15 Crores: భార్యకు తెలియకుండా భర్త అక్రమ వ్యాపారం.. సుమారు రూ. 15 కోట్ల లాభం..!
అమెరికాలో ఓ వ్యక్తి తన భార్య ఫోన్ కాల్ ద్వారా అక్రమ వ్యాపారం చేసి దీని ద్వారా సుమారు రూ.15 కోట్ల (15 Crores)మేర లాభం పొందాడు.
- By Gopichand Published Date - 08:09 PM, Fri - 23 February 24
15 Crores: అమెరికాలో ఓ వ్యక్తి తన భార్య ఫోన్ కాల్ ద్వారా అక్రమ వ్యాపారం చేసి దీని ద్వారా సుమారు రూ.15 కోట్ల (15 Crores) మేర లాభం పొందాడు. వాస్తవానికి అతని భార్య తన ఇంటి నుండి పని చేస్తోంది. ఈ సమయంలో ఆమె తన కార్యాలయ ఉద్యోగులతో ఒప్పందం గురించి మాట్లాడుతోంది. టైలర్ లౌడన్ అతని భార్య చెప్పినదంతా విన్నాడు. ఆ సమాచారాన్ని ఉపయోగించుకుని $1.76 మిలియన్ల లాభం పొందాడు. అసలేం జరిగిందో పూర్తిగా తెలుసుకుందాం.
అసలు విషయం ఏమిటి..?
మీడియా నివేదికల ప్రకారం.. టైలర్ లౌడన్ తన భార్య ఫోన్లో మాట్లాడుతున్నట్లు విన్నాడని, అందుకున్న సమాచారాన్ని ఉపయోగించి అతను అక్రమ వ్యాపారం చేసినట్లు తెలుస్తోంది. తద్వారా అతనికి $ 1.76 మిలియన్ల లాభం వచ్చిందని అమెరికా SEC తెలిపింది. SEC ప్రకారం.. BP Plc త్వరలో ట్రావెల్సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్ను విలీనం చేయబోతోంది. దాని మేనేజర్ టైలర్ లౌడన్ భార్య. లౌడన్ భార్య ఈ ఒప్పందం గురించి తన ఆఫీసు వ్యక్తులతో మాట్లాడుతుండగా అది లౌడన్ విన్నాడు. దీని తర్వాత అతను నెలల తరబడి ట్రావెల్సెంటర్స్ ఆఫ్ అమెరికా ఇంక్లో తన వాటాలను కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి 2023లో BP ట్రావెల్సెంటర్లను 74% ప్రీమియంతో కొనుగోలు చేసినప్పుడు లౌడన్ $1.76 మిలియన్లు సంపాదించాడు.
Also Read: PM Modi: రాహుల్ గాంధీపై మోడీ ఫైర్, కారణమిదే
టైలర్ భార్య బీపీకి తన భర్త వ్యాపారం గురించి పూర్తి సమాచారం ఇచ్చింది. ఈ విషయం తెలిసిన వెంటనే కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె కావాలనే తన భర్తకు మొత్తం సమాచారం ఇచ్చిందని కంపెనీ అభిప్రాయపడింది. అయితే టైలర్ భార్యపై కంపెనీకి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ మొత్తం విషయం వెల్లడైన తర్వాత టైలర్ భార్య ఇంటిని విడిచిపెట్టి, తన భర్త నుండి విడాకులు కోరింది. SEC ప్రకారం.. లౌడన్తో ఒక పరిష్కారం కుదిరింది. అతను ట్రేడింగ్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నాడు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించేందుకు సిద్ధమయ్యాడు.
We’re now on WhatsApp : Click to Join
Related News
Viral video: ఓటు వేసేందుకు వచ్చిన మహిళ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది, ఏం జరిగిందంటే!
Viral video: లోక్ సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు యాభై ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం బెంగళూరు జేపీ నగర్ 8వ ఫేజ్ లోని జంబో సవారి దిన్నెలోని ప్రభుత్వ పాఠశాలకు వెళ్లింది. ఓటు కోసం పోలింగ్ బూత్ వద్ద క్యూలో నిల్చుంది. ఓటర్ల క్యూ దగ్గర ఉంచిన నీళ్లు తీసుకునేందుకు ఆ మహిళ ప్రయత్నించింది. అకస్మాత్తుగా ఆమెకు మైకం రావడంతో ఒక్కసారిగా పడిపోయింది. కాని డాక్టర్ అలర్ట్ అయి వెంటనే గుర్�