Bangladesh: బంగ్లాదేశ్లో రేపే తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు.. ప్రధాని ఎవరంటే..?
బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు.
- By Gopichand Published Date - 11:06 PM, Wed - 7 August 24

Bangladesh: బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత తాత్కాలిక ప్రభుత్వ చిత్రం స్పష్టమైంది. గురువారం నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. బంగ్లా (Bangladesh) మాజీ ప్రధాని యూనస్ షేక్ హసీనా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మూలాల ప్రకారం మహ్మద్ యూనస్ సలహా మండలిలో 15 మంది సభ్యులు ఉండవచ్చు. దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. హిందువులపై కూడా దాడులు జరుగుతున్నాయి.
ఆర్మీ చీఫ్ సమాచారం ఇచ్చారు
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీ గురువారంనాడు తాత్కాలిక ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయనుంది. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ ఈ ప్రభుత్వానికి అధిపతిగా ఉంటారు. షేక్ హసీనా రాజీనామా చేసి భారతదేశానికి చేరుకున్న తర్వాత ఆర్మీ చీఫ్ ఆర్మీ హెడ్క్వార్టర్స్లో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచిన విషయం తెలిసిందే. ఇందులో అవామీ లీగ్ ప్రతినిధులు పాల్గొనలేదు. మాజీ ప్రధాని, బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కూడా దేశ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.
Also Read: CM Revanth: ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో ముఖ్యమంత్రి రేవంత్ బృందం భేటీ!
ఖలీదా జియా భారీ ర్యాలీ
బంగ్లాదేశ్లో తిరుగుబాటు తర్వాత రాజకీయ పార్టీల ఉద్యమం గతంలో కంటే మరింత ఉధృతంగా మారింది. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా దేశానికి ఓ సందేశం ఇచ్చారు. దీంతో పాటు ఆయన తన పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల భారీ ర్యాలీ తలపెట్టారు. శాంతిని నెలకొల్పాలని సామాన్య ప్రజలకు సైన్యం, అన్ని పార్టీలు విజ్ఞప్తి చేశాయి. దేశంలో నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా సామాన్యుల జీవనం అతలాకుతలమైంది.
అయితే బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారత్ చేరుకున్నారు. త్వరలోనే ఆమె భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.