HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cms Comments Are Insulting To Employees Ttd Trade Union President

TTD Trade Union President: సీఎం వ్యాఖ్య‌లు ఉద్యోగుల‌ను అవ‌మాన‌ప‌ర‌చ‌డ‌మే: టీటీడీ కార్మిక సంఘాల అధ్య‌క్షుడు

తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.

  • By Gopichand Published Date - 07:47 PM, Thu - 19 September 24
  • daily-hunt
Tirumala Weather
Tirumala Weather

TTD Trade Union President: ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూపై చేసిన వ్యాఖ్య‌లు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాధాన్య‌త సంత‌రించుకుంటున్నాయి. కొంద‌రు చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థిస్తుంటే.. మ‌రికొంద‌రు వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు (TTD Trade Union President) కందారపు మురళి స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ ప్ర‌క‌ట‌న కూడా విడుద‌ల చేశారు.

తిరుమల కొండపై లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం టీటీడీ ఉద్యోగులను అవమానపరచడమేనని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు. టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరించబడుతున్నాయని. ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని ఈ ల్యాబ్‌లో తనిఖీలు చేసిన తర్వాతనే వినియోగించబడతాయని ఆయ‌న గుర్తు చేశారు.

సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ, మైసూరు) పరిధిలో ఆహార పదార్థాలను తనిఖీ చేస్తారని గుర్తు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో నడపబడుతుందని తెలిపారు. విశ్రాంత శాస్త్రవేత్త, మరో 12 మంది నిపుణులైన ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ తనిఖీ జరుగుతుందని ఈ తనిఖీ పర్యవేక్షణకు టీటీడీ నుంచి రోజుకొక బృందం చొప్పున ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు.

Also Read: Manifesto : రాజకీయ పార్టీ ఎన్నికల హామీని నెరవేర్చకుంటే ఈసీ చర్యలు తీసుకుంటుందా?

తాను సమాచారాన్ని సేకరించిన తరువాతే తెలియజేస్తున్నానని కందారపు మురళి ఆ ప్రకటనలో వివరించారు. టీటీడీ నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే నెయ్యి వినియోగం జరుగుతుందని వివరించారు. కరోనా సమయం మినహా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో నెయ్యి వినియోగానికి సంబంధించిన ట్యాంకర్లు నాణ్యతా ప్రమాణాలకు లోబడి లేవని 20కి పైగా ట్యాంకర్లను తిప్పి పంపిన విషయం రికార్డులలో న‌మోదై ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

వాస్తవం ఇది కాగా ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి తేలికగా ఇట్లాంటి ఆరోపణలు చేయటం సమంజసం కాదని భక్తుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగులను అవమానపరిచినట్టే అవుతుందని ఈ సందర్భంగా కందారపు మురళి గుర్తు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధుల వినియోగానికి సంబంధించి అక్రమ వ్యవహారాలకు సంబంధించి తప్పులు ఉంటే బాధ్యులను కఠినంగా శిక్షించడానికి ఎవరికీ అభ్యంతరం లేదని, తన ప్రత్యర్థులను దెబ్బతీయాలనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్న మార్గం సరైంది కాదని.. ఇది భక్తుల మనోభావాలను, ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసేదని ముఖ్యమంత్రి గుర్తించాలని కందారపు మురళి విజ్ఞప్తి చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • CM Chandrababu
  • Murali
  • tdp
  • Tirupati Laddu
  • ttd
  • TTD Trade Union President
  • ysrcp

Related News

Tirumala Srivari Temple to be closed tomorrow

Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

టీటీడీ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 3:30 గంటల నుంచి సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 3:00 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుంది. అంటే దాదాపు 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేయబడనున్నాయి.

  • 'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

    AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • YS Jagan

    YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Latest News

  • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

  • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

  • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

  • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

  • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

Trending News

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd