HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >All The Buttons I Pressed Are Equal To The Pensions I Give Cm Chandrababu

CM Chandrababu : ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం: సీఎం చంద్రబాబు

గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.

  • By Latha Suma Published Date - 03:16 PM, Tue - 1 April 25
  • daily-hunt
All the buttons I pressed are equal to the pensions I give: CM Chandrababu
All the buttons I pressed are equal to the pensions I give: CM Chandrababu

CM Chandrababu : సీఎం చంద్రబాబు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని గతంలో చెప్పానని, ఆ మాట ప్రకారం ముందుకువెళ్తున్నామన్నారు. ప్రజలే ముందు.. ఆ తర్వాతే మిగతా పనులని చంద్రబాబు అన్నారు. ముందుండి నడిపించాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఒక నెల పింఛన్‌ తీసుకోకపోతే ఆ డబ్బు వచ్చే పరిస్థితి లేదు. ఒక నెల తీసుకోకపోతే.. రెండు లేదా మూడో నెల తీసుకునే అవకాశం ఇచ్చాం. రెండు నెలలు పింఛన్లు తీసుకోని వారు 93,300 మంది ఉన్నారు.

Read Also: T-MAAS Card: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక మెట్రో, ఆర్టీసీ ప్రయాణం సులభతరం…

మిగుల్చుకోవాలంటే నెలకు రూ.76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుంది. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నాం. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పెంచిన పింఛన్లను గత ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తున్నాం. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు ఇస్తున్నాం. కోటిన్నర కుటుంబాలకు గానూ 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నాం. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చవుతోంది. ఒకప్పుడు నొక్కిన బటన్లన్నీ నేను ఇచ్చే పింఛన్లతో సమానం. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం.

గత పాలకులు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను దివాళా తీయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.11వేలకోట్లు కేంద్రం ఇచ్చింది. స్టీల్‌ ప్లాంట్‌ కూడా గాడిన పడింది. విశాఖకు రైల్వే జోన్‌ వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల చేపట్టాం. మిగిలిన చోట కూడా పూర్తిచేస్తాం. ఈనెలలో మెగా డీఎస్సీ ప్రక్రియ ప్రారంభించి జూన్‌లోపు ఉద్యోగాలు ఇస్తాం అని చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చాక చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. రాజధాని అమరావతిని గాడిలో పెట్టాం. అక్కడ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుంది. దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుంది. మూడు నాలుగేళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రానికి పోలవరం జీవనాడి. 2027 నాటికి ఆ ప్రాజెక్టును పూర్తిచేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం అని సీఎం చంద్రబాబు తెలిపారు.

Read Also: PM Modi 75 : సెప్టెంబరు 17 నాటికి మోడీకి 75 ఏళ్లు.. రిటైర్మెంట్ ఏజ్ అదేనా ?

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bapatla District
  • Beneficiaries
  • CM Chandrababu
  • NTR Bharosa Pension Distribution Program
  • tdp

Related News

Investment In Ap

Investments : ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి భారీ పెట్టుబడులు

Investments : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా మరో మహత్తర పెట్టుబడి రానుంది. దేశవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగంలో వేగంగా ఎదుగుతున్న ఎస్‌ఏఈఎల్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (SAEL Industries) రాష్ట్రంలో రూ.22,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను

  • Hinduja Group

    Hinduja Group: ఫలిస్తున్న సీఎం చంద్రబాబు ప్రయత్నాలు.. రాష్ట్రానికి మ‌రో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు!

Latest News

  • Vehicle Sales: 42 రోజుల్లోనే 52 లక్షల వాహనాల అమ్మ‌కాలు!

  • North Korea- South Korea: ఆ రెండు దేశాల మ‌ధ్య ముదురుతున్న వివాదం?!

  • India- Pakistan: ఒలింపిక్స్‌కు అర్హ‌త సాధించిన జ‌ట్లు ఇవే.. పాక్ క‌ష్ట‌మే!

  • MS Dhoni: ఐపీఎల్ 2026లో ధోని ఆడ‌నున్నాడా? క్లారిటీ ఇదే!

  • Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో గందరగోళం

Trending News

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

    • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

    • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd