Also Read :Kanchi Kamakoti Peetam : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా తెలుగుతేజం గణేశశర్మ.. నేపథ్యమిదీ
పాక్లో వ్యవసాయ రంగానికి గడ్డుకాలమే
సింధూ, దాని ఉపనదుల జలాల పంపిణీ కోసం 1960లో భారత్, పాక్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం తూర్పున ఉన్న బియాస్, రావీ, సట్లజ్ నదుల్లోని నీళ్లపై హక్కులు భారత్కు.. సింధూ నది, ఛెనాబ్, ఝెలమ్ నదుల నీళ్లు పాక్కు దక్కాయి. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెప్పాలన్న సంకల్పంతో ఈ ఒప్పందం అమలును భారత్ నిలుపుదల చేసింది. సింధూ నది నీటిని భారత్ దిగువన ఉన్న పాక్కు విడుదల చేయకపోతే దాయాది దేశానికి షాక్ తప్పదు. అక్కడ వ్యవసాయ రంగం కుదేలు అవుతుంది.