Bengaluru: తండ్రి అప్పు కట్టలేదని కుమార్తెపై అత్యాచారం
Bengaluru : తండ్రి అప్పు కట్టలేదని చెప్పి అతని మైనర్ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు
- Author : Sudheer
Date : 21-10-2024 - 1:04 IST
Published By : Hashtagu Telugu Desk
బెంగళూరు(Bengaluru)లో సిటీ లోని మాదనాయకనహళ్లి (Madanayakanahalli )లో దారుణం జరిగింది. తండ్రి అప్పు కట్టలేదని చెప్పి అతని మైనర్ కుమార్తె (victim age 17)పై ఓ వడ్డీ వ్యాపారి (Financier arrested) అత్యాచారానికి (Rape) పాల్పడ్డాడు. రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు అప్పు తీసుకుని రూ.30వేలు తిరిగిచ్చాడు. మిగతా రూ.40వేలు, వడ్డీ కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి ఒడిగట్టాడు. దీనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి, నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు.
ఇలాంటి ఘటనలు సమాజంలో అందర్నీ తలదించుకునేలా చేస్తాయి. మైనర్ బాలికలపై జరిగే దారుణాలు తీవ్రంగా చింతించదగిన విషయం. ఈ కేసులో, వడ్డీ వ్యాపారి ప్రవర్తన చాలా మాలినంగా ఉంది. ఇలాంటి ఘటనలపై అవగాహన పెంచడం, కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేయడం, బాధితులకు తక్షణ సహాయం అందించడం చాలా అవసరం. పిల్లలు, ముఖ్యంగా బాలికలు, సురక్షితంగా ఉండేందుకు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, సమాజం అందరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తూ..ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించవచ్చు.
Read Also : Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!