాఠశాలల కేటగిరీలో ఉండేవి. అయితే జగన్ సీఎం అయ్యాక 3,4,5 తరగతులను హైస్కూల్‌ ప్లస్‌ విధానంలో కలిపేశారు.  3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు హైస్కూల్‌ ప్లస్‌ విధానంలో ఉంటాయని అప్పట్లో ప్రకటించారు.  మండలానికి రెండు చొప్పున జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 3, 4, 5 తరగతులను ప్రాథమిక పాఠశాలల కేటగిరీ నుంచి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ఉమ్మడి కేటగిరీలోకి మార్చారు. ఈ పరిణామంతో 12,247 ఫౌండేషన్, ఫౌండేషన్‌ ప్లస్‌ ప్రభుత్వ పాఠశాలలు ఏకోపాధ్యాయ బడులుగా మారాయి. ఫలితంగా ఎంతోమంది ప్రభుత్వ బడుల విద్యార్థులు ప్రైవేటుకు(Four Type Schools) వెళ్లిపోయారు. అందుకే ఈ విధానాన్ని ఇప్పుడు టీడీపీ సర్కారు ప్రక్షాళన చేస్తోంది.

Also Read :30-30-30 Method : 30-30-30 పద్ధతి అంటే ఏమిటి? పొట్ట కొవ్వును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది..!

మోడల్‌ ప్రాథమిక పాఠశాలలు..

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే పూర్వ ప్రాథమిక విద్య (1, 2 తరగతులు), ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు కలుపుకొని మోడల్‌ ప్రాథమిక పాఠశాలలుగా ఏర్పాటు చేయనున్నారు. వీటిలో ప్రతి తరగతికీ ఒక్కో టీచర్‌ చొప్పున గరిష్ఠంగా ఐదుగురిని ఇస్తారు. పిల్లల సంఖ్య 120కి మించితే ప్రధానోపాధ్యాయుడి పోస్టును కూడా కేటాయిస్తారు. 6 నుంచి 10 తరగతులతో హైస్కూళ్లు ఉంటాయి. అంగన్‌వాడీ కేంద్రాలు పూర్వ ప్రాథమిక విద్య(1, 2 తరగతులు)తో శాటిలైట్‌ ఫౌండేషన్‌ బడులుగా కంటిన్యూ అవుతాయి. మొత్తం మీద వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో నాలుగు రకాల పాఠశాలల వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. ప్రాథమిక పాఠశాలలే మూడు కేటగిరీల్లో ఉండనున్నాయి.ప్రాథమికోన్నత, హైస్కూల్‌ ప్లస్‌ విధానాలు రద్దవుతాయి.

6, 7, 8 తరగతుల్లో కీలకమైన మార్పు ఇదీ.. 

1 నుంచి8వ తరగతి వరకు ఉండే ప్రాథమికోన్నత బడుల విధానాన్ని రద్దు చేయనున్నారు. వీటిలో విద్యార్థుల సంఖ్య తక్కువ ఉంటే దాని గ్రేడ్‌‌ను తగ్గిస్తారు. స్టూడెంట్స్ సంఖ్య ఎక్కువ ఉంటే దాని గ్రేడ్‌ను పెంచుతారు. ప్రస్తుతమున్న  ప్రాథమికోన్నత బడులలోని  6, 7, 8 తరగతుల్లో 30 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే వాటిని ప్రైమరీ స్కూల్స్‌గా మారుస్తారు. అక్కడి  6, 7, 8 తరగతుల విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ హైస్కూళ్లకు తరలిస్తారు.  ఒకవేళ ఐదు కిలోమీటర్లలోపు  దూరంలో హైస్కూల్ లేకుంటే.. స్థానికంగానే ప్రాథమికోన్నత పాఠశాలను నిర్వహిస్తారు. ఒకవేళ 6, 7, 8 తరగతుల్లో 31 నుంచి 59 మంది విద్యార్థులు ఉంటే ఆ స్కూలు గ్రేడ్‌‌పై స్థానిక పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతమున్న ప్రాథమికోన్నత బడులలోని 6, 7, 8 తరగతుల్లో 60 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే దాన్ని వెంటనే హైస్కూలుగా మార్చేస్తారు.  హైస్కూల్‌ ప్లస్‌లోని ఇంటర్మీడియట్‌ను ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ విద్యా శాఖకు అప్పగిస్తారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • academic year
  • andhra pradesh
  • ap govt
  • AP schools
  • Four Type Schools

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd