Hiroshima: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన పీఎం మోదీ
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జపాన్లోని హిరోషిమా )Hiroshima) పర్యటనలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా (Hiroshima) వెళ్లారు.
- By Gopichand Published Date - 08:52 AM, Sat - 20 May 23
జీ-7 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) జపాన్లోని హిరోషిమా )Hiroshima) పర్యటనలో ఉన్నారు. జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ హిరోషిమా (Hiroshima) వెళ్లారు. G7 సమావేశానికి హాజరయ్యే ముందు ఆయన ఇక్కడ ఫ్యూమియోతో సమావేశమై మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచానికి శాంతి సందేశాన్ని కూడా అందించారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని స్థాపించి, ఆవిష్కరించే అవకాశం కల్పించినందుకు జపాన్ ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. మహాత్మాగాంధీ ఆశయాలను మనమంతా పాటించి లోకకల్యాణం బాటలో పయనించాలని అన్నారు. ఇది మహాత్మా గాంధీకి నిజమైన నివాళి అవుతుంది అన్నారు. హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహం అహింస ఆలోచనను మరింతగా పెంచుతుందని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH हिरोशिमा नाम सुनते ही आज भी दुनिया कांप जाती है। जी7 समिट की इस यात्रा में मुझे सबसे पहले पूज्य महात्मा गांधी की प्रतीमा का अनावरण का सौभाग्य मिला है। आज विश्व जलवायु परिवर्तन और आतंकवाद की लड़ाई से जूझ रहा है। पूज्य बापू के आदर्श जलवायु परिवर्तन के साथ जो लड़ाई है उसे… pic.twitter.com/KeWCBeIHhb
— ANI_HindiNews (@AHindinews) May 20, 2023
మహాత్మా గాంధీ జీవనశైలి ప్రకృతి పట్ల గౌరవం
నేటికీ హిరోషిమా పేరు వింటేనే ప్రపంచం వణికిపోతుందని మోదీ అన్నారు. G7 సమ్మిట్కు ఈ సందర్శనలో మోదీ మొదట గౌరవనీయమైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే విశేషాన్ని పొందారు. నేడు ప్రపంచం వాతావరణ మార్పులకు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. వాతావరణ మార్పులతో యుద్ధంలో విజయం సాధించాలంటే పూజ్య బాపు ఆదర్శం. అతని జీవనశైలి ప్రకృతి పట్ల గౌరవం, సమన్వయం, అంకితభావానికి సరైన ఉదాహరణ. మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మోదీ భారతీయ సమాజ ప్రజలను కూడా కలిశారు.
గాంధీ విగ్రహావిష్కరణ అనంతరం జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. పరస్పర సహకారం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో సహకారం జీ-7, జీ-20 సంస్థల మధ్య సమన్వయంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ప్రస్తుతం భారత్ జి-20 ఛైర్మన్గా ఉంది. హిరోషిమాలో దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సమావేశంలో భారత్-దక్షిణ కొరియా సంబంధాలను బలోపేతం చేయడం, ఆసియా-పసిఫిక్లోని పరిస్థితులు, ఇతర వాణిజ్య అంశాలపై మోదీ, యోల్ మధ్య చర్చలు జరిగాయి. ఈరోజు జీ-7 సమావేశానికి హాజరుకావడమే కాకుండా ప్రధాని మోదీ మరో 38 సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. దీని తర్వాత మోదీ పాపువా న్యూ గినియా, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో కూడా పర్యటించనున్నారు. ఈ రెండు దేశాల్లోనూ స్థానిక ప్రభుత్వాధినేతలు, ప్రవాస భారతీయులతో భేటీ కానున్నారు.
Related News
Amit Shah: 400 ఫిగర్ ప్పై అమిత్ షా క్లారిటీ ఇదే..
2024 లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు అనే నినాదాన్ని ప్రధాని మోదీ ఎందుకు ఇచ్చారో వివరించారు అమిత్ షా. శుక్రవారం రాజస్థాన్లోని పాలి నగరంలో జరిగిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ..ఓబీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా రిజర్వేషన్లకు ప్రధాని మోదీయే ఎక్కువ మద్దతు ఇస్తున్నారని నేను వారికి చెప్పాలనుకుంటున్నానని అమిత్ షా అన్నారు.