HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Earthquake In Prakasam District Why Earthquakes Occurring Repeatedly In Telugu States

Earthquakes: ప్రకాశం జిల్లాలో భూకంపం.. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది ?

భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి.

  • Author : Pasha Date : 06-05-2025 - 2:08 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Earthquake Prakasam District Telugu States Andhra Pradesh Telangana North Telangana Coastal Andhra

Earthquakes: సోమవారం సాయంత్రం తెలంగాణలోని పలుచోట్ల భూకంపం రాగా.. ఇవాళ ఉదయం 9.54 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో పలుచోట్ల భూప్రకంపనలు సంభవించాయి. ప్రకాశం జిల్లా పరిధిలోని  దర్శి, పొదిలి, కురిచేడు, ముండ్లమూరులలో భూమి కంపించిందని తెలిసింది. కొత్తూరులోని రాజు ఆస్పత్రి వీధి, బ్యాంకు కాలనీ, ఇస్లాంపేటలలోనూ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం ఉదయం 5సెకన్ల పాటు భూమి కంపించిందని ప్రజలు తెలిపారు. దీంతో భయపడి జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గత ఏడాది కూడా ప్రకాశం జిల్లాలోని దర్శి, ముండ్లమూరు, తాళ్లూరులలో  భూమి కంపించింది. సోమవారం సాయంత్రం తెలంగాణలోని క‌రీంన‌గ‌ర్, సిరిసిల్ల, జగిత్యాల, వేములవాడ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో 3.8 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌, కడెం, జన్నారం, లక్సెట్టిపేటలలోనూ భూమి కంపించింది. రెండుసార్లు భూమి తీవ్రంగా కంపించిందని స్థానికులు తెలిపారు. క‌రీంన‌గ‌ర్‌ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో భ‌వ‌నాలు,  ఇండ్లు కంపించాయి.

Also Read :Ambani Vs Trump: హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌.. ట్రంప్‌తో అంబానీ ఢీ.. వాట్స్ నెక్ట్స్ ?

తెలంగాణకు రిస్క్ ఎందుకు పెరిగింది ? 

భూప్రకంపనలు అనేవి గత రెండేళ్ల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో(Earthquakes) ఎక్కువ సంఖ్యలో సంభవించాయి. దీంతో తెలంగాణ, ఏపీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రత్యేకించి ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న జిల్లాలు,  ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో భూప్రకంపనల తీవ్రత ఎక్కువగా కనిపించింది. అంటే తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు ప్రాంతాలకు భూకంపాల ముప్పు ఎక్కువగా ఉందనే విషయం క్లియర్ అవుతోంది. ఉత్తర తెలంగాణ జిల్లాల విషయానికొస్తే.. ఇక్కడ మైనింగ్ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతోంది. సింగరేణి కాలరీస్ వంటివి ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. దీంతోపాటు ఈ జిల్లాల్లో భూగర్భ జలాల వినియోగం అతిగా జరుగుతోంది. ఇవన్నీ ప్రతికూలంగా పరిణమించి భూప్రకంపనలకు కారణమవుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.

Also Read :APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

కోస్తాంధ్రలో రిస్క్.. ఎక్కడంటే ? 

ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతం విషయానికొస్తే.. అది సముద్ర తీరంలో ఉంది. సముద్ర గర్భంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణామాల ప్రభావం రానున్న కాలంలో కోస్తాంధ్ర జిల్లాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రత్యేకించి కోస్తాంధ్ర ప్రాంతంలోని ప్రకాశం, కాకినాడ, విశాఖపట్నంలకు భూకంపాల ముప్పు ఎక్కువ అని నిపుణులు అంటున్నారు.  మన దేశాన్ని మొత్తం నాలుగు భూకంప మండలాలుగా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు తక్కువ ముప్పు ఉన్న జోన్ 2లో ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలు జోన్ 3లో కూడా ఉన్నాయి. అంటే ఆయా చోట్ల మధ్యస్తంగా భూకంపాలు వచ్చే రిస్క్ ఉంది. భూగర్భంలో ఉండే టెక్టానిక్ ప్లేట్లు తమను తాము సర్దుబాటు చేసుకునేందుకు కదులుతుంటాయి. ఈక్రమంలోనే అవి కదిలిన ప్రాంతాల్లో భూమి కంపిస్తుంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Coastal Andhra
  • earthquake
  • Earthquakes
  • North Telangana
  • Prakasam District
  • telangana
  • telugu states

Related News

Omkareshwara Temple

Revanth Reddy: రూ.700 కోట్లతో ఓంకారేశ్వర ఆలయం..శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి..

Musi River  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో మరో కీలక ముందడుగు పడింది. హైదరాబాద్ శివార్లలోని గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ.700 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణ పనులకు సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన భూమి పూజ కార్యక్రమంలో పా

  • Telangana Speaker Gaddam Prasad

    Telangana Sports: తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

  • Vakiti Srihari fish curry Midday meal scheme

    Midday meal scheme: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. మధ్యాహ్న భోజనంలో చేపల కూర: మంత్రి వాకిటి శ్రీహరి

  • Bhadrachalam Pattu Vastralu Sri Rama Navami

    BHADRACHALAM PATTU VASTRALU: భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాల ప్రత్యేకత

  • Markapuram Bus Accident

    Markapuram Bus Accident: మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదంలో 14 మంది సజీవ దహనం.

Latest News

  • ఐపీఎల్ 2026.. చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజ‌యం!!

  • సూర్యవంశీ శివతాండవం.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!!

  • పెద్ది సినిమా వాయిదా? నిర్మాత ఏం చెప్పారంటే?!

  • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

  • రైతుల‌కు శుభ‌వార్త చెప్పిన కేంద్రం!

Trending News

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

    • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd