HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >World
  • >Mysterious Illness Kills 18 14 Among Them Children In Pakistans Karachi

Mysterious Illness Kills: పాకిస్థాన్‌లో వింత వ్యాధి.. 16 రోజుల్లో 18 మంది మృతి

పాకిస్థాన్‌లోని కరాచీని అంతుచిక్కని వ్యాధి (Mysterious Illness) హడలెత్తిస్తోంది. కరాచీలోని కెమరి దగ్గర తీరప్రాంతంలోని గోత్ గ్రామంలో వింతవ్యాధితో 18 మంది మరణించగా వారిలో 14 మంది చిన్నారులే ఉన్నట్లు పాక్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ నిర్ధారించారు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నామని, బహుశా సముద్ర నీటి ద్వారా వచ్చి ఉం డొచ్చని అధికారులు భావిస్తున్నారు.

  • By Gopichand Published Date - 07:25 AM, Sat - 28 January 23
  • daily-hunt
Suicide
Deadbody Imresizer

పాకిస్థాన్‌లోని కరాచీని అంతుచిక్కని వ్యాధి (Mysterious Illness) హడలెత్తిస్తోంది. కరాచీలోని కెమరి దగ్గర తీరప్రాంతంలోని గోత్ గ్రామంలో వింతవ్యాధితో 18 మంది మరణించగా వారిలో 14 మంది చిన్నారులే ఉన్నట్లు పాక్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ నిర్ధారించారు. ఈ వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నామని, బహుశా సముద్ర నీటి ద్వారా వచ్చి ఉం డొచ్చని అధికారులు భావిస్తున్నారు. వ్యాధి సోకిన వారు గొంతువాపు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు.

పాకిస్తాన్‌లో దుస్థితి మధ్య, ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం లేదు. ఇప్పుడు ఓ మిస్టరీ వ్యాధి అక్కడి ప్రజల ఇబ్బందులను మరింత పెంచింది. కరాచీలోని కెమారి ప్రాంతంలో ఒక వింత వ్యాధి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దక్షిణ పాకిస్థానీ పోర్ట్ సిటీలోని ఆరోగ్య అధికారులు ఇప్పటికీ మరణాల కారణాన్ని నిర్ధారించలేకపోయారు. జనవరి 10 నుంచి 25 మధ్య కెమారీలోని మవాచ్ గోత్ ప్రాంతంలో వింత వ్యాధి కారణంగా 14 మంది పిల్లలతో సహా 18 మంది మరణించినట్లు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమానీ శుక్రవారం ధృవీకరించారు.

ఈ వింత వ్యాధి కరాచీలోని కెమారీ ప్రాంతంలోని మావాచ్ గోత్‌లో వ్యాపించింది. కేవలం 16 రోజుల్లోనే ఈ వ్యాధి 18 మందిని బలిగొంది. మృతుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఉండగా, మరొక వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలను అనుమానాస్పద అనారోగ్యంతో కోల్పోయాడు. మవాచ్ గోత్ ఒక మురికివాడ ప్రాంతం. ఇక్కడ నివసించే వారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలు లేదా మత్స్యకారులు. ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని మాట్లాడుతూ.. “మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి ఆరోగ్య సేవా బృందం ఇంకా పని చేస్తోంది. అయితే ఈ మరణాలు సంభవించిన గోత్ (గ్రామం) కారణంగా ఇది సముద్ర నీటికి సంబంధించినదని మేము అనుమానిస్తున్నాము.” అన్నారు.

Also Read: Kiwis T20: కివీస్‌దే తొలి టీ ట్వంటీ

ఆరోగ్య సేవల డైరెక్టర్ అబ్దుల్ హమీద్ జుమాని మాట్లాడుతూ.. మృతుల కుటుంబ సభ్యుల నుంచి అందిన సమాచారం మేరకు మరణానికి ముందు తీవ్ర జ్వరం, గొంతునొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అదే సమయంలో ఆ ప్రాంతంలో వింత వాసన వస్తోందని కూడా కొందరు చెప్పారు. అక్కడి ఫ్యాక్టరీ యజమానులను కూడా విచారించేందుకు అదుపులోకి తీసుకున్నామని కెమారి డిప్యూటీ కమిషనర్ ముఖ్తార్ అలీ అబ్రో తెలిపారు. “మేము ప్రాంతీయ పర్యావరణ ఏజెన్సీని కూడా పిలిపించాము. ఆ ప్రాంతంలో పనిచేస్తున్న మూడు కర్మాగారాల నుండి నమూనాలను ఏజెన్సీ సేకరించింది” అన్నారాయన. సింధ్ సెంటర్ ఫర్ కెమిస్ట్రీ హెడ్ ఇక్బాల్ చౌదరి మాట్లాడుతూ.. ఫ్యాక్టరీల నుండి సోయాబీన్స్ కొన్ని నమూనాలను కూడా సేకరించామని, సోయా అలర్జీ వల్ల మరణాలు సంభవించవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. ఇంకా ఖచ్చితమైన నిర్ధారణకు రాలేదు కానీ నమూనాలను పరిశీలిస్తున్నామన్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Karachi
  • Mysterious Illness
  • Mysterious Illness Kills
  • pakistan
  • world news

Related News

Submarine Cable

Submarine Cable : సబ్‌మరైన్ కేబుల్స్ పై దాడి.. ప్రపంచం ఎందుకు షాక్‌లో ఉంది?

Submarine Cable : ఎర్ర సముద్రం గర్భంలో కీలకమైన సబ్‌మరైన్ కేబుల్స్ తెగిపోవడంతో మధ్య ప్రాచ్య దేశాలతో పాటు పాకిస్థాన్‌‌లో ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

  • Aligned Partners

    Aligned Partners: ట్రంప్ కొత్త వాణిజ్య విధానం.. ‘అలైన్డ్ పార్టనర్స్’కు సున్నా టారిఫ్‌లు!

  • PM Modi

    PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

  • Upendra Dwivedi

    Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

  • Putin- Kim Jong

    Putin- Kim Jong: పుతిన్‌తో కిమ్ జోంగ్ ఉన్ భేటీ.. ఆస‌క్తిక‌ర వీడియో వెలుగులోకి!

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd