HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Massive Encounter In Chhattisgarh Five Maoists Killed

Encounter : ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి

కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.

  • Author : Latha Suma Date : 16-11-2024 - 1:17 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Massive encounter in Chhattisgarh..Five Maoists killed
Massive encounter in Chhattisgarh..Five Maoists killed

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న మాద్ ప్రాంతంలో పోలీసులు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. అంతేకాక మరికొందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు జవాన్లకు సైతం తీవ్ర గాయాలు అయ్యాయి. టేకుమేట, కాకూర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఘటనా స్థలంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఇటీవల కాలంలో వరుసగా ఎదురుకాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఘటనతో మరోసారి ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే కంకేర్ నక్సలైట్ ఎన్‌కౌంటర్‌లో చాలా మంది నక్సలైట్లు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఇక ఈ ఎన్‌కౌంటర్‌ను పోలీసు సూపరింటెండెంట్ ఐకె ఎలిసెలా ధృవీకరించారు.

మరోవైపు ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుండగా, మరింత సమాచారం అందే అవకాశం ఉంది. ఇప్పటికే అక్టోబర్ 4న ఛత్తీస్‌గఢ్‌లో అబుజ్మద్ అడవుల్లో నక్సలైట్లపై చేపట్టిన పెద్ద ఆపరేషన్‌లో 31 మంది నక్సలైట్లు మరణించినట్లు తెలిసింది. అయితే అక్టోబర్ 14న, మావోయిస్టుల ప్రెస్ నోట్‌లో ఈ సంఖ్య 35కి పెరిగినట్లు వెల్లడైంది. ఆ తరువాత, అక్టోబర్ 18న, బస్తర్ ఐజి సుందర్‌రాజ్ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 38 మంది నక్సలైట్లు మరణించారని వెల్లడించారు.

Read Also: Ramamurthy Naidu : సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chhattisgarh
  • encounter
  • Krunker
  • maoist
  • Narayanapur District
  • Soldiers

Related News

    Latest News

    • సౌతాఫ్రికాను చిత్తు చేసి టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న భార‌త్‌!

    • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

    • జ‌గ‌న్‌కు మంత్రి స‌వాల్‌.. పీపీపీ మోడల్ అక్రమమైతే జైలుకు పంపాల‌ని!

    • టీ20 ప్రపంచకప్ 2026.. శ్రీలంక‌కు కొత్త కెప్టెన్‌!

    • ప్యారడైజ్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్‌.. బిర్యానీ పాత్ర‌లో సంపూర్ణేష్ బాబు!

    Trending News

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

      • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd