HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Those Five Panchayats Should Be Handed Over To Telangana Mlc Kavitha

Kavitha : ఆ ఐదు పంచాయతీలను తెలంగాణకు అప్పగించాలి: ఎమ్మెల్సీ కవిత

రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది.

  • By Latha Suma Published Date - 03:25 PM, Fri - 20 June 25
  • daily-hunt
MLC Kavitha Fire
MLC Kavitha Fire

Kavitha: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశామని, అప్పట్లోనే సుప్రీం కోర్టుకు వెళ్లినప్పటికీ నిర్మాణాన్ని ఆపలేకపోయామని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం తీసుకున్న అన్యాయ నిర్ణయాలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు నేషనల్ ప్రాజెక్టు హోదా ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాంకేతికంగా మనలను మోసం చేసింది. 2014లో మోడీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా, తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించడం విపరీతమైన అన్యాయమని మేము అప్పుడే స్పష్టం చేశాం అని పేర్కొన్నారు.

Read Also: Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌ నేతల అత్యవసర భేటీ

ఈ తరహా నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగించాయని, 460 మెగావాట్ల లోయర్‌ సీలేరు హైడ్రో పవర్ ప్రాజెక్టును కూడా ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడం మరింత బాధాకరమని కవిత అభిప్రాయపడ్డారు. ఇవి అన్ని పార్లమెంటులో లెవెల్లో కూడా మేము ఎత్తిచూపేందుకు ప్రయత్నించాం. కేసీఆర్‌ గారు అప్పట్లో బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్రానికి ఏమాత్రం స్పందన కనిపించలేదు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని 36 లక్షల క్యూసెక్కుల నుంచి 50 లక్షల క్యూసెక్కులకు పెంచడం వల్ల ముంపు ప్రభావిత ప్రాంతాలు విస్తరించాయని ఆమె హెచ్చరించారు. ఇది కేవలం నీటి ప్రాజెక్టు సమస్య మాత్రమే కాదు. ఇది మానవీయ సమస్య. వేలాది కుటుంబాలు ఇళ్లను కోల్పోతున్నాయి. వారి జీవనాధారాలు నశిస్తున్నాయి. ఈ విషయంలో కేంద్రం మానవతా దృష్టితో స్పందించాలి అని ఆమె కోరారు. పురుషోత్తమపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకులపాడు వంటి గ్రామపంచాయతీలను మళ్లీ తెలంగాణకు కలిపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ నిర్వహించే సమావేశంలో, ఈ గ్రామాలను మళ్లీ తెలంగాణకు చేరుస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాలి అని ఆమె విజ్ఞప్తి చేశారు.

Read Also: Bhanuprakash Reddy: జగన్ బయటకు వస్తే శవాలు లేవాల్సిందే..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • BRS MLC kavitha
  • polavaram project
  • Purushothampatnam
  • telangana

Related News

Sama Rammohan Reddy

Sama Rammohan Reddy: కేటీఆర్‌కు సామ రామ్మోహన్ రెడ్డి సంచలన సవాల్!

గత పదేళ్లలో కేటీఆర్‌కు, ఆయన తండ్రికి (కేసీఆర్‌కు) సాధ్యం కాని దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం రెండేళ్లలోపు చేసి చూపించారని ఆయన స్పష్టం చేశారు.

  • Collector Field Visit

    Collector Field Visit: దెబ్బతిన్న పంటల పరిశీలనకు బైక్‌పై కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన!

  • Hyderabad Road Damage

    Congress Govt : తెలంగాణ సర్కార్ కు ప్రజల ప్రాణాలు పోయిన ఫర్వాలేదా..?

  • Hyd Bijapur Road

    HYD -Bijapur Highway : ఇది దారి కాదు..యమలోకానికి రహదారి

  • Bus Accidents Oct 4th

    Accidents : ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు..ఎక్కడెక్కడంటే !!

Latest News

  • Caffeine: రోజుకు ఎన్ని కప్పుల కాఫీ/టీ తాగడం సురక్షితం?

  • Prevent Heart Attack: భారతదేశంలో పెరుగుతున్న గుండె జబ్బుల ప్రమాదం!

  • Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు ఘనంగా జాతీయ వేడుకలు!

  • Bihar Election: బీహార్ ఎన్నికలు 2025.. ముగిసిన‌ తొలి దశ పోలింగ్, రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదు!

  • 8th Pay Commission: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. 2027 నుండి కొత్త జీతాల నిర్మాణం అమలు!

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd