HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Cm Jagan Taken A Crucial Decision To Win 2024 Elections

YS Jagan: జ‌గ‌న్ ఇక ఆగేదేలే..?

  • By HashtagU Desk Published Date - 03:48 PM, Thu - 17 March 22
  • daily-hunt
Ys Jagan Ysrcp
Ys Jagan Ysrcp

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అన్ని రాజ‌కీయ‌పార్టీలు 2024 ఎన్నిక‌లు టార్గెట్‌గా పావులు క‌దుపుతున్నాయి. ఈ క్ర‌మంలో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాజాగా కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌టికే ఎమ్మెల్యేల‌కు క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా క్లారిటీ ఇచ్చిన జ‌గ‌న్ తాజాగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న కింది స్థాయి కార్యకర్తలతో చ‌ర్చ‌లు షురూ చేయ‌నున్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్ళు కావొస్తున్నా, పార్టీ కార్యక్రమాలపై జగన్ సరిగ్గా దృష్టి పెట్టలేదు.

ఇప్ప‌టి వ‌ర‌కు కేవలం సంక్షేమ పథకాల అమలుపైనే ఎక్కువగా దృష్టి పెట్టిన జ‌గ‌న్, ఇచ్చిన హామీలు అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తూ వ‌చ్చారు. దీంతో రాష్ట్ర‌ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్నీ పార్టీలు ఏకమవుతున్నాయి. ఈ క్ర‌మంలో ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొనేందుకు సీఎం జగన్ సిద్ధమయ్యారు.

ఈ నేప‌ధ్యంలో మూడేళ్ల తర్వాత నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశంలో టికెట్ల కేటాయింపు, మంత్రివర్గ కూర్పుపై జగన్ కుండబద్ధలు కొట్టేశారు. పని చేసిన వారికి, ప్రజల్లో మంచి పేరు ఉన్న వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని జగన్ స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతి ఒక్కరు పని చేయాలని జ‌గ‌న్ తేల్చి చెప్పేశారు. ఇప్పటికే అందరి జాతకాలు తన దగ్గర ఉన్నాయని జగన్ చెప్పడంతో, పార్టీ నేతల్లో గుబులు రేపుతోంది.

ఇక ఎమ్మెల్యేల విష‌యం ప‌క్క‌న పెడితే, గత ఎన్నిక‌ల్లో వైసీపీ గెలుపులో కీల‌కపాత్ర పోషించిన‌ కింద స్థాయి కార్యకర్తలను నేరుగా కలుసుకునేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేప‌ట్టిన‌ జగన్ అప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. ప్రతి రోజూ ప్రజలను కలుసుకుంటూ, కార్యకర్తలతో సమావేశం అయ్యేవారు. అయితే ముఖ్యమంత్రి అయ్యాక‌ పూర్తిగా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితం అయ్యారు.

అంతే కాకుండా ఎమ్మెల్యేలకు కూడా జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదనే అపవాదు ఉంది. ఈ క్ర‌మంలో కొద్ది రోజుల పాటు పార్టీపైనే ఫోకస్ పెడుతున్నారు జగన్. కార్యకర్తలతో పాటు నేతల్లో ఉన్న అసంతృప్తిని కూడా పొగొట్టేందుకు జగన్ రెడీ అయ్యారు. రెండేళ్లలో పార్టీపైన స్పెషల్ ఫోకస్ పెట్టేందుకు రెడీ అవుతున్న‌ జగన్, ఇందుకోసం రెండు రోజుల పాటు కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఈ క్ర‌మంలో వారిని నేరుగా తాడేపల్లికే పిలిపించుకుని మాట్లాడేందుకు రంగం సిద్ధం చేశారు.

ఇక‌పోతే అధికారం కంటే కూడా పార్టీ ముఖ్యమనే విషయం ప్రతి రాజకీయ నేతకు తెలుసు. అధికారం మత్తులో పార్టీని పక్కన పెడితే ఏం జరుగుతుందో ఇప్పటికే చాలా ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి పరిస్థితి రాకుండా జగన్ ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది. నేతల్లో ఉన్న అతివిశ్వాసాన్ని పక్కన పెట్టేందుకు స్వయంగా జ‌గ‌నే రంగంలోకి దిగ‌నున్నారు. అధ‌తికారంలో ఉన్నాం క‌దా అని అప్రమత్తంగా లేకపోతే ప్రతిపక్షాల నుంచి ఎలాంటి ప్ర‌మాదాలు ఎదుర‌వుతాయర‌నే విష‌యాల‌పై కార్య‌కర్తలకు వివరించనున్నారు జ‌గ‌న్. ఏది ఏమైనా 2024 ఎన్నిక‌లే టార్గెట్‌గా జ‌గ‌న్ రంగంలోకి దిగుతున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Elections
  • andhra pradesh
  • ap politics
  • ys jagan
  • ysrcp

Related News

Jagan Narsipatnam

Jagan : ప్రజలను రెచ్చగొట్టేందుకే జగన్ బలప్రదర్శన – మంత్రి సత్యకుమార్

Jagan : “జగన్ నర్సీపట్నం పర్యటనకు నిజమైన ఉద్దేశ్యం ఏమిటో ప్రజలకు స్పష్టంగా చెప్పాలి” అని ప్రశ్నించారు. ప్రజాసేవ పేరుతో కాకుండా, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని మంత్రి ఆరోపించారు

    Latest News

    • ‎Pregnancy Diet: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రెగ్నెన్సీ టైంలో వీటిని తప్పకుండా తినాల్సిందే!

    • ‎Diwali: దీపావళి రోజు ఏ దీపాలను వెలిగించాలి.. నూనె, నెయ్యి.. దేనిని ఉపయోగించాలో తెలుసా?

    • ‎Karthika Masam: కార్తీక మాసంలో ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో మీకు తెలుసా?

    • Harish Rao: భర్తను తలచుకొని ఏడుస్తే.. చిల్లర రాజకీయాలా? – హరీశ్‌రావు ఫైర్

    • Maoist Ashanna : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. లొంగిపోనున్న ఆశన్న టీమ్!

    Trending News

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

      • Employees : ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..!

      • Bigg Boss : నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా.. ఇష్టం వచ్చినట్టు తింటా – దివ్వెల మాధురి..!

      • Tata Motors : ఒక్కరోజే 40 శాతం తగ్గిన టాటా మోటార్స్ షేర్ ధర!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd