HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Arrival Of Google Company Is A Game Changer For The State Cm Chandrababu

CM Chandrababu : గూగుల్‌కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్‌ ఛేంజర్‌: సీఎం చంద్రబాబు

2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్‌ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

  • Author : Latha Suma Date : 25-01-2025 - 3:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Arrival of Google company is a game changer for the state: CM Chandrababu
Arrival of Google company is a game changer for the state: CM Chandrababu

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోజుల పాటు దావోస్‌లో జరిగిన పెట్టుబడుల సదస్సులో పాల్గొని రాష్ట్రానికి తిరిగి వచ్చిన సందర్భంగా శనివారం ఆ వివరాలను, పెట్టుబడుదారులతో చేసుకున్న ఒప్పందాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. దావోస్‌ అనేది కార్పొరేట్‌ కంపెనీలు, వివిధ దేశాల ప్రతినిధులు వచ్చే కేంద్రమని, అందరినీ ఒకేచోట కలుసుకుని, ప్రపంచంలో వచ్చే ఆధునిక ఆలోచనలు , ట్రెండ్స్‌ తెలుసుకునే అవకాశముంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

ఐదేండ్లుగా రాష్ట్రంలో విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. గూగుల్‌కంపెనీ రాక రాష్ట్రానికి ఒక గేమ్‌ ఛేంజర్‌గా మారబోతుందని వివరించారు. అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దబోతున్నామని చంద్రబాబు వివరించారు. పోలవరం ప్రాజెక్టును గాడిలో పెట్టి పనులు వేగవంతం చేశామని , 2027 డిసెంబర్‌ నాటికి పోలవరం పూర్తి చేస్తామని ధీమాను వ్యక్తం చేశారు. దావోస్‌ వెళ్లి ఎన్ని ఒప్పందాలు చేశారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

1997నుంచి ప్రతిసారి తాను దావోస్‌కు వెళ్తున్నానని తెలిపారు. ఈసారి దావోస్‌లో జరిగిన సమావేశంలో ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ , గ్రీన్‌ హైడ్రోజన్ , ఏఐ అనే కీలక అంశాలను వివరించానని అన్నారు. అనేక మల్టినేషనల్‌ కంపెనీలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చాయని వివరించారు. కేంద్రం కూడా రాష్ట్రం అభివృద్ధికి సహకారం అందిస్తుందని అన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్రం రూ. 13 వేల కోట్లను ఆర్థిక ప్యాకేజీ కింద ఇవ్వడం అసాధారణమైన విషయమని అన్నారు. అనకాపల్లి వద్ద రూ. 1.35 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్‌ వస్తోందని అన్నారు. మొత్తంగా గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. రామాయంపట్నంలో రూ. 95 వేల కోట్లతో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌, ఎల్జీ కంపెనీ రూ. 5వేల కోట్లతో పెట్టుబడులు, రూ. 65 వేల కోట్లతో రిలయెన్స్‌ బయో ఫ్లూయల్‌ ప్లాంట్‌ ఏర్పాటు, విశాఖలో ఐటీ రంగంలో భారీ పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

Read Also: Tata Flex Fuel Punch: కాలుష్యం తగ్గించే కారు వ‌చ్చేసింది.. ధ‌ర ఎంతో తెలుసా?

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • amaravati
  • CM Chandrababu
  • Davos
  • Game Changer
  • Google Company
  • Investments

Related News

Mahanadu

Mahanadu : ముగిసిన మ‌హానాడు.. వ‌ర్చువ‌ల్‌గా 24 ల‌క్ష‌ల మంది హాజ‌రు

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకమైన తెలుగుదేశం పార్టీ మహానాడు 2026 సరికొత్త చరిత్ర సృష్టించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహం పాల్గొన్నారు. నరేంద్ర మోడీ పిలుపుమేరకు పొదుపులో భాగంగా హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ మహానాడు ప్రపంచానికి కొత్త మార్గం చూపించింది. 1875 క్లస్టర్లు, 12 దేశాల నుంచి వేలాది నాయకులు, కార్యకర్తలు వర్చువల్‌గా పాల్గొన్నార

  • Mahandu 2026

    TDP : టీడీపీ మహానాడులో తెలంగాణపై చర్చ.. ఎన్టీఆర్, చంద్రబాబు సేవలను గుర్తుచేసిన నేతలు

  • Msme Summit 2026

    AP : ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ – 2026లో కీలక ఒప్పందాలు చేసుకున్న ఏపీ ప్ర‌భుత్వం

Latest News

  • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

  • Road Accident : ఖ‌మ్మం గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర రోడ్డు ప్ర‌మాదం.. కానిస్టేబుల్ మృతి

  • Delhi : పెళ్లికి కోటి రూపాయలకు పైగా ఖర్చు.. 17 నెలల్లోనే కూతురు మృతి

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd