United Kingdom: యూకేలో భారత సంతతి విద్యార్థి సహా ముగ్గురు మృతి.. అసలేం జరిగింది.. పోలీసులు ఏం చెప్తున్నారు..?
యూకే (United Kingdom)లోని నాటింగ్హామ్లో మంగళవారం జరిగిన వరుస దాడుల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక కూడా ఉంది.
- By Gopichand Published Date - 10:44 AM, Thu - 15 June 23
United Kingdom: యూకే (United Kingdom)లోని నాటింగ్హామ్లో మంగళవారం జరిగిన వరుస దాడుల్లో ముగ్గురు చనిపోయారు. మృతుల్లో భారత సంతతికి చెందిన ఓ బాలిక కూడా ఉంది. ఆమె నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం విద్యార్థిని. ఆమె తన స్నేహితుడితో కలిసి పరీక్షలు ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగినట్లు సమాచారం.
నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు
ఈ దాడి తర్వాత ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని ప్రధాని రిషి సునక్ అన్నారు. ఈ ఘటనను స్థానిక పోలీసులు తీవ్ర స్థాయిలో అభివర్ణించారు. ఈ మూడు వేర్వేరు ఘటనలకు ఉగ్రవాదానికి ఏమైనా సంబంధం ఉందా అనేది అనిశ్చితంగా ఉంది. సమాచారం ప్రకారం.. మంగళవారం ఉదయం ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై శవమై కనిపించగా, మూడవ వ్యక్తి మరొక రహదారిపై శవమై కనిపించాడు. ఇక మూడో ఘటనలో ఓ కారు ముగ్గురు వ్యక్తులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పీఎం సునక్ ట్వీట్ చేశారు. నాటింగ్హామ్లో జరిగిన దిగ్భ్రాంతికరమైన సంఘటనపై స్పందించినందుకు నేను పోలీసులకు, అత్యవసర సేవలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
Also Read: New Zealand: న్యూజిలాండ్లో ఆర్థిక మాంద్యం.. స్పష్టం చేసిన ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్
సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు
పోలీసులు పని చేసేందుకు సమయం ఇవ్వాలని అన్నారు. క్షతగాత్రుల కుటుంబాలకు, ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటనలపై ఎవరి వద్ద సమాచారం ఉంటే వారు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. ఇది కత్తిపోటు ఘటనగా ప్రత్యక్ష సాక్షులు అభివర్ణించారు. నాటింగ్హామ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్ కేట్ మిన్నెల్ ఇలా అన్నారు. ఇది భయంకరమైన, విషాదకరమైన సంఘటన. ఇది ముగ్గురి ప్రాణాలను బలిగొంది. మూడు సంఘటనలు అనుసంధానించబడి ఉన్నాయని, ఒక వ్యక్తి మా అదుపులో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. విచారణ ప్రాథమిక దశలో ఉందని, విచారణ అధికారి ఆధారాలు సేకరిస్తున్నారన్నారు.
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.