TDP : నేటి నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి ప.గో జిల్లాలో టీడీపీ అధినేత పర్యటన
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. "ఇదేం ఖర్మ మన...
- By Prasad Published Date - 07:09 AM, Wed - 30 November 22
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, విధ్వంసాలపై తెలుగు దేశం పార్టీ “ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి” పేరిట కార్యక్రమం తలపెట్టింది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే ఈ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని దెందులూరు నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలసుకోవడం, ప్రజలతో చర్చించడం, ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీసే అంశాలతో ఈ కార్యక్రమం సాగనుంది. గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు వరకు అంతా దీనిలో భాగస్వాములు అవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు మూడు రోజుల పాటు మూడు జిల్లాల్లో రోడ్ షోలు, సభల్లో పాల్గొననున్నారు. మొదటి రోజు దెందులూరు, చింతలపూడి, రెండో పోలవరం, కొవ్వూరు, మూడో రోజు నిడదవోలు,తాడేపల్లి గూడెం నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ రోజు దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. డిశంబర్ 2నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీశ్రేణులు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇంచార్జ్ లు, నాయకులు ఈ కార్యక్రమాన్ని తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టనున్నారు
Related News
AP: అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేని చెత్త సీఎం మూడు రాజధానులు కడతాడంట – CBN
అన్నమయ్య ప్రాజెక్టు కాపాడలేని ఈ చెత్త ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట