HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Cm Chandrababu New Scheme Launched In Andhra Pradesh Chandrababus Major Initiative For Muslims

CM Chandrababu: ఏపీలో మరో కొత్త పధకం అమలు, ముస్లింలకు పెద్ద పీట వేసిన చంద్రబాబు..

  • By Kode Mohan Sai Published Date - 11:38 AM, Sat - 19 October 24
  • daily-hunt
Cm Chandrababu On Muslims
Cm Chandrababu On Muslims

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది, ఇది ముస్లిం మైనారిటీ విద్యార్థుల ప్రయోజనం కోసం రూపొందించబడింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో ఉర్దూ భాషా ఉపాధ్యాయులు మరియు వాలంటీర్లు అందుబాటులోకి రానున్నారు. ఈ ప్రక్రియలో విద్యా వాలంటీర్ల నియామకానికి ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది.

మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఫరూక్‌ ఇప్పటికే విద్యావాలంటీర్ల నియామకానికి ఆమోదం ఇచ్చారు. రాష్ట్రంలో 185 మదర్సాలు ఉన్నట్లు సమాచారం, ప్రతి మదర్సాలో ముగ్గురు చొప్పున మొత్తం 555 విద్యావాలంటీర్ల నియామకానికి ప్రతిపాదనలు తయారు అయ్యాయి. ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ అమలు కోసం ఏడాదికి 13 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పథకానికి ఆర్థికశాఖ నుంచి ఆమోదం వచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వం గతేడాది నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల్లో ఉర్దూ భాషను ప్రోత్సహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ ప్రక్రియలో, ప్రతి తరగతిలో కనీసం 15 మంది విద్యార్థులు ఉండాలి, మరియు ఉర్దూ మాధ్యమ పాఠశాలల్లో గౌరవ వేతనం కింద ఉర్దూ భాషా ఉపాధ్యాయుల నియామకానికి కేంద్రం నిధులు కేటాయిస్తోంది. అయితే, గత ప్రభుత్వ కాలంలో ఈ పథకాన్ని వినియోగించకపోవడంతో, కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి నిబంధనలను పాటిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది.

ఏపీలో మొత్తం 1,600 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 238 పాఠశాలల్లో ప్రతి తరగతిలో 15 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. దీంతో, ఒక్కో ఉపాధ్యాయుడికి నెలకు 30 వేలు గౌరవవేతనం చెల్లించేందుకు 10 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వెంటనే, అధికారులు నియామక ప్రక్రియను ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం మదర్సాల్లో విద్యార్థులకు నవీన విద్యను అందించేందుకు విద్యా వాలంటీర్ల నియామకాన్ని ప్రారంభించింది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఈ విధానాన్ని కొనసాగించలేదు. ప్రస్తుతం, ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం మదర్సాల్లో విద్యావాలంటీర్ల నియామకానికి కసరత్తు చేస్తోంది, త్వరలోనే ఈ నియామక ప్రక్రియను పూర్తిచేయనుంది. ఈ నిర్ణయంపై మైనార్టీ సమాజం హర్షం వ్యక్తం చేసింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CM Chandrababu
  • Chandranna Madrassa naveena Vidhya Padhakam
  • tdp
  • telugudesam party

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • Lokesh's satire on Jagan

    Vip Passes : ‘ఓరి నీ పాసుగాల’ ..కార్యకర్తలను కలిసేందుకు పాసులు ఏందయ్యా : జగన్‌ పై లోకేశ్ సెటైర్

Latest News

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd