HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Andhra Pradesh
  • >Alluri Sitarama Raju Agency Bandh 170 Act Protection Demand

Gummadi Sandhya Rani : 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తాం.. ఆదివాసీ చట్టాలను అమలు చేస్తాం..

Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో 1/70 చట్ట పరిరక్షణను ప్రధాన డిమాండ్‌గా చేసుకుని ఆదివాసీ సంఘాలు, రాజకీయ పక్షాలు 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభించాయి. ఈ బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి 1/70 చట్టాన్ని మార్చే ఎలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

  • By Kavya Krishna Published Date - 12:15 PM, Tue - 11 February 25
  • daily-hunt
Gummadi Sandhya Rani
Gummadi Sandhya Rani

Gummadi Sandhya Rani : అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం ఆదివాసీ సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు చేపట్టిన 48 గంటల నిరవధిక బంద్ ప్రారంభమైంది. తెల్లవారు జాము నుంచే పెద్ద ఎత్తున ఆందోళనకారులు రోడ్డెక్కారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన పాడేరు ప్రాంతంలో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాహనాలను ఆపేస్తూ, రహదారులను నిర్బంధిస్తూ ఆదివాసీ సంఘాలు, నేతలు బంద్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈ బంద్‌ కారణంగా పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. అంతేకాకుండా, విద్యా రంగంపైనా ప్రభావం పడింది. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. 1/70 చట్టాన్ని పరిరక్షించాలి అన్న ప్రధాన డిమాండ్‌తో ఆదివాసీ సంఘాలు ఈ నిరసన చేపట్టాయి.

Vidadala Rajini : ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టకు విడదల రజిని

ఏపీలో 1/70 చట్టంపై పెరుగుతున్న అసహనం
ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఈ నిరసనకు ప్రధాన కారణంగా మారాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీ జోన్‌గా మారుస్తే పెట్టుబడులకు అవకాశం కల్పించవచ్చని ఆయన చేసిన సూచనలు ఆదివాసీ సంఘాల ఆగ్రహానికి కారణమయ్యాయి.

1/70 చట్టం పరిరక్షణ కోల్పోతుందనే భయంతో ఆదివాసీ సంఘాలు, ప్రజాసంఘాలు రోడ్డెక్కాయి. ఫ్రీ జోన్ విధానం అమల్లోకి వస్తే ఆదివాసీ భూములపై ప్రైవేట్ పెట్టుబడిదారుల నియంత్రణ పెరిగిపోతుందని, ఇది ఆదివాసీల హక్కులను కూలదోయే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నిరసనకు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మద్దతు ప్రకటించింది. వైసీపీ నేతలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. గిరిజనుల హక్కుల్ని కాపాడాలని, 1/70 చట్టాన్ని చెక్కుచెదరనివ్వకూడదని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ స్పష్టత – 1/70 చట్టాన్ని మార్చే ఆలోచన లేదన్న గుమ్మడి సంధ్యారాణి
ఈ నిరసనల నేపథ్యంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి , జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పందించారు. ప్రభుత్వానికి 1/70 చట్టాన్ని సవరించే ఎలాంటి ఆలోచన లేదని, ఆదివాసీ హక్కులను కాపాడటమే తమ విధానమని స్పష్టం చేశారు. ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. “1/70 చట్టాన్ని ప్రభుత్వ విధిగా పరిరక్షిస్తుంది. గిరిజన సంక్షేమానికి కట్టుబడి ఉంటాం” అని హామీ ఇచ్చారు.

అలాగే, వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. “వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తూ గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు. “గత ఐదు సంవత్సరాల వైఎస్ జగన్ పాలనలో గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారు. గంజాయి అక్రమ రవాణాకు అటవీ ప్రాంతాలను అడ్డాగా మార్చారు. గిరిజనుల ఉపాధిని నాశనం చేశారు” అంటూ వైసీపీపై నిప్పులు చెరిగారు.

ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడం అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించి, వారి జీవన ప్రమాణాలను పెంచేలా ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. “గతంలో వైసీపీ హయాంలో గంజాయి సాగును పెంచి, గిరిజనులను దారుణంగా మోసం చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఆదివాసీల సంక్షేమాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది” అని అన్నారు.

Devotional: దేవుడు మనతో ఉన్నాడని ఎలా తెలుస్తుంది.. సంకేతాలు ఏమైనా కనిపిస్తాయా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 1/70 Act
  • Adivasi Rights
  • alluri sitarama raju district
  • andhra pradesh
  • ap politics
  • Ayyannapatrudu
  • Gummadi Sandhya Rani
  • tdp
  • tourism policy
  • Tribal welfare
  • ysrcp

Related News

'Annadatta fight' over urea shortage in the state: YCP ready for agitation

AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

సజ్జల మాట్లాడుతూ..జగన్ మోహన్ రెడ్డి పాలనలో రైతులకు అనేక రకాల మద్దతు ఇచ్చాం. ఎరువుల సమృద్ధి, ధరల నష్ట పరిహారం, నేరుగా ఖాతాల్లో డబ్బులు వంటి పథకాలతో రైతన్నకు అండగా నిలిచాం. కానీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలలలోనే అన్నదాతలను గాలికొదిలేసింది అని విమర్శించారు.

  • If you don't come to the assembly, there will be by-elections: Raghuramakrishna Raju warns Jagan

    AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd