HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Dhatri Madhu Arrested In Appsc Irregularities Case What Is The Case

APPSC Irregularities : ఏపీపీఎస్సీ గ్రూప్-1 కేసులో ధాత్రి మధు అరెస్టు.. ఏమిటీ కేసు ?

వైఎస్సార్ సీపీ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్న టైంలో గ్రూప్‌-1 పరీక్ష(APPSC Irregularities)లో అక్రమాలు జరిగాయి.

  • By Pasha Published Date - 12:30 PM, Tue - 6 May 25
  • daily-hunt
Appsc Irregularities Group 1 Exam Digital Evaluation Scam Dhatri Madhu  

APPSC Irregularities : ఏపీపీఎస్సీ  గ్రూప్‌-1 అక్రమాల కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబుపత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ డైరెక్టర్‌ ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని మధు కార్యాలయానికి వెళ్లి.. ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విజయవాడకు తరలిస్తున్నట్లు సమాచారం. ఈ స్కాంలో మధును ఏ2 నిందితుడిగా కోర్టు ఎదుట పోలీసులు హాజరుపర్చనున్నట్లు సమాచారం.

Also Read :Worlds Toughest Prison: అల్కాట్రాజ్.. ప్రపంచంలోనే టఫ్ జైలు ఎందుకైంది ? రీ ఓపెనింగ్ ఎందుకు ?

హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌లో జవాబు పత్రాల మూల్యాంకనం

వైఎస్సార్ సీపీ ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్న టైంలో గ్రూప్‌-1 పరీక్ష(APPSC Irregularities)లో అక్రమాలు జరిగాయి. ఏపీపీఎస్సీ  ఆఫీసుతో సంబంధం లేకుండా..  గుంటూరులో ఉన్న పర్యాటక ప్రాంతం హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌లో గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేయించారని దర్యాప్తులో గుర్తించారు. అయితే హాయ్‌ల్యాండ్‌ అనే పేరు కూడా తమకు తెలియదని ఆనాడు హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు. తాజాగా జరిగిన దర్యాప్తులో..  హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మూల్యాంకనం కోసం చేసిన ఏర్పాట్లు, నగదు చెల్లింపుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో గ్రూప్1  మెయిన్స్‌ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. ఈ వ్యవహారంలో చక్రం తిప్పింది పీఎస్‌ఆర్ ఆంజనేయులే అని ఆరోపణలు వస్తున్నాయి. హాయ్‌ల్యాండ్‌ రిసార్ట్స్‌ వేదికగా గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసే బాధ్యతలను నిబంధనలకు విరుద్ధంగా ధాత్రి మధుకు చెందిన క్యామ్‌సైన్‌ సంస్థ పొందింది.  ఈ కుంభకోణంపై విజయవాడలోని సూర్యారావుపేట పోలీసుస్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో నాటి ఏపీపీఎస్సీ కార్యదర్శి, సీనియర్‌ ఐపీఎస్‌ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులను ఏ1గా చేర్చారు. ఏ2గా ధాత్రి మధు ఉన్నాడు.

Also Read :China + Pakistan: పాక్‌ ఆయుధాలన్నీ మేడిన్ చైనా.. చైనా ఉత్పత్తులన్నీ బైకాట్ చేద్దామా ?

లేఖ రాసినా పట్టించుకోని పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు

పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న టైంలో హాయ్‌ల్యాండ్‌లో డమ్మీ జవాబుపత్రాల మూల్యాంకనం పనులను  2021 డిసెంబరు 3న క్యామ్‌సైన్‌ సంస్థకు అప్పగించారు.  ఆ సంస్థకు 1.14 కోట్ల చెక్‌ను ఏపీపీఎస్సీ కార్యదర్శి హోదాలో ఆంజనేయులు ముట్టజెప్పగా, అందులో 74 లక్షల రూపాయల వరకు గోల్‌మాల్‌ జరిగిందని గుర్తించారు. డిజిటల్‌ మూల్యాంకనంలో అభ్యర్థులకు వచ్చిన మార్కులకు అనుగుణంగా సిద్ధం చేసిన ఓఎంఆర్‌ షీట్లపై అర్హత లేనివారితో మార్కులు వేయించారని వెల్లడైంది. మార్కులు వేసిన వారిలో క్యామ్‌సైన్‌ సంస్థ ఉద్యోగులతోపాటు ఇంటర్, డిగ్రీ వరకు చదివిన స్థానికులు ఉన్నారని తేలింది. వీరికి వేతనంగా రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు చెల్లించినట్లు సమాచారం. జవాబుపత్రాల మూల్యాంకన బాధ్యతలను వేరొకరికి అప్పగించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఏపీపీఎస్‌సీలోని ఓ సభ్యుడు పీఎస్‌ఆర్‌ ఆంజనేయులుకు 2021 డిసెంబరు 14 న లేఖ రాశారు. దీన్ని పీఎస్​ఆర్ పట్టించుకోలేదు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • APPSC
  • APPSC Corruption
  • APPSC Irregularities
  • crime
  • Dhatri Madhu
  • Digital Evaluation Scam
  • Group 1 Exam
  • jobs

Related News

Indian Skill Report 2026.

Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

దేశంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన నైపుణ్యాలు కలిగిన యువత 56.35 శాతం మంది ఉన్నారని తాజా నివేదిక చెబుతోంది. 2022తో పోల్చితే ఇది దాదాపు 2 శాతం అధికమని తెలిపింది. ఇక, నైపుణ్యాల ఎక్కువగా కలిగిన రాష్ట్రాల్లో ఉత్తర్ ప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మహిళల ఉద్యోగర్హతలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ముఖ్యంగా మహిళలు పురుషులను అధిగమించడం విశేషం. ఏఐ విన

    Latest News

    • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

    • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

    • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

    • Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

    • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

    Trending News

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd