HMPV Virus China: చైనాలో ప్రాణాంతక వైరస్.. భారతదేశంపై ప్రభావం ఎంత?
చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. చైనాలో వ్యాపించిన ఈ వైరస్ తొలిసారిగా 2001లో నెదర్లాండ్స్లో వ్యాపించింది. ఈ వైరస్ సాధారణంగా జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది.
- Author : Gopichand
Date : 05-01-2025 - 6:30 IST
Published By : Hashtagu Telugu Desk
HMPV Virus China: 2020 సంవత్సరంలో కోవిడ్ -19 (కరోనా వైరస్) చైనా నుండి ఉద్భవించిన వైరస్. భారతదేశంతో సహా మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా లక్షలాది మంది మరణించారు. ప్రపంచం లాక్డౌన్ను ఎదుర్కోవలసి వచ్చింది. ప్రజలు నెలల తరబడి ఇళ్లలోనే గడిపారు. ఒకవైపు మహమ్మారి ప్రజల ప్రాణాలను బలిగొంది. మరోవైపు లాక్డౌన్ కారణంగా ప్రజల వ్యాపారాలు, ఉపాధి స్తంభించింది. దీంతో మనస్తాపం చెందిన ప్రజలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు.
ఈ రోజుకి కూడా లాక్ డౌన్ ప్రభావం నుండి ప్రజలు కోలుకోలేకపోతున్నారు. ఇప్పుడు చైనాలో మరో వైరస్ వ్యాపించింది. దీని ముప్పు మొత్తం ప్రపంచాన్ని పొంచి ఉంది. ఈ వైరస్ పేరు హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV Virus China). దీని కారణంగా చైనా ప్రజలు న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ వ్యాధికి సంబంధించిన అనేక కేసులు నివేదించబడ్డాయి. ఈ వైరస్ భారతదేశానికి ఎంత ప్రమాదకరమైనది? దేశంలో వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఏమి చేస్తున్నారు? అనే విషయాలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
Also Read: Mulugu Municipality: ఇక ములుగు మున్సిపాలిటీ.. నెరవేరిన ప్రజల కల
భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదు
చైనాలో వైరస్ వ్యాప్తి గురించి ప్రస్తావించింది. దేశంలో వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధుల సంఖ్య పెద్దగా పెరగలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. నేషనల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారి బృందం దేశవ్యాప్తంగా కాలానుగుణ ఇన్ఫ్లుఎంజా కేసులను నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. ప్రపంచ స్థాయిలో ఈ వ్యాధుల పరిస్థితిని పర్యవేక్షించడానికి అంతర్జాతీయ ఏజెన్సీలను సంప్రదిస్తున్నట్లు పేర్కొన్నారు.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) డాక్టర్ అతుల్ గోయల్ కూడా చైనాలో కనుగొనబడిన వైరస్ శ్వాసకోశ వైరస్ లాంటిదని, ఇది సాధారణ జలుబుకు కారణమవుతుందని ఒక ప్రకటన ఇచ్చారు. ఇది వృద్ధులు, చాలా చిన్న పిల్లలలో ఫ్లూ వంటి లక్షణాలను కలిగిస్తుంది. శ్వాసకోశ వ్యాధుల విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. భారతదేశంలోని శ్వాసకోశ రోగుల డేటాను తాను విశ్లేషించానని చెప్పారు. డిసెంబర్ 2024కి సంబంధించి ఈ గణాంకాలలో పెరుగుదల లేదు. దేశంలోని ఏ సంస్థలోనూ పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వలేదన్నారు.
ఈ వైరస్ 2001లో నెదర్లాండ్స్లో వ్యాపించింది
భారతీయులు ఇన్ఫెక్షన్ రాకుండా సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలని DGHS డాక్టర్ అతుల్ గోయల్కు చెప్పారు. ఎవరికైనా దగ్గు, జలుబు ఉంటే వారిని సంప్రదించకుండా ఉండమని సలహా ఇచ్చారు. జలుబు, జ్వరానికి అవసరమైన సాధారణ మందులను తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భయపడాల్సిన పనిలేదని తెలిపారు. చలికాలంలో శ్వాసకోశ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. చైనాలో వ్యాపించిన ఈ వైరస్ తొలిసారిగా 2001లో నెదర్లాండ్స్లో వ్యాపించింది. ఈ వైరస్ సాధారణంగా జలుబు వంటి లక్షణాలను కలిగిస్తుంది.