HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Bjps Mission South India Target 130 Seats

BJP Mission ‘South India’: బీజేపీ ‘మిషన్ సౌత్ ఇండియా’: టార్గెట్‌ 130 సీట్లు

దేశవ్యాప్తంగా 978 జిల్లాలు, 15 వేల 923 మండలాలు, 10 లక్షల 56 వేల 2 బూత్‌లలో సంస్థాగతంగా బీజేపీ చాలా పఠిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ..

  • Author : Dinesh Akula Date : 09-04-2023 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp's 'mission South India'..! Target 130 seats
Bjp's 'mission South India'..! Target 130 seats

By: దినేష్ ఆకుల

BJP Mission ‘South India’ : ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ గత 9 ఏళ్లలో దేశంలో అతివేగంగా విస్తరించింది. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా 10 లక్షల 72 వేలకు పైగా చోట్ల బీజేపీ కార్యకర్తలు , నాయకులు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా 978 జిల్లాలు, 15 వేల 923 మండలాలు, 10 లక్షల 56 వేల 2 బూత్‌లలో సంస్థాగతంగా BJP చాలా పఠిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ హోదాకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల బిజెపికి తిరుగులేని కోటగా మారాయి.

కర్ణాటకలో బిజెపి బలంగా ఉండటమే కాకుండా అక్కడ అనేక సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో పుంజుకుంటున్నా.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలోనే పార్టీ పనితీరుపై అనుమానాలున్నాయి. కానీ దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రాలే కీలకం కాబోతున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి కలిపి 130 మంది ఎంపీలను లోక్‌సభకు పంపగా, అందులో 29 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఇందులో ఒక్క కర్ణాటక నుంచి 25 సీట్లు, తెలంగాణ నుంచి 4 సీట్లు వచ్చాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు.

దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, దక్షిణ భారతదేశంలో బీజేపీ మరోసారి తన పూర్తి సత్తాను చాటుతున్నట్లు కనిపిస్తోంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఈసారి సొంతంగా పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. కర్నాటకలో 150 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే తెలంగాణ ఈ ఏడాది చివర్లో శాసనసభకు వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటాలను ఉధృతం చేసింది. అదే సమయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం పూర్తిగా మోదీ కరిష్మాపైనే ఆధారపడటంతో పాటు మిషన్ సౌత్ ఇండియా కింద, పార్టీ ఇతర పార్టీల ముఖ్యమైన నాయకులను కూడా తమతో కలుపుకునేందుకు ట్రైచేస్తోంది.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, కేంద్రమంత్రులందరూ దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ శనివారం కూడా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర ప్రజలకు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. మూడు రోజులుగా, ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ఢిల్లీలో పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమైన క్రమంగా పట్టు సాధించాలని ప్లాన్‌ చేస్తోంది. అనిల్ ఆంటోనీ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, , స్వాతంత్ర్య సమరయోధుడు సి.రాజగోపాలాచారి మునిమనవడు సి.ఆర్.కేశవన్‌ వంటి వారినిచేర్చుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపతానికి కృషి చేస్తోంది.

Also Read:  Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 130 Seats
  • bjp
  • india
  • Mission
  • narendra modi
  • nda
  • pm modi
  • south india
  • Target

Related News

Pakistan extends ban on Indian flights

భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన పాకిస్తాన్

పాకిస్తాన్ తన గగనతలాన్ని భారతీయ విమానయాన సంస్థలకు మూసివేసే ఆంక్షలను జనవరి 23, 2026 వరకు పొడిగించినట్లు తెలిపింది. ఈ ఆంక్షలు, రెండు దేశాల మధ్య వాణిజ్య, సైనిక మరియు సాంకేతిక పరమైన విమాన చలనం మీద తీవ్ర ప్రభావాన్ని చూపవచ్చని విమానయాన నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • PM Modi

    11 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీకి 27 దేశాల అత్యున్నత పురస్కారాలు!

  • Oman

    ఒమన్‌ చేరుకున్న ప్రధాని మోదీ.. ఆ దేశ క‌రెన్సీ విశేషాలీవే!

  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

  • Congress

    Telangana Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ హస్తం హావ !!

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd