అబూ ఖతల్ ఉగ్రవాద నేపథ్యం
- 2023 జనవరి 1న జమ్మూ కశ్మీర్లోని రాజౌరి జిల్లాలోని ధంగరి గ్రామంలో జరిగిన ఉగ్రదాడితోనూ అబూ ఖతల్(Hafiz Saeed)కు సంబంధం ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తెలిపింది.
- మరుసటి రోజు జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మూడు ఉగ్రదాడుల్లోనూ అబూ ఖతల్ పాత్ర ఉందని అంటారు.
- 2023 ఏప్రిల్ 20న కశ్మీరులోని భాటా ధురియన్ ప్రాంతంలో భారత సైన్యం లక్ష్యంగా ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు భారత సైనికులు అమరులయ్యారు.
- 2024 సంవత్సరం జూన్ 9న జమ్మూ కశ్మీర్లోని రియాసి జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. శివ్ ఖోడి ఆలయం నుంచి తిరిగొస్తున్న యాత్రికుల బస్సుపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అబూ ఖతల్ కీలక పాత్ర పోషించాడు. ఈ దాడిలో కొందరు యాత్రికులు చనిపోయారు.
- ఈ వరుస దాడుల్లో అబూ ఖతల్ హస్తం ఉందని గుర్తించిన భారత్.. అతడిని నిశితంగా ట్రాక్ చేస్తోంది.
- భారత్లోని జమ్మూకశ్మీరుతో పాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని లష్కరే తైబా క్యాడర్కు సమన్వయకర్తగా అబూ ఖతల్ పనిచేసేవాడని అంటున్నారు. ఆ క్యాడర్కు రహస్యంగా ఆయుధాలు, డబ్బును సప్లై చేసేవాడని చెబుతున్నారు.