HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Abdul Aziz Assumes Office As Chairman Of The Waqf Board

AP Waqf Board Chairman: వక్ఫ్‌ బోర్డు ఛైర్మన్‌గా అబ్దుల్‌ అజీజ్‌ పదవి స్వీకరణ..

టీడీపీ సీనియర్ నేత అబ్దుల్‌ అజీజ్‌కు కీలక పదవి లభించింది. ఎన్నికల్లో టికెట్ పొందకపోయినా, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత అబ్దుల్‌ అజీజ్‌ను ఎన్నుకున్నారు.

  • By Kode Mohan Sai Published Date - 11:44 AM, Wed - 18 December 24
  • daily-hunt
Ap Waqf Board Chairman Abdul Aziz
Ap Waqf Board Chairman Abdul Aziz

AP Waqf Board Chairman: టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌కు కీలకమైన పదవి ఇచ్చారు. ఎన్నికల్లో టికెట్‌ రాకపోయినా, ఆయనకు ప్రాముఖ్యమైన పదవి లభించింది, ఈ బాధ్యతను ఆయన స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సభ్యులను నియమించిన విషయం తెలిసిందే. ఇందులో 8 కొత్త సభ్యులను చేర్చడమే కాక, గత ప్రభుత్వంలో ఎన్నికైన ఇద్దరిని కూడా కొనసాగించారు.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, వక్ఫ్ బోర్డు కొత్త ఛైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌ను నియమించారు. అబ్దుల్ అజీజ్, నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారు, కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా టికెట్ పొందారు. ఈ నేపథ్యంలో, అజీజ్ పార్టీ కోసం ఈ ఎన్నికలలో పని చేశారు, అందుకే చంద్రబాబు నాయుడు ఆయనకు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు.

అబ్దుల్ అజిజ్

అబ్దుల్ అజిజ్

విజయవాడలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో అబ్దుల్ అజీజ్ తన బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు సభ్యులు అందరూ హాజరుకాగ, ఎమ్మెల్సీ రుహుల్లా హాజరుకాలేదు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అబ్దుల్ అజీజ్ సభ్యుల సమక్షంలో ప్రకటించారు.

అజీజ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటిని కాపాడుతామని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలో వక్ఫ్ భూములలో 21,594 ఎకరాలు అన్యాక్రాంతం అయినట్లు వెల్లడించారు. ఈ భూములను చట్టం ప్రకారం స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యత అని చెప్పారు.

అజీజ్, గత ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డులో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్సీ రుహుల్లా, ఖాజాలాను కూటమి ప్రభుత్వం కొనసాగించడాన్ని గుర్తుచేశారు. ఈ విషయం ఆధారంగా, కొత్త బోర్డు కాదు, గతంలోని రెండు సభ్యులను కొనసాగిస్తూ, మరో 8 మందిని సభ్యులుగా నియమించినట్టు తెలిపారు. తాను ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించానని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో మైనార్టీ సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు. రాష్ట్రంలో వక్ఫ్‌బోర్డు ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు, నిబంధనల ప్రకారం వక్ఫ్ బోర్డు ఏర్పాటును పూర్తి చేసినట్టు వెల్లడించారు. వక్ఫ్ భూములను పరిరక్షించుకుంటూ, అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను స్వాధీనం చేసుకోవడం తమ ప్రాధాన్యత అని చెప్పారు.

గత ప్రభుత్వం వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కోర్టు వక్ఫ్ బోర్డు ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, ఆ ప్రక్రియను నిలిపివేసింది. దీంతో వక్ఫ్ బోర్డు వ్యవహారంలో గందరగోళం ఏర్పడింది. అయితే, కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెట్టిందని చెప్పారు.

గత ప్రభుత్వం ఇచ్చిన జీవో-47ను రద్దు చేసి, తాజాగా జీవో 75ను జారీ చేశామని, ఈ ప్రక్రియలో గత బోర్డు సభ్యులలో ఇద్దరిని కొనసాగించి, నూతనంగా నామినేటెడ్ సభ్యులను నియమించినట్లు తెలిపారు. అయితే ఈ బోర్డు సభ్యుల తొలి సమావేశంలో అబ్దుల్‌ అజీజ్‌ను వక్ఫ్‌ బోర్డు నూతన ఛైర్మన్‌గా ఎన్నుకోగా.. ఆయన బాధ్యతలు స్వీకరించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • Shaik Abdul Aziz
  • tdp
  • Waqf Amendment Bill
  • Waqf Board Bill
  • Waqf Board Chairman

Related News

Tdp Leaders Ycp

Big Shock to TDP : వైసీపీలో చేరిన కీలక నేతలు

Big Shock to TDP : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి పలువురు టీడీపీ, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. టీడీపీకి చెందిన మధు, మల్లికార్జున్, బీజేపీ అసెంబ్లీ ఇంఛార్జ్ మురహరిరెడ్డి, బీజేపీ నేత కిరణ్ కుమార్‌తో పాటు వారి అనుచరులు జగన్ సమక్షంలో చేరడం ఆ పార్టీకి ఊతమిచ్చింది

  • CM Chandrababu

    Chandrababu Naidu: అసెంబ్లీకి గైర్హాజరైన ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్‌

  • CM Chandrababu Naidu

    CM Chandrababu Naidu: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు.. రేపు, ఎల్లుండి పర్యటన!

  • CM Chandrababu Naidu

    Agriculture : ఎమ్మెల్యేలు పొలాలకు వెళ్లండి.. చంద్రబాబు సూచన

  • Made In India Products Chan

    Made in India Products : మేడ్ ఇన్ ఇండియా వస్తువుల్నే కొనాలి – CBN

Latest News

  • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

  • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

  • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

  • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

  • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd