China Earthquake : చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి
China Earthquake : చైనాలో సోమవారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.
- By Pasha Published Date - 07:02 AM, Tue - 19 December 23
China Earthquake : చైనాలో సోమవారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది. గన్సు, క్వింఘై ప్రావిన్సులలో సంభవించిన శక్తివంతమైన భూకంపాలలో 111 మందికిపైగా చనిపోయారు. మరో 200 మందికిపైగా గాయపడినట్లు అధికారులు మంగళవారం ఉదయం వెల్లడించారు. వాయవ్య చైనాలోని పర్వత ప్రాంతాలలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని చైనా ప్రభుత్వ మీడియా ఏజెన్సీ ‘జిన్హువా’ తెలిపింది. సోమవారం అర్ధరాత్రి టైంలో వచ్చిన ఈ భూకంపం కారణంగా గన్సు ప్రావిన్స్లో 100 మందికిపైగా, దాని పొరుగునే ఉన్న క్వింఘై ప్రావిన్స్లో మరో 11 మంది మరణించారని పేర్కొంది. గన్సు ప్రావిన్స్లో 96 మంది, క్వింఘై ప్రావిన్స్లో 124 మంది గాయపడ్డారని వెల్లడించింది.
#UPDATE: Video captured the moment when a 6.2-magnitude earthquake shook Linxia Hui Autonomous Prefecture in NW China's Gansu on Monday night. The quake can be felt in major cities like Xi’an and Chengdu. pic.twitter.com/CrDeQBbnyO
— People's Daily, China (@PDChina) December 18, 2023
We’re now on WhatsApp. Click to Join.
క్వింఘై ప్రాంతీయ సరిహద్దు నుంచి 5 కిలోమీటర్ల (3 మైళ్ళు) దూరంలో ఉన్న గన్సు ప్రావిన్స్ పరిధిలోని జిషిషన్ కౌంటీలో కూడా భూకంపం(China Earthquake) సంభవించింది. అక్కడ భూకంప తీవ్రత 5.9గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. నీరు, విద్యుత్ లైన్లు, రవాణా, సమాచార మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లినట్లు చైనా టీవీ ఛానెల్ CCTV నివేదించింది. భూకంపంతో ప్రభావితమైన ప్రాంతాలకు టెంట్లు, ఫోల్డింగ్ బెడ్లు, క్విల్ట్లను పంపారని చెప్పింది. భూకంపం జరిగిన చోట సహాయక చర్యలను వేగవంతం చేయాలని చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ పిలుపునిచ్చారు.
Also Read: JN.1 Covid Variant: కరోనా JN.1 కొత్త వేరియంట్ కలకలం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..!
Related News
Elon Musk: భారత పర్యటన రద్దు చేసుకుని చైనా వెళ్లిపోయిన ఎలాన్ మస్క్
ఎలోన్ మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని చైనా వెళ్లడం చర్చనీయాంశమైంది. ఈ పర్యటన పబ్లిక్ గా జరగలేదు. ఓ ప్రైవేట్ జెట్ ద్వారా ఎలాన్ మస్క్ చైనా వెళ్లినట్లు అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం మస్క్ చైనా పర్యటనలో భాగంగా చైనా అధికారులతో రహస్య భేటీలు నిర్వహించారు.