Over 3,800 Killed: టర్కీలో భారీ భూకంపం.. 3800లకు చేరిన మృతుల సంఖ్య
భూకంపాలు (Earthquakes) వస్తే నష్టం ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి విపత్తులన్నింటిలో భూకంపం అతి పెద్దగా చెప్పబడుతుండగా.. తాజాగా తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది.
- By Gopichand Published Date - 06:05 AM, Tue - 7 February 23
భూకంపాలు (Earthquakes) వస్తే నష్టం ఎంత భారీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రకృతి విపత్తులన్నింటిలో భూకంపం అతి పెద్దగా చెప్పబడుతుండగా.. తాజాగా తుర్కియే, సిరియాలో భారీ భూకంపం సంభవించడంతో ప్రపంచం మరోసారి ఉలిక్కిపడింది. ఒక్కసారిగా ఊహించని విధంగా భూకంపం రావడంతో..జనాలు వణికిపోయారు. భారీ భూకంపం ధాటికి భారీ బిల్డింగులు నేలమట్టం అయ్యాయి. ఇప్పటికే 3800 మందికి పైగా మరణించినట్లు అధికారులు చెబుతుండగా.. గడ్డకట్టే చలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
టర్కీలో సోమవారం మూడుసార్లు భూకంపం సంభవించింది. మూడోసారి భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6గా నమోదైంది. ఈ ప్రకంపనలు సాయంత్రం 5.32 గంటలకు సంభవించగా ఈ ప్రకంపనలు భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.54 గంటలకు కూడా సంభవించాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.5గా నమోదైంది. దీని కేంద్రం అంకారా నుండి 427 కి.మీ, భూమి నుండి 10 కి.మీ. లోపల ఉండేది. ప్రారంభ భూకంపం తర్వాత 7.5 తీవ్రతతో సహా 50కి పైగా ప్రకంపనలు సంభవించాయి. అదే సమయంలో దక్షిణ టర్కీలోని కహ్రమన్మరాస్ ప్రావిన్స్లోని ఎల్బిస్తాన్ జిల్లాలో 7.6 తీవ్రతతో మరో తాజా భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు ఏజెన్సీ తెలిపిందని టర్కీ వార్తా సంస్థ నివేదించింది. దీని ప్రభావం సిరియాలోని డమాస్కస్, లటాకియా, ఇతర సిరియా ప్రావిన్సులలో కూడా కనిపించింది.
Also Read: Rakhi Sawant: నా భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ రాఖీ సావంత్ కన్నీళ్లు!
అంతకుముందు సోమవారం ఉదయం 6.58 గంటలకు సంభవించిన భూకంపం కారణంగా టర్కీ, సిరియాలో 3800 మందికి పైగా మరణించారు. వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది గాయపడ్డారు. అటువంటి పరిస్థితిలో కొన్ని గంటల తర్వాత వచ్చిన ఈ రెండవ,మూడవ బలమైన షాక్ (భూకంపాలు) ప్రభుత్వం, పరిపాలనలో ఆందోళనను పెంచింది. అంతకుముందు.. టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం కారణంగా మరణించిన ప్రజల పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనను ఎదుర్కొనేందుకు భారత్ అన్ని విధాలా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరగడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.
Related News
Israel Operation: శరణార్థుల శిబిరంపై దాడి.. పిల్లలతో సహా 14 మంది మృతి
పశ్చిమాసియాలోని ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత ఏడు నెలలుగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 34 వేల మందికి పైగా మరణించారు.