Attacks by people : నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే కూలిపోవడమే !!
Attacks by people : ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలక తప్పదు. నేపాల్లో తీవ్రమైన అవినీతి, ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం సోషల్ మీడియాపై నిషేధం విధించడం
- Author : Sudheer
Date : 10-09-2025 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. వారు తలచుకుంటే ప్రభుత్వాలు కూలిపోతాయని నేపాల్, బంగ్లాదేశ్(Bangladesh, Nepal)లో జరిగిన సంఘటనలు మరోసారి నిరూపించాయి. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటే ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సైతం కుప్పకూలక తప్పదు. నేపాల్లో తీవ్రమైన అవినీతి, ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం సోషల్ మీడియాపై నిషేధం విధించడం ప్రజల్లో ఆగ్రహాన్ని పెంచింది. తమ చేతుల్లోనే అధికారం ఉందని భావించిన ప్రజలు వీధుల్లోకి వచ్చి, తాము ఎన్నుకున్న నాయకులనే తరిమికొట్టారు. ఈ తిరుగుబాటుకు భయపడిన అప్పటి ప్రధాని కేపీ ఓలీ దేశం విడిచి పారిపోయారు.
“Super Six Super Hit” Public Meeting : నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’
గతేడాది బంగ్లాదేశ్లో కూడా ఇలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు, పాలనలో లోపాలు ప్రజల సహనాన్ని పరీక్షించాయి. చివరకు తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె కూడా దేశం విడిచి భారత్కు వచ్చేశారు. ఈ రెండు సంఘటనలు పాలకులకు ఒక గుణపాఠం నేర్పాయి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించకపోతే, వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యతను పాలకులే భరించాలని ఈ సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల గొంతును వినడం చాలా ముఖ్యం. ఏ పాలన అయినా, ఎంత బలమైన ప్రభుత్వం అయినా ప్రజల మద్దతు లేకపోతే ఎక్కువ కాలం నిలబడలేదు. ప్రజలను అణచివేయడం, వారి హక్కులను కాలరాయడం ద్వారా తాత్కాలికంగా అధికారాన్ని నిలబెట్టుకోవచ్చు కానీ, ప్రజాగ్రహం చివరికి వ్యవస్థలను సైతం మార్చగలదు. అందువల్ల, ప్రజాస్వామ్య దేశాల్లో నాయకులు ప్రజల అభిప్రాయాలను గౌరవించి, వారి సంక్షేమం కోసం పని చేయాలి. లేకపోతే, నేపాల్, బంగ్లాదేశ్ పాలకులకు పట్టిన గతే వారికీ పడుతుంది.