HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Rushikonda Palace Shocking Electric Bill For Rushikonda Buildings

Rushikonda Palace: రుషికొండ భవనాల కరెంట్ బిల్లు చూస్తే షాకే..!

  • Author : Vamsi Chowdary Korata Date : 21-10-2024 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rushikonda Powerbills
Rushikonda Powerbills

Rushikonda Palace: గత ప్రభుత్వం విశాఖ సమీపంలోని రుషికొండలో రూ.500 కోట్లతో నిర్మించిన భవనాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. వీటిని ఏ కార్యక్రమాలకు కూడా ఉపయోగించడం జరుగడం లేదు. కొత్తగా నిర్మించిన ఐదు భవనాలు పర్యాటక అవసరాలకు సరిపోదని కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కన్వెన్షన్ సెంటర్‌గా మారే అవకాశాలు కూడా లేవని వారు పేర్కొన్నారు.

ప్రభుత్వానికి భారంగా మారుతున్న ఈ భవనాలను ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించాలనుకుంటే, చాలా తీవ్ర భారమవుతుందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం, ఈ భవనాల నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద భారంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఈ భవనాలను ఏమైనా వినియోగిస్తే, కేవలం విద్యుత్ బిల్లులే నెలకు రూ.25 లక్షల వరకు వస్తాయని అంచనా వేశారు. అదనంగా, ఇతర నిర్వహణ ఖర్చులు కూడా భారీగా ఉంటాయని చెప్పారు.

రూ.85 లక్షల పెండింగ్:

గతేడాది నవంబర్ నుంచి రుషికొండలోని భవనాలకు కరెంట్ ఉపయోగిస్తున్నారు. అప్పటి నుంచి నెలకు సగటున రూ.7 లక్షల కరెంట్ బిల్ వస్తోంది. అయితే, ఇప్పటివరకు ఈ బిల్లులు చెల్లించలేదు, అందువల్ల దాదాపు రూ.85 లక్షల బకాయిలు ఏర్పడ్డాయి. కేవలం రాత్రిపూట విద్యుద్దీపాలు కారణంగా ఈ స్థాయిలో కరెంట్ బిల్ వచ్చింది అని చెబుతున్నారు. పూర్తిగా వినియోగిస్తే, మరింత అధికమైన బిల్ వచ్చిన ఆశ్చర్యం లేదు.

అడుగుకు రూ.30 వేలు:

ఐదు బ్లాకుల భవనాలను మొత్తం 1,48,413 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. చదరపు అడుగుకు సగటున రూ.30 వేలు ఖర్చు అయ్యింది. ఈ భవనాల్లో కొన్ని చోట్ల మాత్రమే ఫర్నీచర్ అమర్చబడింది. తరువాత ఎన్నికలు రావడంతో, వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో పెండింగ్ పనులు ఆగిపోయాయి. మిగిలిన ఫర్నీచర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది.

భవనాలకు తాళాలు:

ప్రస్తుతం ఈ భవనాలకు తాళాలు వేసి ఉంచారు, కాపలాకు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 10 నెలలుగా సరైన నిర్వహణ లేకపోవడంతో, భవనాలు దుమ్ము పట్టాయి. కొన్ని పరికరాలు తుప్పు పట్టి ఉన్నాయి. సముద్రాన్ని ఆనుకొని ఉండటం వల్ల ఉప్పు నీటి గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల, సరైన నిర్వహణ లేకపోతే ఫర్నీచర్ పాడైపోవడం సాధ్యమే అని వారు పేర్కొంటున్నారు.

వేసవిలో అసెంబ్లీ సమావేశాలు?

ఈ భవనాలను ప్రభుత్వం వినియోగించుకోవాలనే డిమాండ్ ఉంది. ఖాళీగా ఉంచేకంటే, ఏదైనా సంస్థకు అప్పగిస్తే ఆదాయం వస్తుందని వాదిస్తున్నారు. లేకపోతే, ఈ భవనాల్లో వేసవి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించవచ్చు అని స్థానికులు సూచిస్తున్నారు. అప్పుడు నిర్వహణ సరిగ్గా ఉండి, ఫర్నీచర్ పాడైపోకుండా ఉంటుందని వారు అంటున్నారు. అలాగే, పర్యాటకుల కోసం ఈ భవనాలను అందుబాటులోకి తీసుకురావాలని వారు సూచిస్తున్నారు.”


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP government
  • Rushikonda Bungalow
  • rushikonda palace
  • Rushikonda Palace Current Bills

Related News

Godavari Pushkaralu 2027 to Be Held on Kumbh Mela Scale as Pawan Kalyan

Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించినట్లు ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారని, ప్రధానంగా నిడదవోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శ

    Latest News

    • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

    • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

    • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

    • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

    • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

    Trending News

      • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

      • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

      • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

      • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

      • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd