HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >2000 Ap Students In Kyrgyzstan Bjp Leader In The Field

AP Students In Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో 2000 మంది ఏపీ విద్యార్థులు.. రంగంలోకి బీజేపీ నేత‌

కిర్గిజ్‌స్థాన్‌లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి.

  • By Gopichand Published Date - 11:21 AM, Mon - 20 May 24
  • daily-hunt
AP Students In Kyrgyzstan
AP Students In Kyrgyzstan

AP Students In Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే కిర్గిజ్‌స్థాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2,000 మంది విద్యార్థుల (AP Students In Kyrgyzstan) భద్రత కోసం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆదివారం సాయం కోరారు. సాయం కోరిన వెంట‌నే స్పందించిన జైశంక‌ర్‌ సరైన చర్యలకు హామీ ఇచ్చారు.

బిజెపి సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు ఆదివారం విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్‌ ని సంప్రదించి, మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్య విద్యార్థుల భద్రత కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని నగరమైన బిష్‌కెక్‌లో భారతీయ విద్యార్థులతో సహా విదేశీ విద్యార్థులపై హింస, దాడుల గురించి వచ్చిన వార్తల నేపధ్యంలో ఆ విద్యార్థులు, వారి కుటుంబాలు తమ భద్రత కోసం భయపడుతున్న కారణంగా జీవీఎల్ ఈ చోరవ తీసుకోవటం జరిగింది.

Also Read: Salaar 2 : ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..?

కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్‌కెక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 2,000 మంది విద్యార్థులు తమ వైద్య విద్యను అభ్యసిస్తున్నారని జీవీఎల్ నరసింహారావు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. “బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా అవసరమైన, తక్షణ చర్యలను ప్రారంభించమని అధికారులను ఆదేశించడం ద్వారా విద్యార్థులు సురక్షితంగా ఉండటానికి లేదా తిరిగి రావడానికి మీ జోక్యాన్ని అభ్యర్థించడానికి నేను వ్రాస్తున్నాను” అని జీవీఎల్ నరసింహారావు తన లేఖలో పేర్కొన్నారు. జీవీఎల్ నరసింహారావు అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఎస్. జైశంకర్ కిర్గిజ్‌స్థాన్ లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరితగతిన స్పందించి సకాలంలో జోక్యం చేసుకున్నందుకు విదేశాంగ మంత్రికి జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు.

We’re now on WhatsApp : Click to Join

తెలుగు విద్యార్థులందరూ క్షేమం

కిర్గిస్థాన్‌లోని బిష్‌కెక్‌లో ఉన్న తెలుగు విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) అధ్యక్షుడు మేడపాటి ఎస్ వెంకట్ భరోసా ఇచ్చారు. వెంకట్ TNIEతో మాట్లాడుతూ.. శనివారం APNRTS కిర్గిజ్‌స్థాన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను సంప్రదించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. “భారత విద్యార్థులపై హింసకు సంబంధించిన నివేదికలు లేవు. విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను హాస్టల్‌లో ఉండమని ఆదేశించాయి. సోమవారం నుండి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా చూసుకున్నాయి” అని తెలిపారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap students
  • AP Students In Kyrgyzstan
  • GVL Narasimha Rao
  • Jai Shankar
  • Kyrgyzstan
  • world news

Related News

Nepal

Nepal: నేపాల్‌లో ఘోరం.. ఏడుగురు మృతి!

యాలుంగ్ రీ పర్వతం 5,600 మీటర్ల (18,370 అడుగులు) ఎత్తులో ఉంది. ఇది పెద్ద పర్వతాలను అధిరోహించడంలో మునుపటి అనుభవం లేని ప్రారంభకులకు అనువైన పర్వతంగా పరిగణించబడుతుంది.

  • Strongest Currencies

    Strongest Currencies: ప్ర‌పంచంలో అత్యంత బలమైన టాప్ 10 కరెన్సీలు ఇవే!

  • H1B Visa

    H1B Visa: హెచ్‌-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ సర్కార్ ప్రకటన!

Latest News

  • Chikiri Chikiri Song : పెద్ది నీ ‘చికిరి చికిరి’ మతిపోయింది

  • TG Govt : డైలమాలో రేవంత్ సర్కార్..అసలు ఏంజరిగిందంటే !!

  • Shree Charani : శ్రీచరణికి గ్రూప్-1 జాబ్ తో పాటు భారీ నజరానా ప్రకటించిన ఏపీ సర్కార్

  • Jubilee Hills By Election : బిజెపి, బిఆర్ఎస్ కుమ్మక్కు – మంత్రి పొన్నం

  • Katrina Kaif – Vicky kaushal: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd