Bangladesh Violence: బంగ్లాదేశ్లో మరోసారి హింస.. ఈసారి టార్గెట్ ఎవరంటే?
ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలోని జాతీయ పార్టీ (ఎర్షాద్) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్ స్థానిక టీవీ ఛానెల్లు, ఇతర మీడియా సంస్థలు నివేదించాయి.
- Author : Gopichand
Date : 01-11-2024 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh Violence: బంగ్లాదేశ్లో మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి పారిపోయిన తర్వాత కూడా మహ్మద్ యూనస్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా బంగ్లాదేశ్లో శాంతి (Bangladesh Violence) నెలకొనలేదు. దేశంలో అడపాదడపా హింస చెలరేగుతోంది. షేక్ హసీనాకు మద్దతు ఇస్తున్న జాతీయ పార్టీ ప్రధాన కార్యాలయానికి గురువారం రాత్రి దాడి చేసిన వ్యక్తులు నిప్పు పెట్టారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
ఢాకాలోని బిజోయ్ నగర్ ప్రాంతంలోని జాతీయ పార్టీ (ఎర్షాద్) పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని బంగ్లాదేశ్ స్థానిక టీవీ ఛానెల్లు, ఇతర మీడియా సంస్థలు నివేదించాయి. అక్కడున్న పార్టీ సభ్యులతో చాలాసేపు వాగ్వాదం జరిగి చివరకు కార్యాలయానికి నిప్పుపెట్టారు. ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం అందలేదు.
Also Read: IPL 2025 : ఐపీఎల్ 2025 రిటెన్షన్ లిస్ట్ ఇదిగో.. ఏ ప్లేయర్కు ఎంత రేటు అంటే ?
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక దళం వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని ఫైర్ సర్వీస్, సివిల్ డిఫెన్స్ అధికారి రషీద్ బిన్ ఖలీద్ అసోసియేటెడ్ ప్రెస్తో ఫోన్లో తెలిపారు. జాతీయ పార్టీ బంగ్లాదేశ్లో మూడవ అతిపెద్ద పార్టీ. దీనిని 1980లలో మాజీ సైనిక నియంత H.M. ఇర్షాద్ చేశాడు.
Also Read: Karthik Naralasetty : అమెరికా ఎన్నికల్లో ఆంధ్రా యువకుడు.. ‘ది హిల్స్’లో మేయర్ అభ్యర్థిగా పోటీ
UN ఆర్డర్ కారణంగా ఢాకాలో భయాందోళనలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనానికి ముందు, ఆ తర్వాత జరిగిన హింసాకాండలో జరిగిన అన్ని హత్యలు, ఇతర మానవ హక్కుల ఉల్లంఘనలపై సమగ్ర విచారణకు ఐక్యరాజ్యసమితి (UN) పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెండు రోజుల బంగ్లాదేశ్ పర్యటన బుధవారం ముగిసింది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం దేశంలో శాంతిని నెలకొల్పడంలో సవాళ్లతో వ్యవహరిస్తున్న సమయంలో ఆయన పర్యటన వచ్చింది.