China Travel Ban: అమెరికా, చైనాల మధ్య ప్రయాణాన్ని నిషేధించాలని డిమాండ్.. అధ్యక్షుడు జో బైడెన్ కు లేఖ..!
చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. చాలా మంది US చట్టసభ సభ్యులు చైనాపై ప్రయాణ నిషేధాన్ని (China Travel Ban) డిమాండ్ చేశారు.
- Author : Gopichand
Date : 02-12-2023 - 8:02 IST
Published By : Hashtagu Telugu Desk
China Travel Ban: చైనాలో వేగంగా విస్తరిస్తున్న మిస్టరీ వ్యాధి యావత్ ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా మూలాన్ని దాచిపెట్టి చైనా ప్రపంచ విశ్వాసాన్ని కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా జన్యువుల నుంచి మొదలైన వ్యాధి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుందన్న భయం అన్ని దేశాల్లో నెలకొంది. చైనా చేసిన తప్పిదానికి ప్రపంచం మొత్తంఇబ్బందులు చవిచూసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి కూడా చైనా ఏదో దాస్తుందనే భయం నెలకొంది. చాలా మంది US చట్టసభ సభ్యులు చైనాపై ప్రయాణ నిషేధాన్ని (China Travel Ban) డిమాండ్ చేశారు. చైనాలో మీడియా స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఈ వ్యాధి ఎలాంటిదో, అసలు పరిస్థితి ఏమిటో చెప్పడం చాలా కష్టంగా మారింది.
ఈ రోజుల్లో చైనాలో మర్మమైన న్యుమోనియా భయం ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా, చైనాల మధ్య ప్రయాణాన్ని నిషేధించాలని అమెరికా సెనేటర్లు అధ్యక్షుడు జో బైడెన్ను డిమాండ్ చేశారు. రిపబ్లికన్ సెనేటర్ల బృందం ఈ మేరకు అధ్యక్షుడు జో బైడెన్కు లేఖ రాసింది. చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న శ్వాసకోశ వ్యాధి గురించి మరింత సమాచారం వచ్చే వరకు యుఎస్- చైనా మధ్య ప్రయాణాన్ని నిషేధించాలని పేర్కొన్నారు.
Also Read: Lamp: మీరు చేసే పనులు విజయవంతం అవ్వాలంటే.. దీపాన్ని ఇలా పెట్టాల్సిందే?
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పుడు అమెరికా సమయానికి ఆంక్షలు విధించలేదు. దీని వల్ల అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. గతంలో చేసిన తప్పులను మనం పునరావృతం చేయలేమని అమెరికా చట్టసభ సభ్యులు అంటున్నారు. ఆ సమయంలో ఆలస్యంగా ప్రయాణ నిషేధం కారణంగా చాలా మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని వారు పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.