AP Cabinet : ఆగస్టు 2న ఏపీ మంత్రి మండలి సమావేశం
ఈ కేబినెట్ భేటీలో కీలకమైన అంశాలపై చర్చ..ముఖ్యనిర్ణయాలకు ఆమోదం తెలుపుతారని తెలుస్తోంది.
- By Latha Suma Published Date - 03:30 PM, Tue - 30 July 24

AP Cabinet Meeting : ఆగస్టు 2న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరుగనుంది. సచివాలయం మొదటి బ్లాక్లో ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది. ఆయా శాఖల ఉన్నతాధికారులు సమావేశంలో చర్చించాల్సిన అంశాలను, ప్రతిపాదనలను నిర్దేశిత విధానంలో బుధవారం సాయంత్రంలోగా సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు ఏపీ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోవైపు 5వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు అధ్య క్షతన సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఇప్పు టికే కూటమి ప్రభుత్వం అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను భారీగా బదిలీలు చేసింది. వారంతా కొత్త బాధ్యతలను స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ప్రాధాన్యాలను జిల్లాల కలెక్టర్లకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.