News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional

  • Telugu News
  • ⁄Andhra-pradesh News
  • ⁄Andhra Pradesh Worried Ts Uses Sagar Water For Power Generation

Nagarjuna Sagar : సాగ‌ర్ పై కేసీఆర్ ఇష్టం..జ‌గ‌న్ కు క‌ష్టం!

ఏపీ ప్ర‌భుత్వం మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ విద్యుత్ ఉత్ప‌త్తి కోసం నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఏ మాత్రం తెలంగాణ స‌ర్కార్ త‌గ్గ‌డంలేదు.

  • By CS Rao Published Date - 08:00 PM, Sat - 30 April 22
Nagarjuna Sagar : సాగ‌ర్ పై కేసీఆర్ ఇష్టం..జ‌గ‌న్ కు క‌ష్టం!

ఏపీ ప్ర‌భుత్వం మొత్తుకుంటున్న‌ప్ప‌టికీ తెలంగాణ స‌ర్కార్ విద్యుత్ ఉత్ప‌త్తి కోసం నాగార్జున సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. ఇప్ప‌టికే రెండుసార్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టికీ ఏ మాత్రం తెలంగాణ స‌ర్కార్ త‌గ్గ‌డంలేదు. డెడ్ స్టోరీజికి నీటి మ‌ట్టం వెళ్లిన‌ప్ప‌టికీ నాగార్జునసాగర్ డ్యాం నుండి జలవిద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ 4,000-5,000 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తూనే ఉంది. ఫ‌లితంగా గుంటూరు, ప్ర‌కాశం జిల్లాల‌కు మంచినీళ్ల , సాగునీళ్ల‌ స‌మ‌స్య ముంచుకొస్తోంది. .అయిన‌ప్ప‌టికీ ఏపీ సీఎం జ‌గన్ మాత్రం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఉండ‌డం గ‌మ‌నార్హం.

‘‘విద్యుత్‌ ఉత్పత్తి కోసం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయొద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీయాలని కేఆర్‌ఎంబీకి విన్నవించినా తెలంగాణ భేఖాత‌రు చేస్తుంద‌ని ఏపీ జలవనరుల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి చెబుతున్నారు. ఏప్రిల్ 29న 1,104 క్యూసెక్కుల నీటిని తెలంగాణ తోడేసింద‌ని లెక్కించారు. అలాగే, ఏప్రిల్ 28న 5,211 క్యూసెక్కులు, ఏప్రిల్ 27న 4,934 క్యూసెక్కులు, ఏప్రిల్ 24న 3,868 క్యూసెక్కులు విద్యుత్ ఉత్ప‌త్తికి తెలంగాణ వాడేసింది. స‌గ‌టును రోజుకు 4,000 నుండి 5,000 క్యూసెక్కుల నీళ్లు డ్యాం నుంచి తోడేస్తోంద‌ని ఆయ‌న లెక్కించారు.

ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం 539 అడుగుల ఉంది. వాస్త‌వంగా 590 అడుగులు ఉండాలి. ప్రస్తుత నీటి నిల్వ 186.25 tmcft (59.69 శాతం) వద్ద FRL వద్ద 312.05 tmcft ఉంద‌ని లెక్కించారు. రిజర్వాయర్‌ డెడ్‌ స్టోరేజీ నీటిమట్టం 510 అడుగులుగా కృష్ణా బోర్డు చెబుతోంది. రిజర్వాయర్‌లో ఇంకా కేవలం 29 అడుగుల నీటిమట్టం ఉండగా, ప‌రిమాణం ప్ర‌కారం దాదాపు 55 టీఎంసీల నీరు ఉంది. గతంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నివసించే ప్రజలకు మే 15 నుంచి 10 నుంచి 15 రోజుల పాటు కృష్ణా నది కుడి ప్రధాన కాలువ నుంచి తాగునీటి సరఫరా చేయాలని జలవనరుల శాఖ అధికారులు భావించారు. అందుకోసం దాదాపు 15 టీఎంసీల నీరు అవసరం. ఒక వేళ వర్షాలు కురవని పక్షంలో ఆగస్టులో మళ్లీ తాగునీటిని సరఫరా చేయాల్సి ఉంది. సమయానికి వర్షాలు కురవని పక్షంలో జూలై నుండి ఖరీఫ్ సీజన్‌లో ప్రారంభమయ్యే RMC కమాండ్ ఏరియాలోని పంటల సాగుకు నీటిని సరఫరా చేయవలసి ఉంది.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్రధాన పవర్‌హౌస్‌ నుంచి హైడల్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేసి కృష్ణానదిలోకి విడుదల చేయడంతో డ్యామ్‌లో నీటిమట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ వంటి దిగువ ప్రాజెక్టులు దాదాపు నిండిపోవడం కార‌ణంగా సముద్రంలోకి వృథాగా పోతోంది. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైతే, జూలై లేదా ఆగస్టు వరకు వర్షాలు ప‌డ‌క‌పోతే, శ్రీశైలం వంటి అప్‌స్ట్రీమ్ ప్రాజెక్టుల నుండి నాగార్జునసాగర్ డ్యాంలోకి నీరు రాదని ఏపీ జలవనరుల అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాస్త‌వాల‌కు భిన్నంగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ నీటిని విడుదల చేస్తున్నట్లు ఏపీ జలవనరుల ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు ఏప్రిల్ 4న లేఖ రాశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవద్దని బోర్డును ఆయన కోరారు.

కృష్ణాబోర్డు, ఏపీ ప్ర‌భుత్వం ఎంత మొత్తుకున్న‌ప్ప‌టికీ తెలంగాణ ప్ర‌భుత్వం మాత్రం విద్యుత్ ఉత్ప‌త్తి కోసం సాగ‌ర్ నుంచి నీటిని తోడేస్తోంది. అన్మ‌దమ్ముల్లా క‌లిసి ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మీద కేసీఆర్ పైచేయిగా ఉన్నారు. ఫ‌లితంగా ఏపీకి సాగు, తాగునీటి సంక్షోభం పొంచి ఉంది.

Tags  

  • andhra pradesh
  • krishna water tribunal
  • Nagarjuna sagar
  • telangana

Related News

Liquor Prices : తెలంగాణలో  మ‌ద్యం ధ‌ర‌ల పెంపు

Liquor Prices : తెలంగాణలో మ‌ద్యం ధ‌ర‌ల పెంపు

బీరు బాటిల్‌పై రూ.20, క్వార్టర్ బాటిల్ ఆల్కహాల్‌పై రూ.20, ఫుల్ బాటిల్‌పై రూ.80 చొప్పున పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

  • Land Grabbing : తెలంగాణ ప్ర‌భుత్వ భూ క‌బ్జాల‌పై సుప్రీం ఫైర్

    Land Grabbing : తెలంగాణ ప్ర‌భుత్వ భూ క‌బ్జాల‌పై సుప్రీం ఫైర్

  • Local Bodies : గ్రామ పంచాయితీలపై ఢిల్లీ పెత్త‌నం

    Local Bodies : గ్రామ పంచాయితీలపై ఢిల్లీ పెత్త‌నం

  • KTR UK Tour: యూకేలో కేటీఆర్ బిజీ బిజీ!

    KTR UK Tour: యూకేలో కేటీఆర్ బిజీ బిజీ!

  • CM KCR: దేశం గర్వించే స్థాయికి ‘తెలంగాణ’

    CM KCR: దేశం గర్వించే స్థాయికి ‘తెలంగాణ’

Latest News

  • Deepika Padukone:15 ఏళ్ల క్రితం నన్నెవరూ నమ్మలేదు.. దీపికా ఎమోషనల్!

  • Whats App : వాట్సాప్ గ్రూప్స్ లో మరో రెండు కొత్త ఫీచర్లు

  • Kinnera Moguliah : `ప‌ద్మ‌శ్రీ` వాప‌స్ కు కిన్నెర మొగుల‌య్య `సై`

  • Solar Power : రాత్రి వేళ `సోలార్ ప‌వ‌ర్` ఉత్ప‌త్తి

  • Nallala Odelu: టీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లోకి నల్లాల ఓదెలు!

Trending

    • Solar Pole: సూర్యుడి ధృవపు మిస్టరీ గుట్టురట్టు.. ఫోటోలు,వీడియోలు పంపిన సోలార్ ఆర్బిటర్

    • Crocodile Attack: రాజస్థాన్ లో షాకింగ్ ఘటన…నదిలో స్నానం చేస్తున్న వ్యక్తి మొసలి దాడి..!

    • Swami Nithyananda: నిత్యానందకు ఏమైంది? నిర్వికల్ప సమాధి అంటే ఏంటి?

    • Youngest Organ Donor: ఆరేళ్ల బాలిక అవయవదానం..ఎయిమ్స్ హిస్టరీలోనే తొలిసారి…అసలేం జరిగింది..!!

    • Viral Video : ఒకే బ్లాక్ బోర్డుపై..ఏక కాలంలో హిందీ, ఉర్దూ క్లాస్ లు!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: