IND vs ZIM: జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్కు భారత్ జట్టు ఇదే..!
- By Gopichand Published Date - 11:51 PM, Tue - 2 July 24
![IND vs ZIM: జింబాబ్వేతో జరిగే తొలి టీ20 మ్యాచ్కు భారత్ జట్టు ఇదే..!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/01/gill.jpg)
IND vs ZIM: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జింబాబ్వే (IND vs ZIM) చేరుకుంది. ఇక్కడ భారత జట్టు జూలై 6 నుంచి జూలై 14 వరకు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. ఐపీఎల్లో స్టార్ ప్లేయర్లు తమ స్థానాన్ని సంపాదించుకున్నారు. అంటే ఒక విధంగా జింబాబ్వేలో టీమిండియా యువ జట్టు ఆడుతున్నట్లు కనిపిస్తుంది. జట్టు కెప్టెన్సీని శుభ్మన్ గిల్కు అప్పగించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం తొలి రెండు టీ20ల జట్టులో మార్పులు చేసింది.
సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్ల స్థానంలో సాయి సుదర్శన్, జితేష్ శర్మ, హర్షిత్ రానాలను బీసీసీఐ జట్టులోకి తీసుకుంది. ఇటువంటి పరిస్థితిలో హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరగనున్న తొలి టీ20లో భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఎవరనేది ప్రశ్న. ఏ 10 మంది ఆటగాళ్ళకు శుభ్మన్ గిల్ అవకాశం ఇవ్వగలరో ఇప్పుడు చూద్దాం.
గిల్-అభిషేక్ ఓపెనర్
జైస్వాల్ తొలి రెండు టీ20లకు దూరం కావడంతో అభిషేక్ శర్మతో కలిసి శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఓపెనింగ్ చేస్తున్నప్పుడు అభిషేక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 16 మ్యాచ్లలో 32.27 సగటుతో 204.22 స్ట్రైక్ రేట్తో 484 పరుగులు చేశాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అభిషేక్- గిల్తో లెఫ్ట్-రైట్ కాంబినేషన్కి సరిపోతుంది.
Also Read: David Miller Retirement: డేవిడ్ మిల్లర్ రిటైర్మెంట్.. అసలు విషయం ఇదీ..!
ధృవ్ జురెల్ వికెట్ కీపర్
దీంతో పాటు వికెట్కీపర్ విషయంలోనూ సమస్య నెలకొంది. సంజూ శాంసన్ తొలి రెండు మ్యాచ్లకు దూరమైన తర్వాత ధృవ్ జురెల్, జితేష్ శర్మ వంటి ఎంపికలు టీమిండియాకు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో జురెల్ తన స్థానాన్ని ఖాయం చేసుకోవడంగా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నప్పుడు, జురెల్ 14 మ్యాచ్లలో 24.38 సగటుతో 138.30 స్ట్రైక్ రేట్తో 195 పరుగులు చేశాడు. చాలా మ్యాచ్ల్లో ఫినిషర్గా కూడా నిరూపించుకున్నాడు. ఇకపోతే జితేష్ గురించి మాట్లాడుకుంటే పంజాబ్ కింగ్స్ ఆటగాడు 14 మ్యాచ్లలో 17.00 సగటుతో 187 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టులో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు స్థానం ఖాయమని భావిస్తున్నారు.
We’re now on WhatsApp : Click to Join
టీమిండియా అంచనా
శుభ్మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్పాండే/హర్షిత్ రాణా, ముఖేష్ కుమార్.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![IND vs ZIM 2nd T20: నిన్న డకౌట్..ఇవాళ సెంచరీ దుమ్మురేపిన అభిషేక్ శర్మ](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/IND-vs-ZIM-2nd-T20I.jpg)
IND vs ZIM 2nd T20: నిన్న డకౌట్..ఇవాళ సెంచరీ దుమ్మురేపిన అభిషేక్ శర్మ
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టీ ట్వంటీలో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ రెచ్చిపోయాడు. 33 బంతుల్లో పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ తర్వాత 50 పరుగులను 13 బంతుల్లోనే అందుకున్నాడంటే ఎలా విరుచుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు