Vizag : వైజాగ్కు కొత్త పేరు పెట్టిన సీఎం చంద్రబాబు
Vizag : సాగర తీర నగరం విశాఖపట్నం మరోసారి పెట్టుబడుల కేంద్రంగా మారింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా దేశ–విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరయ్యాయి.
- By Sudheer Published Date - 08:30 AM, Sat - 15 November 25
సాగర తీర నగరం విశాఖపట్నం మరోసారి పెట్టుబడుల కేంద్రంగా మారింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా దేశ–విదేశాలకు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థలు, వ్యాపార దిగ్గజాలు భారీగా హాజరయ్యాయి. గత రెండు రోజులుగా రూ.లక్షల కోట్ల పెట్టుబడి ఒప్పందాలు వరుసగా కుదురుతూ, విశాఖలో పెట్టుబడుల ఉత్సవం కొనసాగుతోంది. ప్రభుత్వం వెల్లడించిన ప్రకారం, రెండు రోజుల్లో మొత్తం రూ.11.92 లక్షల కోట్ల విలువైన 400 అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. వీటి ద్వారా 13.32 లక్షల ఉద్యోగాలు సృష్టించే అవకాశం ఉందని తెలిపింది. ఈ సదస్సులో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు, పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలు దేశాల ప్రతినిధులు పాల్గొనడం ఈ ఈవెంట్ ప్రాధాన్యాన్ని మరింత పెంచింది.
సీఐఐ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వైజాగ్కు నూతన నిర్వచనం విశేష ఆకర్షణగా నిలిచింది. “VIZAG” అనే పదాన్ని Vision, Innovation, Zeal, Aspiration, Growth అనే అయిదు విలువలతో అనుసంధానిస్తూ నగర అభివృద్ధి దిశను స్పష్టంగా వివరించారు. వ్యాపార సౌలభ్యం, వేగవంతమైన పాలన, పెట్టుబడులకు అనుకూల వాతావరణం వంటి అంశాలను ప్రపంచానికి తెలియజేయడానికే ఈ సదస్సు నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ నిర్వచనాన్ని ట్విట్టర్లోనూ తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం చేస్తూ, వైజాగ్ను అభివృద్ధి దిశగా మలుస్తున్న చర్యలను హైలైట్ చేసింది. “వైజాగ్ అంటే గూగుల్ అన్న రోజుల నుండి, ఇప్పుడు ‘ఒక విజన్తో వినూత్నంగా అభివృద్ధి చెందుతున్న నగరం’ అని చెప్పుకునే స్థాయికి చేరుకుంది” అని టిడిపి వ్యాఖ్యానించింది.
Richest MLA: బీహార్లో అత్యంత ధనవంతుడైన ఎమ్మెల్యే ఎవరంటే?!
సదస్సుకు దేశ–విదేశాల నుంచి చేరిన అతిథులకు విశాఖకు ప్రత్యేకమైన గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు. మొత్తం నగరం సదస్సు కాంతులతో కళకళలాడింది. ఏపీ పెవిలియన్లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ ప్రదర్శనలు సందర్శకులను మంత్రముగ్ధులను చేశాయి. సంస్థల ప్రతినిధులు, విదేశీ డెలిగేట్లు సదస్సు ప్రాంగణంలో ఫోటోలు దిగుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. శుక్ర, శనివారాల్లో జరిగిన ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు చేరనున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ విజయవంతమైన సదస్సు ఆంధ్రప్రదేశ్ను భవిష్యత్తు పరిశ్రమల గమ్యస్థానంగా నిలబెట్టే దిశలో కీలక ముందడుగు అని భావిస్తున్నారు.
మరోవైపు సీఐఐ భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్ (VIZAG)కు సరికొత్త నిర్వచనం చెప్పారు. వి – విజన్ (దార్శనికత), ఐ – ఇన్నోవేషన్ (ఆవిష్కరణ), జడ్ – జీల్ (ఉత్సాహం), ఏ – యాస్పిరేషన్ (ఆశయం), జీ – గ్రోత్ (వృద్ధి) అంటూ వివరించారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని, వ్యాపార నిర్వహణలో వేగం (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) అందరికీ అర్థమయ్యేలా, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా, అందరి సహకారాన్ని, అభివృద్ధిని కోరుతూ రెండు రోజుల పాటు ఒక సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలుగు దేశం పార్టీ కూడా దీనిపై ట్వీట్ చేసింది. ‘చంద్రబాబు గారు, లోకేష్ గారు కలిసి వైజాగ్ నగరానికి ఒక కొత్త నిర్వచనం ఇచ్చారు. సీఐఐ భాగస్వామ్య సదస్సుతో అది మరింత స్పష్టమైంది. ఈ మధ్యనే వైజాగ్ అంటే గూగుల్ అని చెప్పుకున్న జనం ఇప్పుడు వైజాగ్ అంటే “ఒక విజన్ తో వినూత్నంగా, ఉత్సాహంగా అందరి ఆకాంక్షలను నెరవేర్చేలా అభివృద్ధి చేయబడుతున్న నగరం” అని చెప్పుకుంటున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.
విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుకు దేశ, విదేశాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు గిరిజన సంప్రదాయాలతో ఘన స్వాగతం లభించింది. ఈ సదస్సు విశాఖ నగరాన్ని సందడిగా మార్చింది. సదస్సు ప్రాంగణంలో అందరిలోనూ ఉత్సాహం కనిపించింది. వివిధ దేశాలు, సంస్థల నుంచి వచ్చిన ప్రముఖులు సదస్సు బోర్డుల వద్ద ఫోటోలు దిగుతూ ఆనందించారు. ఏపీ పెవిలియన్లోకి అడుగుపెట్టగానే, అది ఒక ఎలక్ట్రానిక్ ప్రపంచంలోకి ప్రవేశించినట్లు అనిపించింది. ఈ సదస్సులో పాల్గొన్న వారందరూ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. ఈ సదస్సు శుక్ర, శనివారాల్లో నిర్వహిస్తోంది ఏపీ ప్రభుత్వం. ఈ సదస్సుతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు.