HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >A Landmark Moment For Amaravati Tenders For Iconic Structures To Begin Soon

Amaravati: అమరావతికి మహర్దశ! ఐకానిక్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు ప్రారంభం

  • Author : Vamsi Chowdary Korata Date : 15-10-2024 - 11:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amaravati
Amaravati

అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిలో ఐకానిక్ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడానికి సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా, శాసనసభ, హైకోర్టు, సచివాలయం మరియు వివిధ శాఖల కార్యాలయ భవనాల డిజైన్లలో ఎలాంటి మార్పులు చేయకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.

అడ్మినిస్ట్రేటివ్ సిటీ ప్లానింగ్‌కు సంబంధించి, 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ ఐకానిక్ భవనాల ఆకృతులను రూపొందించింది. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత, అమరావతి నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకురావాలని నిర్ణయించబడింది. ఈ నేపథ్యం లో, ఐకానిక్ భవనాల ఆకృతులపై ఉన్నత స్థాయిలో చర్చలు జరిగాయి.

దాదాపు ఆరు సంవత్సరాల క్రితం రూపొందించిన ఆ ఆకృతులలో మార్పులు చేయాలా అన్న అంశంపై చర్చ జరిగింది. అందువల్ల, బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులు చేయకూడదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని సవరణలు చేయాలని నిర్ణయించారు. ఎందుకంటే మార్పులు జరగాలంటే, మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇంకా, హైకోర్టు మరియు సచివాలయ టవర్ల పునాదులు ఇప్పటికే పూర్తయినందున, ఇప్పుడు ఆకృతులను మార్చడం సరికాదన్న అభిప్రాయానికి ఏపీ ప్రభుత్వం వచ్చింది.

ఆర్కిటెక్ట్‌ల కోసం సీఆర్‌డీఏ టెండర్ల ఆహ్వానం:

మరోవైపు, ఐకానిక్‌ బిల్డింగ్స్‌ డిజైన్‌లకు సంబంధించిన పెండింగ్‌ పనులను పూర్తి చేయడానికి ఆర్కిటెక్ట్‌ నియామకం కోసం సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. ఈ ప్రాధమిక సమావేశానికి లండన్‌ సంస్థ నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు కూడా హాజరు అవటం గమనార్హం. ఆ సంస్థ కూడా బిడ్‌ దాఖలు చేసినట్లు సీఆర్‌డీఏ భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో ఆర్కిటెక్ట్‌ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు మరియు సచివాలయ భవనాల పునాదులు పటిష్టంగా ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు తెలియజేసారు, అందువల్ల ఆ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలవడం కోసం సీఆర్‌డీఏ ఏర్పాట్లు చేస్తోంది.

భవనాల రూపకల్పన ఇలా:

అప్పట్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టును బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయాన్ని మరియు విభాగాధిపతుల కార్యాలయాలను ఐదు టవర్లుగా, డయాగ్రిడ్‌ విధానంలో నిర్మించాలని ఆలోచించారు. అప్పటి అంచనాల ప్రకారం, వాటి నిర్మాణ వ్యయం 11,752 కోట్లు. శాసనసభ భవనం నిర్మిత ప్రాంతం 11.67 లక్షల చదరపు అడుగులు, హైకోర్టు భవనం 16.85 లక్షల చదరపు అడుగులు, సచివాలయం మరియు విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాంతం 68.88 లక్షల చదరపు అడుగులుగా ఉంది.

మళ్లీ అదే సంస్థ ఆసక్తి:

2019కి ముందు తెలుగుదేశం హయాంలో అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యాన్ని పొందిన ప్రముఖ కంపెనీలు మళ్లీ అటువంటి అవకాశాలను వెతుకుతున్నాయి. ప్రఖ్యాత నార్మన్‌ ఫోస్టర్‌ అండ్‌ పార్ట్‌నర్స్‌ కంపెనీ రాజధాని నిర్మాణంలో మళ్లీ భాగస్వామిగా మారడానికి ఆసక్తి చూపడం ఇందుకు ఉదాహరణ. జగన్‌ ప్రభుత్వంలో ఈ కంపెనీ అనేక కష్టాలను ఎదుర్కొంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నార్మన్‌ ఫోస్టర్‌ వంటి సంస్థలకు అనేక ఇబ్బందులు కలిగించింది.

సీఆర్‌డీఏతో చేసిన అగ్రిమెంట్లను కాలరాసింది, బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెట్టింది. చివరకు, బకాయిలను వసూలు చేసేందుకు నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ సుప్రీంకోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది. ఇన్నేళ్ల అనంతరం, నార్మన్‌ ఫోస్టర్‌ మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్‌డీఏ ఊహించలేదు. కానీ ప్రీబిడ్‌ మీటింగ్‌లో హాజరైనది, ఆ కంపెనీ ఆసక్తిగా ఉందని చూపిస్తోంది. ప్రీబిడ్‌ మీటింగ్‌కు మాత్రమే హాజరయ్యిందా లేక బిడ్‌ కూడా దాఖలు చేసిందా అనేది స్పష్టత రాలేదు. అయితే, ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసినట్లయితే, దానికే టెండరు ఖరారైతే సమయం ఆదా అవుతుందని సీఆర్‌డీఏ భావిస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Amaravati capital
  • Amaravati Iconic Buildings
  • APCRDA
  • CRDA
  • Nara Chandrababu Naidu

Related News

Amaravati Farmers

Amaravati: రైతులకు గుడ్ న్యూస్.. రూ. 1.50 లక్షల రుణ మాఫీ – చంద్రబాబు

అమరావతిలోని తాడికొండ, పెదకూరపాడు నియోజకవర్గాలకు చెందిన గ్రామాల రైతులతో రాజధాని కోసం రెండో విడత భూ సమీకరణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం నిర్వహించారు. ఎకరానికి రూ. 40 వేల చొప్పున పదేళ్లపాటు కౌలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఏడాదికి రూ. 3 వేలు చొప్పున కౌలు పెంచుతామని, ఒక్కో రైతు కుటుంబానికి రూ. 1.50 లక్షల మేర వ్యవసాయ రుణ మాఫీ చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధ

    Latest News

    • రానా- అక్షయ్ కుమార్ కాంబోలో భారీ బ‌డ్జెట్ మూవీ.. డైరెక్ట‌ర్ ఎవ‌రంటే?

    • పాఠశాలల్లో వాటర్ బెల్

    • సీజ్‌ఫైర్ పొడిగింపు.. ట్రంప్ ప్లాన్ ఇదేనా?

    • పొడవాటి జుట్టు కావాలంటే అరటి తొక్కలను వాడాల్సిందే!

    • JD Chakravarthy: అందుకే సినిమా ఇండస్ట్రీలో హీరోలు తమ కూతుళ్ళను సినిమాల్లోకి రానివ్వరు: జేడీ చక్రవర్తి

    Trending News

      • ఇక‌పై ఆల్క‌హాల్ ఆధారిత పెట్రోల్‌!

      • దిల్షాన్ మదుశంక.. రిప్లేస్‌మెంట్‌గా వచ్చి రికార్డుల్లోకి!

      • దిగ్బంధనం అంటే యుద్ధం ప్రకటించడమే: ఇరాన్‌

      • ఇకపై మ‌న అనుమతి లేకుండా బ్యాంకులో డబ్బులు కట్ కావు!

      • అమెరికా, ఇజ్రాయెల్‌లకు బుద్ధి చెబుతాం: ఇరాన్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd