HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >India To Be No 1 Economy By 2047 Cm Chandrababu

CM Chandrababu: 2047 నాటికి నంబ‌ర్ వ‌న్‌ ఆర్థిక వ్యవస్థగా భారత్: చంద్రబాబు

గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.

  • Author : Gopichand Date : 06-03-2025 - 11:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Chandrababu
CM Chandrababu
  • 2047 నాటికి నెం.1 ఆర్థిక వ్యవస్థగా భారత్
  • ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోనే సాధ్యం
  • అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో భారతీయులు
  • ప్రపంచవ్యాప్తంగా నాకు అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు

CM Chandrababu: రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2047 నాటికి భారతదేశం నెం.1 ఆర్థిక వ్యవస్థగా మారుతుందని, ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో భారతీయులు ముందుంటారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అన్నారు. భారతీయులను యూదు సమాజంతో పోలుస్తూ, ప్రపంచంలో అత్యంత సంపన్నులుగా, ప్రభావవంతమైన వ్యక్తులుగా భారతీయులు ఉన్నారని అన్నారు. గురువారం ఢిల్లీలో రిపబ్లిక్ ప్లీనరీ సమ్మిట్‌లో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు అంశాలపై మాట్లాడారు.

భారతీయుల ప్రతిభ ప్రతిబింబిస్తోంది

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాంతాల్లో భారతీయులు సంపన్నులుగా ఉన్నారని, ఇది వారి ప్రతిభను ప్రతిబింబిస్తుందని సీఎం అన్నారు. అమెరికాలో భారతీయుల సగటు ఆదాయం మిగిలిన వర్గాల కంటే రెట్టింపని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం కలిగిన భారతీయుల్లో 33 శాతం మంది తెలుగు కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారని అన్నారు. భారతదేశ వృద్ధికి ముఖ్యంగా మూడు రంగాలపై దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి వివరించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ద్వారా ఐటీ నుంచి ఏఐ కి మారడం… గ్రీన్ హైడ్రోజన్‌లో అభివృద్ధి సాధించడం… మానవ వనరులని బలోపేతం చేయడంపై తమ లక్ష్యమన్నారు. ఈ రంగాలపై దృష్టి సారించడం వల్ల భారతీయులు ప్రపంచంలోనే అత్యుత్తమ శ్రామిక శక్తిగా, ఆవిష్కర్తలుగా మారతారని అన్నారు.

భారతదేశానికి జనాభానే బలం

భారతదేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు ఉన్నందున, భారతదేశానికి జనాభా ప్రయోజనం ఉంది. చైనా, జపాన్ జనాభా తగ్గడం భారతదేశానికి కలిసొచ్చే అంశమని దానిని దేశ అభివృద్ధికి తెలివిగా వినియోగించుకోవాలని చెప్పారు. ఇద్దరు పిల్లల కంటే తక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులని చేసే విధానంపై కేంద్రం ఆలోచన చేయాలని సూచించారు.

Also Read: Telangana: నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 10వేల‌కు పైగా ఉద్యోగాలు!

అమరావతి పునర్నిర్మాణం

గత కొన్నేళ్లుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఏపీ రాజధాని అమరావతిని పునరుజ్జీవింపజేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రపంచంలోనే ప్రత్యేకమైన సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌ను ఉపయోగించి 29,000 మంది రైతుల దగ్గర నుంచి 35,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారని గుర్తు చేశారు. ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని, దానిని మళ్లీ గాడిలోకి తీసుకువస్తామని చెప్పారు.

చారిత్రాత్మక విజయం

2024 ఎన్నికల్లో టీడీపీకి 93 శాతం స్ట్రైక్ రేట్, 57శాతం ఓట్ షేరును సాధించిందని ముఖ్యమంత్రి అన్నారు. తన నాయకత్వానికి ప్రజలు బలమైన మద్దతును ఇచ్చారని అన్నారు. తాను ఎలాంటి నేరం చేయకుండా అరెస్టు చేస్తే, ప్రజలంతా ఆ సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. గవర్నెన్స్ అంటే కేవలం హార్డ్ వర్క్ మాత్రమే కాకుండా తెలివిగా ఉండాలని, 1,000 సేవలను మీ సేవ – వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్నామని అన్నారు.

భారతదేశం ముందున్న మార్గం

భారతదేశ అభివృద్ధిని ఆపలేమని చంద్రబాబు అన్నారు. రానున్న 10-15 ఏళ్లలో భారతీయ నిపుణులు సేవా రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తారని అంచనా వేశారు. నేటి ప్రపంచంలో దూరం అనేది ఒక పరిమితి కాదని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhrapradesh news
  • AP CM CBN
  • CM Chandrababu
  • New Delhi
  • pm modi
  • Republic Plenary Summit

Related News

Chandrababu

iGOT కర్మయోగి పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సరికొత్త జాతీయ రికార్డు సృష్టించింది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu  ప్రభుత్వ ఉద్యోగుల నైపుణ్యాలను పెంచే ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్‌లో ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది అద్భుతమైన వార్త అని, ప్రభుత్వ ఉద్యోగులు నిరంతర అభ్యాసంపై చూపుతున్న నిబద్ధతకు ఈ ఘనత నిదర్శనమని ఆయన అన్నారు. నైపుణ్యం, చురుకుదనం, భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పరిపాలనను నిర్మించడమే తమ లక్ష్యమని

  • Survey

    ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

  • Ap Sanjeevani Scheme

    త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ – సీఎం చంద్రబాబు

  • Cm Chandrababu & Minister N

    మహారాష్ట్రకు చంద్రబాబు, లోకేశ్

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • అజిత్ పవార్ హఠాన్మరణం.. మహారాష్ట్ర త‌దుప‌రి డిప్యూటీ సీఎం ఎవ‌రు?

  • విరాట్ కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. కింగ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పునరుద్ధరణ!

  • మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd