Hyderabad Students: అమెరికాలో ఇద్దరు హైదరాబాదీలు మృతి.. యూఎస్ లోనే అంత్యక్రియలు..!
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు (Students)ప్రాణాలు కోల్పోయారు.
- By Gopichand Published Date - 09:20 AM, Thu - 27 April 23
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఇద్దరు మాస్టర్స్ విద్యార్థులు (Students)ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు హైదరాబాదీలకు కెంటకీలోని జాన్స్బర్గ్ హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ అనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో విద్యార్థికి తీవ్రగాయాలవడంతో అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కాగా మహ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించారు. నమాజ్-ఎ-జనాజా అని పిలువబడే అంత్యక్రియల ప్రార్థనలు సెయింట్ లూయిస్లోని దార్ ఉల్ ఇస్లాం మసీదులో జరిగాయి. అనంతరం మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు.
Two hyderabadi youths Mohd Faisal and Ishamuddin who died after an accident in Kentucky, Johnsburg highway there Namaz E Janaza was performed at Daar Ul Islam Masjid, St Louis and burial was also completed. pic.twitter.com/NEZnWlyCIw
— Amjed Ullah Khan MBT (@amjedmbt) April 25, 2023
గత నెలలో భారతదేశానికి చెందిన నార్త్వెస్ట్ మిస్సౌరీ స్టేట్ యూనివర్శిటీ విద్యార్థి, సాహితీ US హైవే 71లో స్నేహితుడితో ప్రయాణిస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. తీవ్రంగా గాయపడిన సాహితీని మిస్సౌరీలోని సెయింట్ జోసెఫ్లోని మొజాయిక్ లైఫ్ కేర్కు తరలించారు. మరొక దురదృష్టకర సంఘటనలో న్యూజెర్సీలోని ప్లెయిన్స్బోరోలో నివాసం ఉంటున్న ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాకు చెందిన శ్రీకాంత్ దిగాలా అనే 39 ఏళ్ల వ్యక్తి ప్రిన్స్టన్ జంక్షన్ స్టేషన్లో రైలు ఢీకొని మరణించాడు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.