HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Debt Budget Time Jagan Last Chance

Jagan Last Chance!: అప్పుల బడ్జెట్ టైం, జగన్ కు లాస్ట్ ఛాన్స్!

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి చివరి బడ్జెట్ గురువారం ప్రజల ముందుకు రాబోతుంది. అప్పులు పెంచుకుంటూ పోతూ సగటున 13 శాతం తలసరి ఆదాయం పెరిగిందని డప్పు కొట్టే

  • Author : CS Rao Date : 16-03-2023 - 8:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Jagan Ap Budget
Ap Budget 2022 23 Highlights

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) చివరి బడ్జెట్ గురువారం ప్రజల ముందుకు రాబోతుంది. అప్పులు పెంచుకుంటూ పోతూ సగటున 13 శాతం తలసరి ఆదాయం పెరిగిందని డప్పు కొట్టే బడ్జెట్ ను చూడబోతున్నాం. అప్పులను మూడు రెట్లు చేసిన జగన్ (Jagan) సర్కార్ బడ్జెట్ వార్షిక బడ్జెట్ అంచనా రూ.2.6లక్షల కోట్లకుపైగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి పద్దు ఇదే. ఎన్నికల నేపథ్యంలో వచ్చే ఏడాది ఓటాన్‌ అకౌంట్‌ పద్దుకు మాత్రమే పరిమితం కానుంది.

రెవెన్యూ రాబడిని మించి మరీ వ్యయాలు ఎంత పరిమితం చేస్తామంటున్నా అంచనాలకు మించే ఖర్చులు ఉన్నాయి.దీంతో రాష్ట్రంలో రెవెన్యూలోటు భయపెడుతోంది. ప్రతిసారీ రెవెన్యూ లోటును నియంత్రిస్తామని చెబుతున్నా అది సాధ్యం కాకపోగా అంచనాలు మించిపోతోంది. గడిచిన అయిదేళ్లలో ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతూనే ఉంది. తాజా పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో సరళి ప్రబలిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వరంగ కార్పొరేషన్ల నుంచి రుణాలు తెచ్చి కొన్ని కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. వాటిని తీర్చేందుకు రాష్ట్ర ఆదాయాన్ని మళ్లిస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లోనే కార్పొరేషన్లకు గ్రాంట్లు మంజూరు చేసి, రుణాలు తీర్చాల్సి వస్తోంది. ఆ అప్పులతో రెవెన్యూ ఖర్చులు చేస్తున్నా వాటిని లెక్కల్లోకి చేర్చట్లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా రెవెన్యూ లోటును, ద్రవ్యలోటును ఉన్నదాని కంటే తక్కువగా చూపిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

ఏమిటీ రెవెన్యూ లోటు?

రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు ఎక్కువైతే దాన్ని రెవెన్యూ లోటు అంటారు. దీన్ని ఎప్పటికప్పుడు పరిమితం చేసుకుంటే అదే అసలైన ఆర్థిక నిర్వహణ.

రెవెన్యూ రాబడి:

రాష్ట్రంలో సొంత పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర ఆదాయం, కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కలిపి రెవెన్యూ రాబడి అవుతుంది. సొంత పన్నుల్లో జీఎస్టీ వసూళ్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం, భూమి శిస్తు, అమ్మకపు పన్ను, రాష్ట్ర ఎక్సైజ్ డ్యూటీలు, కేంద్రపన్నుల్లో వాటాలు, ఇతర పన్నులు-సుంకాల ద్వారా వచ్చే మొత్తం ఉంటాయి.

రెవెన్యూ ఖర్చులు:

జీతాలు, పింఛన్లు, సబ్సిడీలు, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వనిర్వహణ, ఇతర ప్రభుత్వ పథకాలకు వెచ్చించే మొత్తాలనూ రెవెన్యూ ఖర్చులే అంటారు. వీటితో ప్రభుత్వానికి ఆదాయం రాదు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు తక్కువ ఉంటే దాన్ని రెవెన్యూ మిగులు అంటారు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు అధికంగా ఉంటే రెవెన్యూ లోటు అంటారు. ప్రస్తుతం 2022-23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు రూ.17,036.15 కోట్లుగా ఉంటుందని లెక్కించారు. జనవరి వరకు 10 నెలల్లోనే ఇది రూ.47,958.78 కోట్లకు.. అంటే అంచనాలతో పోలిస్తే 281 శాతంగా ఉన్నట్లు లెక్కలు పేర్కొంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటును ప్రభుత్వమే రూ.17,036 కోట్లుగా అంచనావేసింది. తొలి పది నెలల్లోనే అది రూ.47,959 కోట్లకు చేరుకుంది. రెవెన్యూ వసూళ్లు తగ్గిపోవడం, రెవెన్యూ వ్యయాలను పరిమితం చేయలేని పరిస్థితుల్లో ఈ సవాలు ఎదురవుతోంది. రెవెన్యూ రాబడులు అంచనాలతో పోలిస్తే మరీ తగ్గిపోతున్నాయి. ఈ తేడాను ఈసారి బడ్జెట్ లో ఎలా సరిచేస్తారు అనేది చూడాలి.

Also Read:  3 Banks Collapse in a Week: అమెరికాలో ఏం జరుగుతోంది.. బ్యాంక్స్ దివాళాకు కారణాలేంటి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • andhra pradesh
  • ap
  • Budget
  • cm
  • debt
  • jagan
  • jagan mohan reddy
  • Last Chance
  • ycp
  • ysrcp

Related News

Unified Family Survey

Janganana 2027: ఏపీలో మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

రెండవ దశలో అసలైన జనాభా లెక్కింపు ప్రక్రియ 2027 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో వ్యక్తుల వయస్సు, విద్య, ఉపాధి, మతం, భాష వంటి పూర్తి స్థాయి సామాజిక-ఆర్థిక వివరాలను సేకరిస్తారు. గత పదేళ్లకు పైగా కాలంలో రాష్ట్ర జనాభాలో వచ్చిన మార్పులు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

  • Sarpanch Election Updates I

    Sarpanch Elections Updates in AP : ఏపీలో సర్పంచ్ ఎన్నికలు

  • Ap Ration Card Service Char

    Ration Card Service Charges : ఏపీలో రేషన్ కార్డు సర్వీస్ ఛార్జీలు పెంపు!

  • international law university amaravati

    ప్రజా రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ వర్సిటీ

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd