HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >The Voice Of People Book Launch At Mahanadu Stage

Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్‌ ఆఫ్‌ పీపుల్‌’ పుస్తకావిష్కరణ

చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.

  • By Latha Suma Published Date - 04:55 PM, Wed - 28 May 25
  • daily-hunt
‘The Voice of People’ book launch at Mahanadu stage
‘The Voice of People’ book launch at Mahanadu stage

Nara Lokesh : వైసీపీ పాలనలో నెలకొన్న అరాచకతపై ప్రజలలో చైతన్యం నింపేందుకు యువనేత నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర విశేషాలను “ది వాయిస్ ఆఫ్ పీపుల్” పుస్తకావిష్కరణ తెలుగుదేశం మహానాడు వేదికపై జరగింది. ఈ కార్యక్రమంలో పుస్తకపు తొలి ప్రతిని లోకేశ్‌ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్‌ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు. పాత 11 జిల్లాల్లోని 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు/మున్సిపాలిటీల మీదుగా 2,097 గ్రామాలను సందర్శించారు. పాదయాత్రలో భాగంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యారు. వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం అణిచివేతకు పాల్పడిన అనేక సందర్భాల్లో కూడా లోకేశ్ తన ప్రయాణాన్ని ఆపలేదు.

Read Also: Mock Drill : పాకిస్థాన్‌ సరిహద్దు రాష్ట్రాల్లో మాక్‌ డ్రిల్‌..!

ఈ పుస్తకంలో పాదయాత్రలో ఎదురైన ప్రతి ఒక్క అనుభవాన్ని సచిత్రంగా వివరించారు. ప్రతి అడుగులో కూడా వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించిన తీరును, ప్రజలు పడిన బాధలను, అధికార కక్షసాధింపులను వివరించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న రైతులు, యువత, మహిళలు, వృద్దుల గాథలను కలకళ్లభరితంగా చిత్రీకరించారు. పుస్తకాన్ని చదువుతుంటే, ఆ సమయంలో పాదయాత్రలో ఎదురైన సంఘటనలు కళ్లముందు కదలాడతాయనిపిస్తుంది. పుస్తకాన్ని ఆసక్తిగా తిలకించిన చంద్రబాబు మాట్లాడుతూ ..”లోకేశ్‌ చేసిన యువగళం పాదయాత్ర రాష్ట్ర ప్రజల్లో విశేష స్పందన తెచ్చింది. ఆ పాదయాత్రలో ప్రజల బాధలను నేరుగా చూసి, వినడం ద్వారా సమస్యలపై లోకేశ్‌కు లోతైన అవగాహన వచ్చింది. ఆ అనుభవాలను పుస్తకంగా తీసుకురావడం ద్వారా రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇది కేవలం పాదయాత్ర కాదు, ప్రజల హక్కుల కోసం సాగిన ఉద్యమయాత్ర” అని ప్రశంసించారు.

‘ది వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకం త్వరలోనే ప్రజల ముందుకు రానుంది. పాదయాత్రలోని చరిత్రాత్మక ఘట్టాలు, రాజకీయ మలుపులు, వైసీపీ పాలనలో ఎదురైన అణచివేతలు, ప్రజా జీవితాలపై అవి చూపిన దుష్ప్రభావాలను వెలుగులోకి తీసుకొస్తూ ఈ పుస్తకం వినూత్నంగా నిలవనుంది. యువనేతగా లోకేశ్ చేసిన ప్రయత్నాలకు ఇది దృఢమైన ఆధారంగా నిలుస్తుందనే భావన మహానాడు వేదికపై ప్రతిస్పష్టంగా వ్యక్తమైంది.

Read Also: BSH : విశాఖపట్నంలో సిమెన్స్ బిల్ట్-ఇన్ హోమ్ అప్లయన్సెస్ కార్యకలాపాలు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Chandrababu
  • mahanadu
  • nara lokesh
  • telugu desam party
  • The Voice of People
  • yuva galam padayatra

Related News

YS Jagan

YS Jagan: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర విమర్శలు

ఆరోగ్యశ్రీని ప్రైవేటు బీమా కంపెనీలకు అప్పగించడంపై జగన్ సందేహాలు వ్యక్తం చేశారు. ఇది లాభాలు ఆశించి పనిచేసే ప్రైవేటు కంపెనీలకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికేనని ఆరోపించారు.

  • AP Assembly monsoon session to begin from 18th of this month

    AP Assembly : ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

  • People have immense faith in the judicial system: CM Chandrababu

    Visakhapatnam : న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది : సీఎం చంద్రబాబు

  • YSRCP's actions to tarnish the dignity of teachers are evil: Minister Lokesh

    Nara Lokesh : టీచర్ల గౌరవాన్ని దెబ్బతీసే వైసీపీ చర్యలు దుర్మార్గమైనవి : మంత్రి లోకేశ్‌

  • Nara Lokesh Pm Modi Yuvagalam Coffee Table Book Tdp Ap Govt

    Lokesh : నేడు ప్రధాని మోదీతో లోకేశ్ భేటీ

Latest News

  • Green Chillies : ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా?..అస‌లు రోజుకు ఎన్ని తిన‌వ‌చ్చు..?

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd