Edward Coin: రూ.9 కోట్లు ఖరీదు నాణెం.. ఇందులో అంత ప్రత్యేకత ఏం ఉందంటే?
- By Nakshatra Published Date - 07:00 PM, Fri - 3 June 22
పురాతన వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఎంతో అమూల్యమైనవని వాటి విలువ ఏంటి అన్నది ఆ పురాతన వస్తువులను వేలం వేసి నప్పుడు మాత్రమే వాటి యొక్క అసలు విలువ తెలుస్తుంది అని చెబుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ పురాతన వస్తువులు చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నప్పటికీ వాటి ధర కొన్ని కొన్ని సార్లు లక్షల్లో, వేలలో కూడా పలుకుతూ ఉంటుంది. అయితే ఇప్పటికే పలు సార్లు ఇలా పురాతన వస్తువులు వెలుగులోకి వచ్చి వాటిని మ్యూజియం లో పెట్టడం లేదంటే వేలం వేయడం లాంటి ఘటనలు ఇప్పటికే పలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
అయితే మొదట నాణమే అని అనుకున్నప్పటికీ ఆ నాణాన్ని వేలం వేసిన తర్వాత అప్పుడు ఆ నాణం విలువ బయటపడింది. తాజాగా బయటపడిన దాదాపుగా 80 ఏళ్ళ క్రితం నాటిది. అయితే దాని ప్రత్యేకత ఏమిటంటే ఆ నాణం పైన బ్రిటన్ రాజు ఎడ్వర్డ్ బొమ్మ కూడా ముద్రించి ఉంది. ఇలాంటి నాణం లు ప్రపంచవ్యాప్తంగా చాలా అరుదుగా ఉన్నాయని అందుకే ఈ నాణం వేలానికి పెట్టగానే డబ్బులు లెక్క చేయకుండా ఉన్నామని అన్నారు ఒక వ్యక్తి.
1936 లో కింగ్ ఎడ్వర్డ్ అమెరికన్ మహిళా విల్లిస్ ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని,అందుకుగాను పెద్దలు ఎవరు ఒప్పుకోకపోవడంతో అతడు ఏకంగా తన రాజ సింహాసనాన్ని వదులుకోవాలని భావించాడట. అప్పట్లో ఈ విషయం పెద్ద ప్రాచుర్యం పొందింది. ఆ కాలానికి చెందిన నాణం కావడంతో దీనికి అంతటి విలువ ఉన్నది అని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రదేశాలలో ఇలాంటి నాణేలు దొరికిన విషయం తెలిసిందే. కానీ కొందరు వాటిని ఇలా వేలం వేస్తూ డబ్బు సంపాదిస్తూ ఉంటారు.
Tags
Related News
60 Crores Painting : ఈ పెయింటింగ్ 60 కోట్లు.. అందులో ఇంట్రెస్టింగ్ స్టోరీ
60 Crores Painting : 2008 సంవత్సరంలో వేలంలో రూ.32 లక్షలే పలికిన ఒక పెయింటింగ్ కు దశ తిరగనుంది..వచ్చే నెలలో లండన్ లోని సోత్ బే (Sotheby's)లో మళ్ళీ వేలానికి రానున్న ఈ పెయింటింగ్ రూ.60 కోట్లకు పైనే రేటు పలకొచ్చని అంచనా వేస్తున్నారు.