HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >China Warned America Not To Interfere In Its Relationship With India

China Warned America: అమెరికాకు చైనా వార్నింగ్..!

భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది.

  • By Maheswara Rao Nadella Published Date - 12:20 PM, Wed - 30 November 22
  • daily-hunt
America China
America China

భారత్‌తో తమ సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించినట్టు పెంటగాన్ నివేదిక వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని PRC అధికారులు చెప్పారని నివేదిక తెలిపింది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడటానికి భారత్, అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు విఘాతం కలగకుండా ప్రతిష్టంభనకు తెరదించాలనే ఉద్దేశాన్ని వారు నొక్కి చెప్పారని ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్‌కు సమర్పించిన నివేదికలో పేర్కొంది.

‘‘PRC (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా) భారత్‌తో సరిహద్దు ఉద్రిక్తతలను నిరోధించేందుకు అమెరికాతో మరింత సన్నిహితంగా భాగస్వామి కావడానికి ప్రయత్నిస్తోంది. భారత్‌తో చైనా సంబంధాలలో జోక్యం చేసుకోవద్దని పీఆర్‌సీ అధికారులు హెచ్చరించారు’’ అని తెలిపింది. భారత్ సరిహద్దులో 2021 అంతటా బలగాల మోహరింపు, వాస్తవాధీన రేఖ వెంట మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని చైనా కొనసాగించిందని పేర్కొంది. సరిహద్దుల్లో తమ ప్రయోజనాల విషయంలో ఇరుపక్షాలు వెనక్కితగ్గకపోవడంతో చర్చలు ఆశించిస్థాయిలో పురోగతిని సాధించలేదని నివేదిక అభిప్రాయపడింది. మే 2020 నుంచి వాస్తవాధీన రేఖ వెంబడి అనేక ప్రాంతాల్లో భారత్, చైనాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. దీంతో ఇరు దేశాలూ తమ బలగాలను భారీగా మోహరించాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను చర్చల ద్వారా పరిష్కరించుకునే ప్రక్రియలో భాగంగా 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చ‌ర్చ‌లు జరిగాయి.

‘‘ప్రతి దేశం మరొకరి బలగాలను ఉపసంహరించుకోవాలని, ప్రతిష్టంభనకు ముందు పరిస్థితులకు తిరిగి రావాలని డిమాండ్ చేసింది. అయితే చైనా లేదా భారత్ ఆ షరతులపై అంగీకరించలేదు’’ అని నివేదిక పేర్కొంది. ‘ప్రతిష్టంభన విషయంలో భారత్ మౌలిక సదుపాయాల నిర్మాణంపై ఆరోపణలు చేసిన చైనా తమ భూభాగాన్ని ఆక్రమించారని అయితే మా భూభాగంలోకి చైనా దూకుడుగా చొరబాట్లను ప్రారంభించిందని భారత్ ఆరోపించింది’’ అని పెంటగాన్ నివేదిక తెలిపింది. మే 2020లో తూర్పు లడఖ్‌ లోకి చైనా సైన్యం చొచ్చుకురావడంతో భారత్ ధీటుగానే స్పందించింది. దీంతో అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఎంతో ప్రశాంతంగా ఉండే గల్వాన్‌లో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఘర్షణల తర్వాత అక్కడి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉద్రిక్త వాతావరణ పరిస్థితుల నడుమ కొన్ని ప్రాంతాల్లోకి చైనా సైన్యం ప్రవేశించింది. రెండేళ్ల కింద భారత్ కొత్త మ్యాప్‌లో ఆక్సాయీ చిన్‌ను తమ ప్రాంతంగా చూపించడంపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత నుంచే సరిహద్దుల్లో చైనా దుందుడుకు వైఖరి ప్రదర్శిస్తోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • china
  • india
  • Relationship
  • USA
  • warning
  • world

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

  • Huge Explosion In America

    Huge Explosion in America : అమెరికాలో భారీ పేలుడు

Latest News

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

  • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

  • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

  • Telangana Bandh : తెలంగాణ బంద్.. ఎవరిపై ఈ పోరాటం?

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd