HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Power Woes Force Karnataka Farmers To Drop Live Crocodile At Hescom Office In Vijayapura

Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు

మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది

  • By Praveen Aluthuru Published Date - 03:31 PM, Sat - 21 October 23
  • daily-hunt
Farmers With Crocodile
Farmers With Crocodile

Farmers With Crocodile: మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది. దాంతో రైతులు అప్పులు పాలవుతారు. మరికొన్ని సార్లు ప్రభుత్వాలు, అధికారుల చర్యలతో అన్నదాతలు నష్టపోతున్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, కరెంటు సరైన సమయంలో అందకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఇటీవల పగలు కరెంట్ ఇవ్వడం, రాత్రి ఇవ్వడం లేదని విసిగిపోయిన రైతులు ఏకంగా కరెంట్ ఆఫీసుకు మొసలిని తీసుకొచ్చారు.ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

విద్యుత్ అధికారులు పగటిపూట కాకుండా రాత్రిపూట కరెంటు ఇవ్వడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విజయపూర్ జిల్లా కొల్హార తాలూకా రోనిహాల్ గ్రామ ప్రజలు గత కొన్ని రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారి విజ్ఞప్తులకు అధికారులు మొండి చెయ్యి చూపిస్తుండటంతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఈ క్రమంలో హెస్కామ్ (హుబ్లీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్) కార్యాలయానికి ఓ మొసలి వచ్చింది. తాళ్లతో కట్టిన మొసలిని ట్రాక్టర్‌లో తీసుకొచ్చి హెస్కామ్ కార్యాలయం ఎదుట వదిలేశారు. అది చూసి హెస్కామ్ అధికారులు అవాక్కయ్యారు.

కొద్దిరోజులుగా శాంతియుతంగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని.. అందుకే ఇలా చేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. రాత్రి వేళల్లో పొలాలకు త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నామన్నారు. చీకట్లో పొలాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందని రైతులు వాపోతున్నారు. చీకట్లో పాములు, తేళ్లు, మొసళ్లు, వన్యప్రాణుల వల్ల ప్రాణభయం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాము పడుతున్న ఇబ్బందులు అధికారులకు కూడా తెలిసేందుకే ఇలా చేశామని స్థానిక రైతులు పేర్కొంటున్నారు.

రాత్రిపూట కరెంటు ఇస్తే ఏం లాభం అని రైతులు ప్రశ్నించారు. తమ సమస్యను అధికారులకు అర్థమయ్యేలా కరెంట్ ఆఫీసుకు మొసలిని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. పగటిపూట త్రీఫేజ్ కరెంటు ఇవ్వకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు రైతులకు చెప్పి తీసుకొచ్చిన మొసలిని తీసుకెళ్లారు. దీంతో సమస్య సద్దుమణిగింది.

Also Read: KTR: కర్ణాటకలో కరెంటు కోతలు.. కేటీఆర్ ఇంట్రస్టింగ్ ట్వీట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crocodile
  • farmers
  • HESCOM
  • karnataka
  • power supply
  • Vijayapura

Related News

Fertilizer Farmers

GST 2.0 : రైతులకు కేంద్రం శుభవార్త

GST 2.0 : రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు

  • Ram Charan Met CM

    Ram Charan Met CM: సీఎం సిద్ధ‌రామ‌య్య‌ను క‌లిసిన రామ్ చ‌ర‌ణ్‌.. వీడియో వైర‌ల్‌!

Latest News

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd