HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >I Entered Politics With The Aim Of Serving The Public Cm Chandrababu

ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చాను: సీఎం చంద్రబాబు

తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు.

  • Author : Latha Suma Date : 28-12-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
I entered politics with the aim of serving the public: CM Chandrababu
I entered politics with the aim of serving the public: CM Chandrababu

. ఐఏఎస్ అవ్వమన్నా ప్రజాసేవకే ప్రాధాన్యతనిచ్చానన్న చంద్రబాబు

. తన అర్ధాంగి నారా భువనేశ్వరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడిన సీఎం

. విలువలతో కూడిన విద్యతోనే సమాజంలో గుర్తింపు సాధ్యమని హితవు

CM Chandrababu Naidu:హైదరాబాద్‌ గండిపేటలోని ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. తన జీవిత ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, అనేక మంది తనను ఐఏఎస్ అధికారి కావాలని సూచించినప్పటికీ, ప్రజలకు నేరుగా సేవ చేయాలనే తపనతో రాజకీయాలను ఎంచుకున్నానని వెల్లడించారు. యూనివర్సిటీ రోజుల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించానని, అతి తక్కువ కాలంలోనే మంత్రిగా, ఆపై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనుభవాలను ఆయన పంచుకున్నారు. ప్రస్తుతం నాలుగోసారి ముఖ్యమంత్రిగా సేవ చేసే అవకాశం రావడం తనకు గర్వకారణమని తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఈ బాధ్యత మరింతగా నిర్వర్తించాలనే సంకల్పంతో ఉన్నానన్నారు.

ఈ సందర్భంగా తన సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరిపై ముఖ్యమంత్రి ప్రశంసల జల్లు కురిపించారు. తాను రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్న సమయంలో, అయిష్టంగానే హెరిటేజ్ సంస్థ బాధ్యతలు స్వీకరించిన భువనేశ్వరి, తన పట్టుదలతో ఆ సంస్థను విశేషంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. నేను ఇప్పటికీ కాగితం చూసి మాట్లాడుతుంటే, ఆమె ట్యాబ్ ఉపయోగించి ప్రసంగిస్తున్నారు. నేను టెక్నాలజీ గురించి చెబుతుంటాను, ఆమె దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు అంటూ హాస్యంగా వ్యాఖ్యానించారు. మామగారు ఎన్టీఆర్‌లాగే భువనేశ్వరికి కూడా పట్టుదల, మొండితనం ఉన్నాయని, ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేసే వరకూ వదలరని పేర్కొన్నారు. భార్యగా, తల్లిగా, వ్యాపారవేత్తగా, ట్రస్టీగా అనేక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. హెరిటేజ్ సంస్థను విజయవంతంగా నడిపినందుకు లండన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్’ సంస్థ భువనేశ్వరికి గోల్డెన్ పీకాక్ అవార్డు తో పాటు వ్యక్తిగత పురస్కారాన్ని అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

కార్యక్రమానికి ముందుగా గండిపేట ప్రాంగణానికి చేరుకున్న చంద్రబాబు దంపతులకు ఎన్టీఆర్ విద్యా సంస్థల విద్యార్థులు గౌరవ వందనం సమర్పించారు. ప్రాంగణంలో కలియతిరుగుతూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాలను ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆసక్తిగా తిలకించారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన సీఎం, చదువు ఎంత ముఖ్యమో, విలువలు అంతకంటే ముఖ్యమని హితవు పలికారు. లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించేందుకు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మాత్రమే ముందుకు సాగగలమన్నారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించవచ్చని, ఆ తర్వాత సంపద స్వయంగా వస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పిల్లలకు ఈ విద్యా సంస్థల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Annual day celebrations
  • chandrababu naidu
  • Gandi Pet
  • Golden Peacock Award
  • Heritage Foods
  • IAS Officer
  • nara bhuvaneswari
  • NTR Educational Institutions
  • political career
  • telangana

Related News

Municipal Elections Telanga

ఫిబ్రవరిలో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు?

ఫిబ్రవరి రెండో వారం నాటికి మున్సిపల్ ఎన్నికలు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో GHMCతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో చాలా వాటికి ఈ ఏడాది జనవరిలోనే గడువు ముగిసింది

  • Ias Officers Transfer In Te

    తెలంగాణ లో పెద్ద ఎత్తున ఐఏఎస్‌ల బదిలీలు

  • Telangana New Sarpanches

    సంక్రాంతి తర్వాత సర్పంచ్ లకు ట్రైనింగ్

  • Schools Closed Telangana

    తెలంగాణ లో 1,441 బడులు తాత్కాలికంగా క్లోజ్!

  • CM Revanth Reddy

    రేవంత్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఉప స‌ర్పంచ్‌ల‌కు చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు!

Latest News

  • మరో అడ్వెంచర్ కు సిద్దమైన భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

  • పోలీసులపై దాడి చేసిన గ్రామస్థులు , రాయ్ గఢ్ లో ఉద్రిక్తత

  • 31న డెలివరీ బాయ్స్ సమ్మె, న్యూ ఇయర్ వేడుకలకు ఇబ్బందేనా ?

  • జనవరి 3న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ

  • శివాజీ పై ‘కుట్ర’ చేస్తున్నది ఎవరు ? ఎందుకు ఆయన ఆ మాటలు అన్నారు ?

Trending News

    • క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన బౌల‌ర్‌!

    • రూ. లక్ష డిపాజిట్‌పై రూ. 20,983 వడ్డీ.. ఏ బ్యాంక్‌లో అంటే?!

    • టాలీవుడ్‌లో రోషన్ జోరు.. క్రేజీ డైరెక్టర్లతో భారీ ప్రాజెక్టులు!

    • న్యూజిలాండ్ వన్డే సిరీస్.. టీమ్ ఇండియా ఎంపికపై 5 కీలక అప్‌డేట్స్ ఇవే!

    • అంపైర్ల జీతాల పెంపు నిర్ణయం వాయిదా వేసిన బీసీసీఐ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd