HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Bjps Mission South India Target 130 Seats

BJP Mission ‘South India’: బీజేపీ ‘మిషన్ సౌత్ ఇండియా’: టార్గెట్‌ 130 సీట్లు

దేశవ్యాప్తంగా 978 జిల్లాలు, 15 వేల 923 మండలాలు, 10 లక్షల 56 వేల 2 బూత్‌లలో సంస్థాగతంగా బీజేపీ చాలా పఠిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ..

  • Author : Dinesh Akula Date : 09-04-2023 - 12:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bjp's 'mission South India'..! Target 130 seats
Bjp's 'mission South India'..! Target 130 seats

By: దినేష్ ఆకుల

BJP Mission ‘South India’ : ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చెప్పుకుంటున్న బీజేపీ గత 9 ఏళ్లలో దేశంలో అతివేగంగా విస్తరించింది. ఏప్రిల్ 6న పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినడానికి దేశవ్యాప్తంగా 10 లక్షల 72 వేలకు పైగా చోట్ల బీజేపీ కార్యకర్తలు , నాయకులు సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా 978 జిల్లాలు, 15 వేల 923 మండలాలు, 10 లక్షల 56 వేల 2 బూత్‌లలో సంస్థాగతంగా BJP చాలా పఠిష్టంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ హోదాకు చేరుకుంది. పశ్చిమ బెంగాల్ లాంటి చోట్ల బిజెపికి తిరుగులేని కోటగా మారాయి.

కర్ణాటకలో బిజెపి బలంగా ఉండటమే కాకుండా అక్కడ అనేక సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణలో పుంజుకుంటున్నా.. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లలోనే పార్టీ పనితీరుపై అనుమానాలున్నాయి. కానీ దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలకు ఈ రాష్ట్రాలే కీలకం కాబోతున్నాయి. కర్నాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి కలిపి 130 మంది ఎంపీలను లోక్‌సభకు పంపగా, అందులో 29 సీట్లు మాత్రమే బీజేపీకి ఉన్నాయి. ఇందులో ఒక్క కర్ణాటక నుంచి 25 సీట్లు, తెలంగాణ నుంచి 4 సీట్లు వచ్చాయి. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ, పుదుచ్చేరిలో బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు.

దీంతో 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, దక్షిణ భారతదేశంలో బీజేపీ మరోసారి తన పూర్తి సత్తాను చాటుతున్నట్లు కనిపిస్తోంది. మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, ఈసారి సొంతంగా పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. కర్నాటకలో 150 సీట్లు గెలుచుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావించే తెలంగాణ ఈ ఏడాది చివర్లో శాసనసభకు వెళ్లాల్సి ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాటాలను ఉధృతం చేసింది. అదే సమయంలో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకోసం పూర్తిగా మోదీ కరిష్మాపైనే ఆధారపడటంతో పాటు మిషన్ సౌత్ ఇండియా కింద, పార్టీ ఇతర పార్టీల ముఖ్యమైన నాయకులను కూడా తమతో కలుపుకునేందుకు ట్రైచేస్తోంది.

ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, కేంద్రమంత్రులందరూ దక్షిణ భారతదేశంలోని ఈ రాష్ట్రాల్లో నిరంతరం పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ శనివారం కూడా తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో పర్యటించి రాష్ట్ర ప్రజలకు కోట్లాది రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. మూడు రోజులుగా, ఈ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలను ఢిల్లీలో పార్టీలో చేర్చుకోవడం ద్వారా ముఖ్యమైన క్రమంగా పట్టు సాధించాలని ప్లాన్‌ చేస్తోంది. అనిల్ ఆంటోనీ కుమారుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, , స్వాతంత్ర్య సమరయోధుడు సి.రాజగోపాలాచారి మునిమనవడు సి.ఆర్.కేశవన్‌ వంటి వారినిచేర్చుకోవడం ద్వారా ఆయా రాష్ట్రాల్లో పార్టీ బలోపతానికి కృషి చేస్తోంది.

Also Read:  Dhoni Behind Rahane’s Destruction: రహానే విధ్వంసం వెనుక ధోని హస్తం…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 130 Seats
  • bjp
  • india
  • Mission
  • narendra modi
  • nda
  • pm modi
  • south india
  • Target

Related News

Four gangsters killed in encounter in Gurugram

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Teejan Bai Passes Away

    Teejan Bai : పాండవానీ కళకు తీరని లోటు .. పద్మ విభూషణ్ గ్రహీత తీజన్ బాయి కన్నుమూత‌

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd