HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Chief Minister Chandrababu Naidu On A Five Day Davos Tour

Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్‌ టూర్!

  • Author : Vamsi Chowdary Korata Date : 08-12-2025 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Chandrababu
Chandrababu

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌లో జరిగే ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. జనవరి 19 నుంచి 23 వరకు జరిగే ఈ పర్యటనలో మంత్రులు, అధికారులు కూడా పాల్గొంటారు. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు, ముఖ్యమంత్రి పీ4-జీరో పావర్టీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు. దావోస్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు సంబంధించి సీఎం షెడ్యూల్‌ కూడా ఖరారైంది. 2026 జనవరి 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దావోస్‌‌లో పర్యటిస్తారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్‌తో పాటుగా ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తీకేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఐటీశాఖ సెక్రటరీ కాటమనేని భాస్కర్, ఇండస్ట్రీస్ డైరెక్టర్ శుభం బన్సల్‌లు కూడా దావోస్ వెళుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్‌కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. దావోస్‌ పర్యటనకు సంబంధించిన ప్రకటన విడుదల చేశారు.

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ టీమ్ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధుల్ని కలవనున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించి.. పారిశ్రామిక వేత్తలతో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, ఐటీ కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. పలువురు ప్రముఖలతో ఆయన సమావేశమయ్యారు.. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం విశాఖపట్నం వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చాయి.. ఇప్పుడు అక్కడ కుదుర్చుకున్న ఎంవోయూలను అమలు చేయడంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా, ఆయా జిల్లాల వారీగా భూముల కేటాయింపుతో పాటుగా ఇతర అనుమతులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు, పరిశ్రమలు శంకుస్థాపనకు కూడా సిద్ధమవుతున్నాయి.

మరోవైపు పీ4-జీరో పావర్టీపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రి పయ్యావుల కేశవ్, ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. పీ4 అమల్లో బంగారు కుటుంబాలకు అవసరమైన సాయంపై నిర్వహించిన సర్వేపై అధికారులతో సమీక్ష చేశారు. పీ4 సర్వేలో వైద్యసాయం, ఉద్యోగం, చిరు వ్యాపారాల విస్తరణ, వ్యవసాయం, నూతన ఆవిష్కరణలు, ఉన్నత విద్య, నైపుణ్యాల పెంపుపై సాయం కోరిన బంగారు కుటుంబాలు వంటి అంశాలపై చర్చించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP CM Chandrababu Naidu
  • CM Chandrababu Davos Tour
  • World Economic Forum 2026

Related News

Farmers

Farmers : పెట్రల్, డీజిల్‌తో పని లేకుండా..ఆ యంత్రంతో ఆరు పనులు రైతులకు గుడ్ న్యూస్!

రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు రీగ్రో అనే సంస్థ ఓ కొత్త యంత్రాన్ని తీసుకువచ్చింది. క్రాప్ సిక్సర్ పేరుతో ఓ కొత్త యంత్రం రూపొందించింది. ఈ యంత్రం సాయంతో ఆరు రకాల వ్యవసాయ పనులు చేసుకోవచ్చు, పైగా పెట్రోల్, డీజిల్ అవసరం లేదు. విశాఖలో జరిగిన ఆర్గానిక్ మేళా కార్యక్రమంలో దీనిని ప్రదర్శించారు. బ్యాటరీ సాయంతో పనిచేసే ఈ క్రాప్ సిక్సర్ తోడుంటే.. రైతులను సహాయకారిగా ఉంటుందని అధికారుల

  • Sabrimala Temple

    Sabrimala Temple: శ‌బరిమల ఆలయంలో భక్తులపై దాడి!

  • MLA Yarlagadda

    MLA Yarlagadda: యువ‌కుడ్ని ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ.. ఏం చేశారంటే?

  • Mopidevi Subramanyeswara Sw

    Mopidevi Subrahmanyeshwara Swamy Temple : 50 కిలోల వెండితో పానపట్టం..మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి హైదరాబాద్ భక్తుడి విరాళం

  • Srikakulam Mulapeta Port Wo

    Mulapeta Port : ఏపీలో కొత్త పోర్ట్ ట్రయల్ రన్ మారిపోతున్న రూపురేఖలు!

Latest News

  • Mahesh Babu Remuneration : ‘వారణాసి’కి మహేష్ బాబు రెమ్యూనరేషన్ ఎంతంటే?

  • IndiGo Flight Disruptions : ఇండిగో సంక్షోభానికి ప్రధాన కారణం అదే – రామ్మోహన్

  • CBN Davos Tour : జనవరిలో దావోస్ పర్యటనకు చంద్రబాబు

  • Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదురోజుల దావోస్‌ టూర్!

  • AUS vs ENG : అలెక్స్ క్యారీ మైండ్‌బ్లోయింగ్ కీపింగ్!

Trending News

    • Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైలు.. అస‌లు ఈ ట్రైన్ స్పెషాలిటీ ఏమిటీ?!

    • House Construction: వారికి గుడ్ న్యూస్‌.. తక్కువ వడ్డీకే రూ. 25 ల‌క్ష‌ల వ‌ర‌కు హోమ్ లోన్!

    • Goa Tour : గోవాకు వెళ్లి యువత జాగ్రత్త..లేదంటే మీరే నష్టపోతారు !!

    • IndiGo Flight Disruptions : ఇండిగో విమానం రద్దుతో కూతురి పెళ్లికి వెళ్లలేకపోయిన తల్లిదండ్రులు

    • Zero Balance Accounts: బ్యాంక్ అకౌంట్ ఉన్న‌వారికి శుభ‌వార్త చెప్పిన ఆర్బీఐ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd