HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Anti Drone System Will Be Installed On Tirumala Hills

Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?

తిరుమల కొండలపై యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది.

  • Author : Pasha Date : 13-05-2025 - 9:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anti Drone System On Tirumala Hills Ttd Ap Govt Drones

Tirumala Hills: ప్రస్తుతం డ్రోన్లు కలవరపెడుతున్నాయి. చిన్న సైజులోనే ఉన్నా.. అవి భారీ విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఉగ్రవాద శక్తులు  డ్రోన్లతో భారత్‌లోని ఆధ్యాత్మిక క్షేత్రాలను లక్ష్యంగా చేసుకునే పెను ముప్పు కూడా పొంచి ఉంది. హిందువుల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల కొండలపై గతంలో చాలాసార్లు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తిరుమలలో గగనతల భద్రతకు ఎవరూ తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. యాంటీ డ్రోన్‌ వ్యవస్థను త్వరలోనే తిరుమలలో అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రకటించారు. తిరుమలపై విమానాలు, డ్రోన్లు ఎగరకుండా ‘నో ఫ్లై జోన్‌’గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడును కోరుతామన్నారు. ఈమేరకు ఇప్పటికే  కేంద్ర మంత్రికి ఆయన లేఖ కూడా రాశారు. త్వరలోనే ఆ దిశగా అనుమతులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే.. తిరుమల కొండల పరిధిలో ఎవరూ డ్రోన్లను ఎగురవేయలేరు.  ఒకవేళ డ్రోన్లను ఎగురవేసినా.. యాంటీ డ్రోన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక వాటిని గగనతలంలోనే నిర్వీర్యం చేసి కూల్చేస్తారు. డీఆర్‌డీఓలో కీలక హోదాల్లో సేవలు అందించిన డాక్టర్ సతీష్‌రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శాస్త్రసాంకేతిక సలహాదారుడిగా ఉన్నారు. ఆయన సూచనల మేరకు తిరుమలలో రక్షణ వ్యవస్థను బలోపేతం చేయనున్నారు.

Also Read :Pawan Kalyan : ‘ఎస్-400’‌ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్

వైఎస్సార్ సీపీ హయాంలో ఒట్టి మాటలే.. 

తిరుమల కొండలపై యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది. బెంగళూరులోని భెల్‌ సంస్థ తయారు చేసిన అత్యాధునిక నేవల్‌ యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌(ఎన్‌ఏడీఎస్‌)‌ను కొంటామని ప్రకటించింది.  కోట్లాది రూపాయలు విలువైన ఆ పరికరాన్ని అందించే దాత కోసం సంప్రదిస్తున్నట్లు అప్పట్లో వైఎస్సార్ సీపీ సర్కారు చెప్పింది.  కొంతకాలానికి ఆ ప్రతిపాదనను పక్కన పెట్టింది.

భద్రతా లోపం వల్లే ఈ ఘటనలు.. 

  • 2023 జనవరిలో తిరుమలలో ఐఓసీఎల్‌ గ్యాస్‌ ప్లాంట్‌ సర్వేకు వచ్చిన కొందరు డ్రోన్‌తో శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులను చిత్రీకరించారు.
  • 2024 జనవరిలో హర్యానాకు చెందిన దినేష్‌ 53వ మలుపు వద్ద డ్రోన్‌ ఎగురవేసి శ్రీవారి మోకాలు మెట్టు, నడక మార్గం, అటవీ ప్రాంతాన్ని చిత్రీకరించాడు.
  • ఇటీవలే రాజస్థాన్‌కు చెందిన యూట్యూబర్‌ అన్షుమన్‌ తరెజా  శ్రీవారి ఆలయాన్ని, మాడ వీధులు, అఖిలాండం వరకు చిత్రీకరించాడు.
  • పై విధమైన ఘటనలు జరిగినప్పుడల్లా స్థానికులు విజిలెన్స్‌ అధికారులకు తెలపడం, వారు వచ్చి డ్రోన్లు స్వాధీనం చేసుకోవడం జరుగుతోంది. అదే యాంటీ డ్రోన్‌ సాంకేతికత అందిపుచ్చుకుంటే డ్రోన్‌ ఎగిరే అవకాశమే ఉండదు.
  • సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తుల బ్యాగులను, వ్యక్తులను అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది, ఎస్పీఎఫ్‌ సిబ్బంది తనిఖీ చేసి పంపుతారు. అయినా కొందరు భక్తులు తిరుమల కొండలపైకి డ్రోన్‌‌లను ఎలా తేగలుగుతున్నారు  అనే ప్రశ్న తలెత్తుతోంది. భద్రతా లోపం వల్లే డ్రోన్లను తిరుమల కొండలపైకి తేగలుగుతున్నారు.

Also Read :Samantha : హమ్మయ్య.. నిర్మాతగా మొదటి సినిమాతోనే లాభాల్లో సమంత.. ‘శుభం’ మొదలైంది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Anti-Drone System
  • ap govt
  • Drones
  • tirumala
  • tirumala hills
  • ttd

Related News

CM Chandrababu Naidu visits Delhi seeking central support for state development

రాష్ట్రాభివృద్ధికి కేంద్ర సహకారం కోరుతూ ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈ పర్యటనలో భాగంగా రేపు శుక్రవారం రోజున ఆయన వరుసగా ఆరుగురు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ రంగాల ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత పురోగతి, ఎదురవుతున్న సవాళ్లు, కేంద్రం నుంచి అవసరమైన ఆర్థిక సహాయం, అనుమతులు వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించనున్నారు.

  • Political Party Banner

    తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం

  • YS Jagan to meet Governor today with one crore signatures

    కోటి సంతకాలతో నేడు గవర్నర్‌ను కలవనున్న వైఎస్ జగన్

  • Farmers Drumstick

    ఏపీలో డ్వాక్రా, రైతు సంఘాల కు గుడ్ న్యూస్ ఈ పంట సాగు చేస్తే ఎకరాకు రూ.1.32 లక్షలు సాయం!

Latest News

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

  • ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd