HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Ap Government To Sit On Election Violence

AP : ఏపి ఎన్నికల హింసాత్మక సంఘటనలపై సిట్‌ ఏర్పాటు..!

  • By Latha Suma Published Date - 12:33 PM, Fri - 17 May 24
  • daily-hunt
AP government to sit on election violence
SIT report to DGP on election violence in AP!

AP Govt: ఏపి ఎన్నికల నిర్వహణలో తలెత్తిన లోపంపై కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) కఠిన చర్యలు చేపట్టింది. పోలింగ్‌ రోజున..మరుసటి రోజున ఏపిలోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఏపిలో చోటు చేసుకున్న హింసాత్మక సంఘటనలపై స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టిమ్‌ సిట్‌(Sit)ను ఏర్పాటు చేసిన సీఈసీ రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకుని రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక సిట్ ఇవ్వనుంది.  పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, , చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై సిట్ దర్యాప్తు చేయనుంది.  అయితే తాజాగా విశాఖలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుతోంది ఏపీ సర్కార్‌.

We’re now on WhatsApp. Click to Join.

తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందని సమాచారం. ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయనున్న పోలీసులు….రెండు రోజుల్లో నివేదికను ఈసీకి సమర్పించనున్నారు. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే వేటు వేసింది ఈసీ. ఇక అటు జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు చేసింది ఇంటెలిజెన్స్‌. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అవసరమైతే కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేసుకోవాలని వార్నింగ్‌ ఇచ్చింది ఇంటెలిజెన్స్‌.

Read Also: Warm-Up Schedule: బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మప్ మ్యాచ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..!

మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలను కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి పిలిపించిన విషయం తెలిసిందే. గురువారం వారితో భేటీ అయింది. ఎన్నికల వేళ ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సీఈసీ.. ఈ భేటీ తర్వాత కీలక ఆదేశాలు ఇచ్చింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస ఎక్కువగా చెలరేగిందని.. దాన్ని నియంత్రించేందుకు స్థానిక అధికారులు పూర్తిగా విఫలం అయినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వారిద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • central election commission
  • election violence
  • SIT

Related News

Ap Liquor Scam Case

AP Liquor Scam : లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం

AP Liquor Scam : ఇప్పుడు మాజీ సీఎం సోదరుడి పీఏ విచారణకు పిలవడంతో ఈ కేసు పరిధి మరింత విస్తరిస్తోంది. దేవరాజులు ద్వారా మరికొంతమంది కీలక వ్యక్తుల పాత్ర బయటపడవచ్చునని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు

  • New direction for strengthening rural medical services in AP.. Government approves 2309 health clinics

    AP : గ్రామీణ వైద్య సేవల బలోపేతానికి నూతన దిశ..2309 హెల్త్ క్లినిక్‌లకు ప్రభుత్వం ఆమోదం

  • New bar policy implemented in AP

    AP : ఏపీలో అమల్లోకి వచ్చిన కొత్త బార్ పాలసీ

Latest News

  • CM Siddaramaiah : చలానాలపై రాయితీ ప్రకటించిన కర్ణాటక ప్రభుత్వం

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd