HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Chandrababu Fires In Cm Jagan

Chandrababu : ప్ర‌భుత్వం చేత‌కానిత‌నం వ‌ల్లే రైతులు న‌ష్ట‌పోయారు.. ప‌ర్చూరు ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తిన బాబు

వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు.

  • By Prasad Published Date - 08:51 PM, Sat - 9 December 23
  • daily-hunt
TDP
TDP

వైసీపీ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం చెరుకూరులో తుఫాన్ తో దెబ్బతిన్న పంటపొలాలు చంద్రబాబు నాయుడు పరిశీలించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు.. కానీ తుపాన్ తో జరిగే నష్టాన్ని తగ్గించే బాధ్యత ప్రభుత్వానిదేన‌ని చంద్ర‌బాబు అన్నారు. హుదూద్ తుఫాన్ సమయంలో వారం రోజుల పాటు బస్సులోనే ఉండి పరిస్ధితి మళ్లీ సాధారణ స్థితికి వచ్చే వరకు తాను అక్క‌డే ఉన్నాన‌ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. నాలుగున్నరేళ్ల నుంచి ఎక్కడైనా పంట కాలువల్లో పూడిక తీశారా? డ్రెయిన్లు శుభ్రం చేశారా? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని.. కనీసం గోతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్ర‌భుత్వం ఉంద‌న్నారు. ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని సీఎంకు రైతుల భాధలు ఏం తెలుసన్నారు. నిన్న ఒక్క రోజునే రాష్ట్రంలో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. దీనికి కారణం సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డేన‌ని చంద్ర‌బాబు అన్నారు. పోలవరం పూర్తి చేసి ఆ నీళ్ళు కృష్ణా డెల్టాకు తీసుకురావాలని.. ఇది పూర్తయితే నీటి సమస్య ఉండదన్నారు. టీడీపీ హయాంలో పట్టిసీమ నిర్మించి జూలైలోనే నీళ్లిచ్చి పంట పొలాల్ని సస్యశ్యామలం చేశామ‌న్నారు.

We’re now on WhatsApp. Click to Join.

పర్చూరు నియోజకవర్గంలో లక్ష ఎకరాల్లో పంట సాగు చేస్తే.. 90 శాతం నష్టం జరిగిందన్నారు. పొగాకు పంటకు ఎకరా రూ. 50 వేలు, శనగకు రూ. 30 వేలు, పత్తికి రూ. 50 వేలు ఖర్చు చేసి రైతులు నష్టపోయారని చంద్ర‌బాబు తెలిపారు. వరికి హెక్టారుకు రూ.30వేలు, ఆక్వాకు రూ.50వేలు, మరణించిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షలు సాయం అందించాలని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. ఇల్లు కోల్పోతే రూ. లక్ష ఇచ్చి ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని.. దెబ్బతిన్న ఇంటికి రూ.20 వేలు, పశువుల షెడ్డుకు రూ. 20వేలు ఇవ్వాల‌న్నారు. అరటికి రూ.40వేలు, పత్తికి రూ. 25వేలు, మిరపకు రూ.50వేలు, వేరుసెనగకు రూ.25 వేలు, మొక్కజొన్నకు రూ.15 వేలు, వీధి వ్యాపారులకు రూ.10వేలు పరిహారం ఇవ్వాలన్నారు. ఇంతవరకు ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో ప్రభుత్వం దగ్గర లెక్కలు లేవని… తుఫాన్ నష్టంపై అద్యయనానికి కేంద్ర బృందాన్ని ఎందుకు పిలవలేదని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

Also Read:  Pawan Kalyan – Barrelakka : పవన్ కళ్యాణ్ ఫై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బర్రెలక్క


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 chandrababu cm
  • andhra pradesh
  • ap tdp
  • cm jagan
  • tdp
  • ysrcp

Related News

Nara Lokesh Google Vizag

Nara Lokesh : ఏపీకి పెట్టుబడులు.. కొందరికి మండుతున్నట్టుంది.. లోకేశ్ సెటైర్లు..!

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు క్యూ కట్టాయి.. ఐటీ కంపెనీలు, భారీ పరిశ్రమలు వస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్‌ ఏర్పాటుకు ఎంవోయూ కూడా పూర్తైంది. త్వరలోనే మరికొన్ని కంపెనీలు కూడా రాష్ట్రానికి వస్తాయని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. విశాఖపట్నంలో గూగుల్‌ ప

    Latest News

    • Air Pollution: వాయు కాలుష్యం.. గర్భంలో ఉన్న శిశువు మెదడుపై తీవ్ర ప్రభావం!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • CNG Cars: త‌క్కువ బ‌డ్జెట్‌లో సీఎన్‌జీ కారును కొనుగోలు చేయాల‌ని చూస్తున్నారా?

    • Sadar Sammelan: సదర్ సమ్మేళనానికి సర్వం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి రాక!

    • Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

    Trending News

      • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

      • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd